Trisha: అరుదైన గౌరవం దక్కించుకున్న నటి త్రిష 

యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్‌ వీసా’ని ప్రముఖ నటి త్రిష  అందుకున్నారు. ఈ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్‌గా నిలిచారు.

Published : 04 Nov 2021 01:44 IST

దుబాయ్‌: యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ) జారీ చేసే ‘గోల్డెన్‌ వీసా’ని ప్రముఖ నటి త్రిష అందుకున్నారు. ఈ వీసా పొందిన తొలి తమిళ యాక్టర్‌గా నిలిచారు. సోషల్‌ మీడియా వేదికగా ఈ విషయాన్ని తెలియజేస్తూ తన ఆనందాన్ని వ్యక్తం చేశారు. వీసా అందుకుంటున్న ఫొటోని అభిమానులతో పంచుకున్నారు. అబుదాబి ప్రభుత్వం సినిమా రంగాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు వేస్తోంది. స్థానికంగా, అంతర్జాతీయంగా ఉన్న కొత్త ప్రతిభని ప్రోత్సహించనుంది. ఈ నేపథ్యంలోనే ఇటీవల మలయాళీ నటుడు దుల్కర్‌ సల్మాన్‌, ప్రముఖ గాయని చిత్రకి ఈ వీసాని అందించింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని