Tollywood:మెరుపుల కొత్త తారకలు
తెలుగు చిత్రసీమ ఓ పుష్పక విమానం. ఏటా ఎంతమంది కొత్త తారలొచ్చినా.. మరొకరికి చోటు ఉంటూనే ఉంటుంది. అయితే అలా వచ్చీ రాగానే విజయాన్ని అందుకొని.. వరుస అవకాశాలతో దూసుకెళ్లే తారలు తక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఈ ఏడాది అలా జోరు చూపించిన కొత్త నాయకానాయికలు చాలా మందే ఉన్నారు. మరి ఆ తారలెవరు? ఈ ఏడాది వారి సినీ ప్రయాణం ఎలా సాగిందో చదివేద్దాం...
2021లో అలరించిన నయా నాయకానాయికలు
తెలుగు చిత్రసీమ ఓ పుష్పక విమానం. ఏటా ఎంతమంది కొత్త తారలొచ్చినా.. మరొకరికి చోటు ఉంటూనే ఉంటుంది. అయితే అలా వచ్చీ రాగానే విజయాన్ని అందుకొని.. వరుస అవకాశాలతో దూసుకెళ్లే తారలు తక్కువ సంఖ్యలోనే ఉంటారు. ఈ ఏడాది అలా జోరు చూపించిన కొత్త నాయకానాయికలు చాలా మందే ఉన్నారు. మరి ఆ తారలెవరు? ఈ ఏడాది వారి సినీ ప్రయాణం ఎలా సాగిందో చదివేద్దాం.
కొత్త హీరోల్లో.. ఆ ఇద్దరే
ప్రతి ఏడాదిలాగే ఈ సంవత్సరం కూడా ఎంతో మంది కొత్త హీరోలు వెండితెరపై అదృష్టం పరీక్షించుకున్నారు. వారిలో తొలి ప్రయత్నంలోనే విజయాన్ని అందుకుంది వైష్ణవ్ తేజ్, తేజ సజ్జానే. ఈ ఇద్దరూ ఒకే నెలలో హీరోలుగా తెరకు పరిచయమవడం విశేషం. తొలి సినిమాతోనే ఓవర్ నైట్ స్టార్గా ఎదిగిన కథానాయకులు ఇటీవల కాలంలో తెలుగు తెరపై పెద్దగా కనిపించలేదు. కానీ, ఈ ఏడాది ‘ఉప్పెన’తో ఆ మ్యాజిక్ను చేసి చూపించారు వైష్ణవ్ తేజ్. కొత్త దర్శకుడు బుచ్చిబాబు సానా తెరకెక్కించిన చిత్రమిది. ఫిబ్రవరి 12న ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా.. బాక్సాఫీస్ ముందు ఉప్పెనలా వసూళ్ల వర్షం కురిపించింది. ఇందులో ఆశీగా వైష్ణవ్ నటనకు సినీప్రియులు జేజేలు పలికారు. ఇక ఈ ఏడాది ఆయన నుంచి వచ్చిన మరో సినిమా ‘కొండపొలం’. క్రిష్ తెరకెక్కించిన ఈ చిత్రానికి ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన లభించినా.. నటుడిగా వైష్ణవ్కు మంచి మార్కులే పడ్డాయి.
‘చూడాలని ఉంది’, ‘ఇంద్ర’, ‘గంగోత్రి’, ‘ఛత్రపతి’ లాంటి ఎన్నో విజయవంతమైన చిత్రాల్లో నటించి బాల నటుడిగా సత్తా చాటాడు తేజ సజ్జా. 2019లో వచ్చిన సమంత ‘ఓ బేబీ’ చిత్రంలో ఓ కీలక పాత్రలో నటించి మెప్పించాడు. ఈ ఏడాది ‘జాంబిరెడ్డి’తో హీరోగా తెరకు పరిచయమయ్యాడు. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ విభిన్నమైన వినోదాత్మక యాక్షన్ థ్రిల్లర్.. ఫిబ్రవరి 5న విడుదలై విజయాన్ని అందుకుంది. ఈ సినిమా తర్వాత తేజ నుంచి వచ్చిన ‘ఇష్క్’ పూర్తిగా నిరాశ పరచగా.. ‘అద్భుతం’ మిశ్రమ స్పందన దక్కించుకుంది.
నాయికల జోరు..
చూపు తిప్పుకోనివ్వని అందం.. ఆకట్టుకునే అభినయంతో ‘ఉప్పెన’లా తెలుగు తెరపైకి దూకిన సోయగం కృతి శెట్టి. సినిమా విడుదలకు ముందే పాటలు, ప్రచార చిత్రాలతో సినీప్రియుల్లో క్రేజ్ సంపాదించుకున్న ఈ ‘బేబమ్మ’.. ‘ఉప్పెన’ విడుదల తర్వాత మోస్ట్ వాంటెడ్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ‘శ్యామ్ సింగరాయ్’తో అలరించేందుకు సిద్ధమవుతున్న ఈ కన్నడ కస్తూరి.. వచ్చే ఏడాది ‘బంగార్రాజు’, ‘ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి’, ‘మాచర్ల నియోజకవర్గం’ సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేయనుంది. అలాగే రామ్ - లింగుస్వామి కలయికలో రూపొందుతోన్న చిత్రంలోనూ నాయికగా నటిస్తోంది. ‘జాతిరత్నాలు’ సినిమాతో చిట్టిగా సినీప్రియుల్ని నవ్వుల జల్లుల్లో తడిపేసిన తెలుగందం ఫరియా అబ్దుల్లా. నాగ్ అశ్విన్ నిర్మాణంలో అనుదీప్ తెరకెక్కించిన ఈ వినోదాత్మక చిత్రం.. మార్చి 11న విడుదలై మంచి వసూళ్లు అందుకొంది. ఇందులో నవీన్ పొలిశెట్టి, ప్రియదర్శి, రాహుల్ రామకృష్ణలతో కలిసి ఫరియా చేసిన అల్లరి ప్రేక్షకుల్ని కడుపుబ్బా నవ్వించింది. ఇటీవలే అఖిల్ ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’లోనూ తళుక్కున మెరిసి మురిపించింది. ప్రస్తుతం నాగర్జున, నాగచైతన్యలతో కలిసి ‘బంగార్రాజు’ చిత్రంలో ఓ ప్రత్యేక గీతంలో ఆడిపాడింది. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ‘షాదీ ముబారక్’తో తొలి అడుగులోనే విజయాన్ని అందుకున్న మరో సోయగం దృశ్యా రఘునాథ్. పెళ్లి చూపుల నేపథ్యం చుట్టూ అల్లుకున్న ఆసక్తికర ప్రేమకథాంశంతో రూపొందిన ఈ సినిమాలో తుపాకుల సత్యభామగా దృశ్య నటన ప్రేక్షకుల్ని కట్టిపడేసింది.'
ఈ ఏడాదే తెలుగు తెరపై మెరిసి.. జయాపజయాలతో సంబంధం లేకుండా జోరు చూపించిన భామలు చాలా మందే ఉన్నారు. వారిలో ప్రధానంగా చెప్పుకోవాల్సింది కేతిక శర్మ, శ్రీలీల, మీనాక్షి చౌదరి, అమృత అయ్యర్ల గురించే. ‘లింగా’, ‘బిగిల్’ లాంటి తమిళ చిత్రాలతో తెలుగు ప్రేక్షకులకూ సుపరిచితమైన సోయగం అమృతా అయ్యర్. రామ్ నటించిన ‘రెడ్’తో టాలీవుడ్లోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత వచ్చిన ‘30రోజుల్లో ప్రేమించటం ఎలా?’ సినిమాతో నటిగా చక్కటి గుర్తింపు దక్కించుకుంది. ఇందులో ప్రదీప్కు జోడీగా ‘అమ్మాయిగారు’ పాత్రలో అమృత నటనకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభించింది. ప్రస్తుతం ఆమె ప్రశాంత్ వర్మ తెరకెక్కిస్తున్న పాన్ ఇండియా సినిమా ‘హనుమాన్’లో నాయికగా నటిస్తోంది. సుశాంత్ హీరోగా నటించిన ‘ఇచ్చట వాహనములు నిలుపరాదు’ చిత్రంతో నాయికగా తెలుగు తెరపై కాలుమోపింది మీనాక్షి చౌదరి. ఈ సినిమా బాక్సాఫీస్ ముందు సత్తా చాటలేకపోయినా.. నటిగా మీనాక్షికి మంచి గుర్తింపే తీసుకొచ్చింది.
నిజానికి ఈ చిత్రం విడుదలకు ముందే ఆమె రవితేజ సరసన ‘ఖిలాడి’లో నటించే అవకాశం దక్కించుకుంది. దీంతో పాటు అడివిశేష్ హీరోగా నటిస్తున్న ‘హిట్ 2’లోనూ నాయికగా నటిస్తోంది. ‘రొమాంటిక్’ సినిమాతో.. తొలి అడుగులోనే కుర్రాళ్ల గుండెల్లో గుబులు రేపిన ఉత్తరాది సోయగం కేతిక శర్మ. తనదైన హాట్ లుక్స్తో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేసిన ఈ రొమాంటిక్ భామ.. ఇటీవలే రెండో ప్రయత్నంగా ‘లక్ష్య’తో బాక్సాఫీస్ ముందుకొచ్చింది. ఈ రెండు సినిమాలు చేదు ఫలితాలే అందించినా.. తనదైన అందచందాలతో నటిగా ప్రేక్షకులపై బలమైన ముద్రే వేసింది కేతిక. ఆమె ప్రస్తుతం వైష్ణవ్ తేజ్కు జోడీగా ఓ కొత్త చిత్రంలో నటిస్తోంది. కె.రాఘవేంద్రరావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందిన ‘పెళ్లి సందడి’ సినిమాతో వెండితెరపై మెరిసిన కొత్తందం శ్రీలీల. తెలుగు నాట పుట్టి.. కన్నడ సినిమాలతో సత్తా చాటిన ఈ నయా నాయిక..తెలుగులో తొలి చిత్రంతోనే అందరి దృష్టినీ ఆకర్షించింది. అందుకే జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస ఆఫర్లతో జోరు చూపిస్తోంది. ప్రస్తుతం రవితేజ సరసన ‘ధమాకా’లో నటిస్తున్న ఆమె.. త్వరలో శర్వానంద్, నిఖిల్ సినిమాల్లో నటించనున్నట్లు ప్రచారం వినిపిస్తోంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ
-
అమెరికా నివేదికకు విలువ లేదు.. ‘మానవ హక్కుల ఉల్లంఘన’ అంశంపై భారత్ సీరియస్
-
ఆన్లైన్లో తెగ కొనేస్తున్నారు.. తొలిసారి ₹1 లక్ష కోట్లు దాటిన క్రెడిట్ కార్డ్ వ్యయం