Varudu Kaavalenu: వధూవరులను ఇలా ఎంపిక చేశారు..! 

నాగశౌర్య, రీతూవర్మ జంటగా రూపొందిన చిత్రం ‘వరుడు కావలెను’. కుటుంబం, పెళ్లి నేపథ్యంలో సాగే కథ ఇది.

Published : 28 Oct 2021 16:28 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: నాగశౌర్య, రీతూవర్మ జంటగా రూపొందిన లవ్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘వరుడు కావలెను’. ఈ సినిమాతో లక్ష్మి సౌజన్య దర్శకురాలిగా పరిచయమవుతున్నారు. ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకురానుంది. ఈ నేపథ్యంలోనే.. హీరోహీరోయిన్ల ఎంపిక ఎలా జరిగింది? చిత్రీకరణ ఎలా సాగింది? తన బృందం ఎలా పనిచేసింది? తదితర విషయాల్ని లక్ష్మి సౌజన్య పంచుకున్నారు. ‘పరీక్షలు రాసిన విద్యార్థులు ఫలితాల కోసం ఎలా ఎదురుచూస్తుంటారో నేనూ అలానే ఎదురుచూస్తున్నా’ అని తెలిపారు. సౌజన్యతోపాటు కథానాయకుడు నాగశౌర్య, నాయిక రీతూవర్మ, సంగీత దర్శకులు తమన్‌, విశాల్‌ శేఖర్‌ సినిమా విశేషాల్ని పంచుకున్నారు. అవేంటో ఈ ‘మేకింగ్‌ వీడియో’లో చూసేయండి..


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని