Uniki: ‘ఉనికి’ చాటిందా?

ఆశిష్‌గాంధీ కథానాయకుడిగా ఎవర్‌గ్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఉనికి’. చిత్రశుక్లా  కథానాయిక. రాజ్‌కుమార్‌ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ ఏడిద, రాజేష్‌ బొబ్బూరి

Updated : 20 Dec 2021 06:57 IST

ఆశిష్‌గాంధీ కథానాయకుడిగా ఎవర్‌గ్రీన్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘ఉనికి’. చిత్రశుక్లా  కథానాయిక. రాజ్‌కుమార్‌ బాబీ దర్శకత్వం వహిస్తున్నారు. బాబీ ఏడిద, రాజేష్‌ బొబ్బూరి నిర్మాతలు. గణతంత్ర దినోత్సవం సందర్భంగా జనవరి 26న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. నిర్మాతలు మాట్లాడుతూ ‘‘ఒక మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన ఓ యువతి కష్టపడి చదివి కలెక్టర్‌ అవుతుంది. సమాజానికి మంచి చేయాలనుకున్న ఆమెకి ఎటువంటి పరిస్థితులు ఎదురయ్యాయి? వాటిని ఎలా అధిగమించి తన ‘ఉనికి’ని చాటుకుందనేది తెరపైనే చూడాలి. థ్రిల్లర్‌ డ్రామాగా రూపొందిన ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకుల్ని అలరించేలా ఉంటుంది. ఇప్పటికే సినిమాలో రెండు పాటల్ని విడుదల చేశాం. రెండింటికీ మంచి స్పందన లభించింద’’న్నారు. టీఎన్నార్‌, రంగస్థలం నాగమహేష్‌, అప్పాజీ అంబరీష, ప్రభావతి తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: పెద్దపల్లి రోహిత్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని