Tollywood: చిరు.. బాలకృష్ణ.. నాగచైతన్య.. అఖిల్ ఎప్పుడొస్తారు?
ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియదు. కరోనా కల్లోలం ప్రభావం ఫలితమే అదంతా. తొలి కాపీతో సి
ఏ సినిమా ఎప్పుడు ప్రేక్షకుల ముందుకొస్తుందో తెలియదు. కరోనా కల్లోలం ప్రభావం ఫలితమే అదంతా. తొలి కాపీతో సిద్ధమైన సినిమాలు కూడా వేచి చూడాల్సి వస్తోంది. ఇక సెట్స్పై ఉన్న సినిమాల సంగతి సరే సరి. వాటి చిత్రీకరణ సజావుగా సాగాలి, విజయవంతంగా పూర్తి కావాలి, విడుదల కోసం థియేటర్ల దగ్గర తగిన ఖాళీ దొరకాలి. అప్పుడు కానీ బొమ్మ తెరపై పడే అవకాశం ఉండదు. అయినా సరే... సినీ వర్గాలు మాత్రం ఎప్పట్లాగే విడుదల కోసం కట్చీప్లు వేయడం మొదలు పెట్టేశాయి. అధిక వ్యయంతో తెరకెక్కిన తారల సినిమాలన్నీ పండగల్ని చూసుకుని తేదీల్ని ప్రకటించాయి. పరిమిత వ్యయంతో తెరకెక్కిన సినిమాలేమో... ఇదే అదను అన్నట్టుగా వారం వారం ప్రేక్షకుల ముందుకొస్తున్నాయి. మరికొన్ని ఓటీటీ వేదికల్ని ఎంచుకున్నాయి. మొత్తంగా రెండో దశ కరోనా తర్వాత మళ్లీ విడుదల తేదీలపై ఓ స్పష్టతైతే వచ్చింది. మరి అనుకున్నట్టు విడుదలవుతాయా లేదా అనే సంగతిని మాత్రం కాలమే నిర్ణయించాలి. అయితే ఇంకా కొన్ని కీలకమైన సినిమాలు ఇప్పటికీ విడుదల తేదీల్ని ప్రకటించలేదు. మరి వాటి పయనం ఎటు? ప్రేక్షకుల ముందుకు ఎప్పుడొస్తాయి?
దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి... టాలీవుడ్ ఈ బెర్తులన్నిటినీ ఎప్పుడో నింపేసింది. దసరాకి ‘ఆర్ ఆర్ ఆర్’, దీపావళికి ‘గని’, ‘అన్నాత్తే’, క్రిస్మస్కి ‘పుష్ప’, ‘కె.జి.ఎఫ్2’, సంక్రాంతికేమో పవన్కల్యాణ్ - రానా ‘భీమ్లా నాయక్’, మహేష్బాబు ‘సర్కారు వారి పాట’, ప్రభాస్ ‘రాధేశ్యామ్’. ఇలా వచ్చే ఏడాదివరకు బాక్సాఫీసుకి విరామమే కనిపించడం లేదు. ఇప్పుడున్న పరిస్థితుల్లోనేమో అగ్ర తారల సినిమాల్ని విడుదల చేసుకోలేని పరిస్థితి. ఆంధ్రప్రదేశ్లో లాక్డౌన్ ఆంక్షలు కొనసాగుతున్నాయి. టికెట్ ధరల సమస్య కొలిక్కి రాలేదు. అందుకే ఈ రెండు నెలల్ని చిన్న సినిమాలకే వదిలేసింది చిత్రసీమ. సెప్టెంబరులో పలు సినిమాలు విడుదల తేదీల్ని ఖరారు చేసుకున్నాయి. కానీ తుదిదశకు చేరుకున్న ‘ఆచార్య’, ‘అఖండ’, ఇప్పటికే పూర్తయిన ‘లవ్స్టోరి’, ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ సినిమాల విడుదల ఎప్పుడనేదే ఇంకా ఖరారు కాలేదు.
దసరానే లక్ష్యమా?
బలమైన అభిమానగణం ఉన్న అగ్ర తారలు చిరంజీవి, బాలకృష్ణ. వాళ్లు నటించిన ‘ఆచార్య’, ‘అఖండ’ తుదిదశకు చేరుకున్నాయి. ఆ సినిమాలు కూడా ఈ ఏడాదిలోనే విడుదల కానున్నాయి. కానీ ఎప్పుడనేదే ఆసక్తికరంగా మారింది. ఈ చిత్రాల వ్యూహం ఏమిటనేది ఇంకా తేలడం లేదు. పరిశ్రమ వర్గాలు మాత్రం దసరానే వీటి లక్ష్యం అని చెబుతున్నాయి. అక్టోబరు 13న ‘ఆర్ ఆర్ ఆర్’ విడుదల ఖరారైనప్పటికీ, ఆ నెల ప్రథమార్థంపైనే ఈ రెండు సినిమాలు కన్నేశాయనేది పరిశ్రమ వర్గాలు చెబుతున్న మాట. ప్రకటించిన సినిమాల విడుదల తేదీలు కూడా అనూహ్యంగా వాయిదా పడుతున్నాయి. వాటి స్థానంలో ఎవరూ ఊహించని చిత్రాలు ముందుకొస్తున్నాయి. మరి రానున్న రోజుల్లో ఏ సినిమా ఎప్పటికి వాయిదా పడుతుందో, వాటి స్థానంలో ఏ కొత్త సినిమా ప్రేక్షకుల ముందుకొస్తుందో చూడాలి.
‘లవ్స్టోరి’ ఎదురు చూపులు
థియేటర్లలో విడుదల కోసమే ఎప్పట్నుంచో ఎదురు చూస్తోంది ‘లవ్స్టోరి’. రెండు రాష్ట్రాల్లో థియేటర్లు పూర్తిస్థాయిలో తెరుచుకున్నాక విడుదల చేయాలనుకున్నారు నిర్మాతలు. ఆంధ్రప్రదేశ్లో టికెట్ల సమస్య కొలిక్కి రావడం లేదు. అక్కడ కరోనా ఆంక్షలు కూడా ఇంకా కొనసాగుతున్నాయి కాబట్టి సెకండ్ షో ప్రదర్శన కష్టం. అన్ని పరిస్థితులు అక్కడ అనుకూలం కాగానే... ఏ క్షణంలోనైనా ‘లవ్స్టోరి’ విడుదల తేదీని ప్రకటించే అవకాశాలు కనిపిస్తున్నాయి. సెప్టెంబర్లో వినాయక చవితి సందడి కూడా ఉంటుంది కాబట్టి, ఆ సమయంలోనే విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నట్టు తెలిసింది. నాగచైతన్య సోదరుడు అఖిల్ అక్కినేని కథానాయకుడిగా నటించిన ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్’ చిత్రీకరణ కూడా పూర్తయింది. కానీ విడుదల ఎప్పుడనేది ఇంకా ఖరారు కాలేదు. మరి అది ఓటీటీలోనే విడుదలవుతుందా లేక, థియేటర్లలోనే అనేది తెలియాలంటే మరికొన్నాళ్లు ఆగాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
అక్షయ్కుమార్, పంకజ్ త్రిపాఠి కీలక పాత్రల్లో నటించిన ‘ఓఎంజీ2’ తెలుగు వెర్షన్ ఇప్పుడు స్ట్రీమింగ్కు తీసుకొచ్చింది జియో సినిమా. -
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
శునకంతో పోల్చుతూ ట్రోల్ చేశారు.. భావోద్వేగానికి గురైన హీరో
తనపై వచ్చిన ట్రోల్స్ చూసి ఎంతో బాధపడినట్లు బాలీవుడ్ హీరో ఆయుష్ శర్మ చెప్పారు. -
ఆ అవార్డు వేడుకలో అవమానించారు: విద్యా బాలన్
నటి విద్యా బాలన్ తన కెరీర్ తొలినాళ్లలో జరిగిన అవమానాన్ని గుర్తుచేసుకున్నారు. -
బాలీవుడ్ హీరోతో సినిమా.. దర్శకుడు వంశీ పైడిపల్లి ఏమన్నారంటే?
‘బృందావనం’, ‘ఎవడు’, ‘ఊపిరి’ తదితర చిత్రాలతో మెప్పించిన దర్శకుడు వంశీ పైడిపల్లి. తన తదుపరి ప్రాజెక్టు బాలీవుడ్ హీరోతో ఉండనుందన్న వార్తలపై ఆయన స్పందించారు. -
అభిమాన హీరోను కొట్టాలంటే భయమేసింది: మృణాల్ ఠాకూర్
బాలీవుడ్ హీరో షాహిద్ కపూర్ అంటే తనకెంతో ఇష్టమని నటి మృణాల్ ఠాకూర్ అన్నారు. ఆయనతో కలిసి నటించిన సినిమాలోని సన్నివేశాలు ఎప్పటికీ మర్చిపోలేనన్నారు. -
‘యానిమల్’ టూ రామాయణ’.. రణబీర్ ట్రాన్స్ఫర్మేషన్ షేర్ చేసిన ట్రైనర్
‘రామాయణ’ కోసం రణ్బీర్ సిద్ధమవుతున్నారు. ఆ ఫొటోలను ఆయన జిమ్ ట్రైనర్ పోస్ట్ చేశారు. -
ఆ ఒక్క సాంగ్ చేయలేకపోతే ఇండస్ట్రీని వదిలేద్దామనుకొన్నా: సోనాలి బింద్రే
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సోనాలి తన కెరీర్ తొలినాళ్లను గుర్తుచేసుకున్నారు. -
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
ఎట్టకేలకు తెలుగులో ‘OMG2’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
-
టెక్ మహీంద్రా లాభంలో 41 శాతం క్షీణత.. ఒక్కో షేరుపై రూ.28 డివిడెండ్
-
విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
-
యూపీఎస్సీ - 2025 పరీక్షల క్యాలెండర్ విడుదల.. ‘సివిల్స్’ పరీక్షలు ఎప్పుడంటే?
-
ప్రీమియర్ షోలో మెరిసిన తారలు.. అలియా అలా.. రష్మిక ఇలా..
-
కాళేశ్వరం ఆనకట్టలపై ఫిర్యాదులు, నివేదనలు కోరుతూ ప్రకటన జారీ