Drushyam 2: వెంకటేశ్‌ ‘దృశ్యం2’ ట్రైలర్‌.. ఫ్యామిలీ కోసం రాంబాబు ఏం చేశాడు?

Drushyam 2: వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన ‘దృశ్యం2’ ట్రైలర్‌ చూశారా?

Published : 16 Nov 2021 01:17 IST

హైదరాబాద్‌: ‘ఇప్పుడు రాంబాబు ఫోకస్‌మొత్తం సినిమా తీయడం మీద ఉంది. చట్టానికి దొరకనన్న ఓవర్‌ కాన్ఫిడెన్స్‌తో ఉన్నాడు. వాడు సినిమా తీసేలోపు.. వాడికి సినిమా చూపిద్దాం’ అంటున్నారు నటుడు సంపత్‌. వెంకటేశ్‌ కథానాయకుడిగా నటించిన క్రైమ్‌ థ్రిల్లర్‌ ‘దృశ్యం-2’. 2014లో విడుదలైన ‘దృశ్యం’ చిత్రానికి సీక్వెల్‌గా ఈ సినిమా సిద్ధమైన విషయం తెలిసిందే. ‘దృశ్యం-2’ ట్రైలర్‌ విడుదల వేడుక సోమవారం హైదరాబాద్‌లో జరిగింది. మరి వరుణ్ హత్య కేసులో రాంబాబు కుటుంబం పోలీసులకు దొరికిపోయిందా? రాంబాబు తన కుటుంబాన్ని  కాపాడుకోవటం కోసం ఏం చేశాడు? తెలియాలంటే సినిమా చూడాల్సిందే

అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా నవంబర్‌ 25న అమెజాన్‌ ప్రైమ్‌ వేదికగా విడుదల కానుంది. మలయాళంలో ‘దృశ్యం-2’ తెరకెక్కించిన జీతూ జోసఫ్‌ తెలుగులోనూ దర్శకత్వం వహించారు. నదియా, నరేశ్‌, సంపత్‌ రాజ్‌, తనికెళ్ల భరణి ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. అనూప్‌ రూబెన్స్‌ స్వరాలు అందించారు. సురేశ్‌ ప్రొడెక్షన్స్‌ పతాకంపై ఈ సినిమా నిర్మితమైంది.

Read latest Cinema News and Telugu News


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని