Bangarraju: ‘వాసివాడి తస్సాదియ్యా’.. ఫరియా ప్రత్యేక గీతం అదిరిందయా!

అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ‘జాతిరత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లా ఓ ప్రత్యేక గీతంలో  కనిపించనుందంటూ చిత్ర బృందం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది.

Published : 19 Dec 2021 19:01 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అక్కినేని నాగార్జున, నాగ చైతన్య కలిసి నటిస్తున్న చిత్రం ‘బంగార్రాజు’. ‘జాతిరత్నాలు’ ఫేం ఫరియా అబ్దుల్లా ఓ ప్రత్యేక గీతంలో కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. వారి నిరీక్షణకు తెరదించుతూ ఆదివారం ఆ గీతాన్ని విడుదల చేసింది. ‘వాసివాడి తస్సాదియ్యా’ అంటూ సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. ఒకే ఫ్రేమ్‌లో నాగార్జున, నాగ చైతన్య, రమ్యకృష్ణ, ఫరియా కనువిందు చేస్తున్నారు. దర్శకుడు కల్యాణ్‌ కృష్ణ రచించిన ఈ హుషారైన గీతాన్ని మోహన భోగరాజు, సాహితి చాగంటి, హర్ష వర్థన్‌ ఆలపించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు సమకూర్చారు. జీ స్టూడియోస్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం త్వరలోనే ప్రేక్షకుల ముందుకురానుంది. గతంలో వచ్చిన ‘సోగ్గాడే చిన్నినాయనా’ చిత్రానికి ప్రీక్వెల్‌గా ‘బంగార్రాజు’ తెరకెక్కిస్తున్నారు. ఈ సినిమాకి స్క్రీన్‌ప్లే: సత్యానంద్‌, కళ: బ్రహ్మ కడలి, కూర్పు: విజయ్‌ వర్థన్.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని