Saamanyudu:రాక్షసుడితో ‘సామాన్యుడు’ పోరు

విశాల్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘సామాన్యుడు’. తు.ప.శరవణన్‌ తెరకెక్కించారు. డింపుల్‌ హయాతి కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Updated : 26 Dec 2021 08:56 IST

విశాల్‌ హీరోగా నటిస్తూ.. స్వయంగా నిర్మించిన చిత్రం ‘సామాన్యుడు’. తు.ప.శరవణన్‌ తెరకెక్కించారు. డింపుల్‌ హయాతి కథానాయిక. ఈ సినిమా వచ్చే ఏడాది జనవరి 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే   శనివారం టీజర్‌ విడుదల చేశారు. ‘‘ఇక్కడ రెండు రకాల మనుషులే ఉన్నారు. ఒకరు జీవితాన్ని అది నడిపించే దారిలో జీవించాలనుకునే సామాన్యులు. ఇంకొకరు సామాన్యుల్ని డబ్బు, పేరు, పదవి, అధికారం కోసం అంతం చేయాలనుకునే రాక్షసులు. ఆ రాక్షసుల తల రాతని మార్చి రాయాల్సిన పరిస్థితి ఒక రోజు ఓ సామాన్యుడికి వస్తుంది’’ అనే డైలాగ్‌తో టీజర్‌ ఆసక్తికరంగా సాగింది. ప్రచార చిత్రంలో కనిపించిన సన్నివేశాల్ని బట్టి.. సినిమాలో యాక్షన్‌కు పెద్ద పీట వేసినట్లు అర్థమవుతోంది. టీజర్‌ ఆఖర్లో ‘‘అయితే నువ్వీ పోరాటాన్ని ఆపవు కదా’’ అంటూ ఓ వ్యక్తి ప్రశ్నించగా.. ‘‘అది నిర్ణయించాల్సింది నా శత్రువు’’ అంటూ విశాల్‌ బదులివ్వడం ఆసక్తిరేకెత్తించింది. ఈ చిత్రానికి సంగీతం: యువన్‌ శంకర్‌ రాజా, ఛాయాగ్రహణం: కెవిన్‌ రాజా.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు