AP Floods: వరద బాధితులకు అండగా నిలిచిన టాలీవుడ్‌ హీరోలు

ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ నటులు ముందుకొచ్చారు. తమ వంతు సాయం చేసి ఉదారత చాటుకున్నారు.

Published : 02 Dec 2021 01:18 IST

హైదరాబాద్‌: ఆంధ్రప్రదేశ్‌ వరద బాధితులను ఆదుకునేందుకు పలువురు సినీ నటులు ముందుకొచ్చారు. తమ వంతు సాయం చేసి ఉదారతను చాటుకున్నారు. ఈ మేరకు ఏపీ ముఖ్యమంత్రి సహాయనిధికి విరాళాలు ప్రకటించారు. భారీ వర్షాల కారణంగా నిరాశ్రయులైన వారిని ఆదుకోవాలని సామాజిక మాధ్యమాల వేదికగా తమ అభిమానులకు పిలుపునిచ్చారు. జూనియర్‌ ఎన్టీఆర్‌, మహేశ్‌ బాబు, చిరంజీవి, రామ్‌చరణ్‌ ఒక్కొక్కరు రూ. 25 లక్షలు విరాళం ప్రకటించారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్‌ రూ. 10 లక్షలు విరాళం ప్రకటించిన విషయం తెలిసిందే.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని