Cinema News: హైఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ షురూ..!

హై ఓల్టేజ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌కి దక్షిణాదిలో రంగం సిద్ధమైంది. సందీప్‌ కిషన్‌ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి ‘మైఖేల్‌’ అనే పేరు ఖరారు చేశారు. తాజాగా ఆ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని శుక్రవారం....

Published : 27 Aug 2021 12:07 IST

హైదరాబాద్‌: సందీప్‌ కిషన్‌ హీరోగా ఓ భారీ ప్రాజెక్ట్‌ పట్టాలెక్కనుంది. ఈ చిత్రానికి ‘మైఖేల్‌’ అనే పేరు ఖరారు చేశారు. తాజాగా ఆ సినిమా ఫస్ట్‌లుక్‌ పోస్టర్‌ని శుక్రవారం ఉదయం చిత్రబృందం విడుదల చేసింది. కోలీవుడ్‌ దర్శకుడు రంజిత్‌ ఈ చిత్రాన్ని రూపొందించనున్నారు. ఇందులో కోలీవుడ్‌ హీరో విజయ్‌ సేతుపతి కీలకపాత్రలో కనిపించనున్నారు. పాన్‌ ఇండియా సినిమా సిద్ధం కానున్న ఈ చిత్రాన్ని శ్రీ వేంకటేశ్వర సినిమాస్‌, కరణ్‌ సి. ప్రొడెక్షన్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్‌ షూట్‌ ప్రారంభం కానుంది. ఇతర నటీనటుల వివరాలు తెలియాల్సి ఉంది. దీంతో సందీప్‌ ప్రస్తుతం ఫిట్‌నెస్‌పై దృష్టి సారించారు. జిమ్‌లో ఫుల్‌ వర్కౌట్లు చేస్తున్నారు. దీనికి సంబంధించిన ఫొటోలను సైతం ఆయన సోషల్‌మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. మరోవైపు ఈ సినిమాలో నటించనున్న ఇతర నటీనటులెవరనేది తెలియాల్సి ఉంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని