Tollywood Drugs Case: డ్రగ్స్‌ కేసులో ముగిసిన నటి ఛార్మి విచారణ

తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌

Published : 02 Sep 2021 18:54 IST

హైదరాబాద్‌:  తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం సృష్టించిన డ్రగ్స్‌ కేసులో ప్రముఖ నటి, నిర్మాత ఛార్మి ఈడీ విచారణ ముగిసింది. దాదాపు ఎనిమిది గంటల పాటు ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌(ఈడీ) అధికారులు ఆమెను విచారించారు. మనీ లాండరింగ్ చట్టం కింద సినీరంగానికి చెందిన 12 మందికి ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఇవాళ ఛార్మిని ఈడీ కార్యాలయంలో ప్రశ్నించారు. ఆమె బ్యాంకు ఖాతాలను పరిశీలించిన అధికారులు.. అనుమానాస్పదంగా కనిపించిన లావాదేవీలపై ఆరా తీశారు.

విచారణ ముగిసిన తర్వాత ఛార్మి మీడియాతో మాట్లాడుతూ...‘‘ ఈడీ అధికారులు నోటీసులు ఇవ్వడంతో విచారణకు హాజరయ్యా. అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు సమాధానం ఇచ్చా. దర్యాప్తునకు పూర్తిగా సహకరిస్తా. నన్ను అడిగిన బ్యాంకు డాక్యుమెంట్లు అన్నీ ఈడీ అధికారులకు సమర్పించా. ఈడీ అధికారులు ఎప్పుడు విచారణకు రావాలని పిలిచినా వస్తా. కేసు దర్యాప్తు కొనసాగుతోంది. దీని గురించి ఎక్కువ మాట్లాడలేను’’ అని ఛార్మి వివరించారు. 

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని