K Vishwanath: ‘విశ్వనాథ్ విశ్వరూపం’.. కళాతపస్వి సినిమాలపై విశ్లేషణాత్మక పుస్తకం
కళాతపస్వి కె.విశ్వనాథ్ సినీ రంగానికే ఆదర్శం. ఆయన తీసిన సినిమాలు ఎంతో ప్రత్యేకం. శంకరాభరణం సినిమా జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. కె.విశ్వనాథ్
హైదరాబాద్: కళాతపస్వి కె.విశ్వనాథ్ సినీ రంగానికే ఆదర్శం. ఆయన తీసిన సినిమాలు ఎంతో ప్రత్యేకం. ‘శంకరాభరణం’ జాతీయ పురస్కారాన్ని సొంతం చేసుకుంది. కె.విశ్వనాథ్ సినిమాలు చూసి ముగ్దుడైన ఆర్బీఐ ఉన్నతోద్యోగి డాక్టర్ రామశాస్త్రి.. ఆయన సినిమాల గురించి ఏకంగా ఓ పుస్తకాన్నే రచించారు. ‘‘విశ్వనాథ్ విశ్వరూపం’’ పేరుతో రచించిన పుస్తకాన్ని విజయదశమి సందర్భంగా కె.విశ్వనాథ్ చేతులమీదుగా ఆవిష్కరించారు. సినిమా అంటే కేవలం వినోదం కాదు... కళలకు ప్రాధాన్యం, సామాజిక స్పృహ కలిగించేలా సన్నివేశాలు తీయడం, సాహిత్యానికి పెద్దపీట. వీటన్నింటికీ కె.విశ్వనాథ్ దర్శకత్వంలో సమ ప్రాధాన్యం ఉంటుంది. ఆయన సినిమాలు చూసి ప్రేక్షకులు తన్మయత్వంలో మునిగిపోతారు. ‘శంకరాభరణం’, ‘సాగరసంగమం’, ‘స్వాతి కిరణం’, ‘స్వర్ణకమలం’, ‘శుభసంకల్పం’, ‘సిరివెన్నెల’ ఇలా ప్రతి సినిమా ప్రేక్షకుడి మదిలో చెరగని ముద్ర వేశాయి. అలా చిన్నప్పటి నుంచి కె.విశ్వనాథ్ సినిమాలు చూసి ఆయనకు వీరాభిమానిగా మారారు డాక్టర్ రామశాస్త్రి. ఆర్బీఐలో చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేసి.. పదవీ విరమణ పొందిన రామశాస్త్రి 2017లో కె.విశ్వనాథ్పై ఓ పుస్తకం రాయాలని నిర్ణయించుకున్నారు. ఆయన అంగీకారంతో రాసిన పుస్తకంలో ఎన్నో అంశాలను పొందుపర్చారు.
పుస్తకావిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రముఖ నటుడు, రచయిత తనికెళ్ల భరణి మాట్లాడుతూ.. ‘‘ఓ వైపు ఉన్నతోద్యోగం నిర్వహిస్తున్నా.. ఏమాత్రం ఒత్తిడికి గురవకుండా రామశాస్త్రి సాహిత్యంపై మక్కువతో కె.విశ్వనాథ్ సినిమాలను తరచూ చూసేవారు. సమయం చిక్కినప్పుడల్లా భార్యతో కలిసి సినిమాకు వెళ్లి అందులోని కళలను, సందేశాన్ని విశ్లేషించేవారు. ఆర్బీఐ చీఫ్ జనరల్ మేనేజర్గా పదవీ విరమణ పొందిన తర్వాత కూడా పలు బ్యాంకులకు డైరెక్టర్గా పనిచేస్తున్నారు. వృత్తిలో బిజీగా ఉన్నప్పటికీ కె.విశ్వనాథ్ సినిమాల పట్ల ఉన్న మక్కువ ఏమాత్రం తక్కువ కాలేదు. కె.విశ్వనాథ్పై పుస్తకం రచించాలన్న రామశాస్త్రి నిర్ణయాన్ని ఆయన భార్య గాయత్రీదేవి వెన్నుతట్టి ప్రోత్సహించారు. గాయత్రీదేవి వృత్తిరీత్యా ఆయుర్వేద వైద్యురాలైనప్పటికీ ఆమెకూడా రచనలు చేస్తుండటంతో రామశాస్త్రి రచనలకు తోడ్పాటునందించారు. రామశాస్త్రి నాలుగు నెలలపాటు పూర్తి సమయాన్ని కేటాయించి పుస్తకాన్ని పూర్తి చేశారు. పలు సందర్భాల్లో విశ్వనాథ్ సినిమాలను మళ్లీ మళ్లీ చూసి అందులో సందర్భాలను విశ్లేషించి పుస్తకంలో పొందుపర్చారు. కె.విశ్వనాథ్ సినిమాల్లో ఎక్కువగా ప్లాష్ బ్యాక్ ఉంటుంది. శంకరాభరణం, ఉండమ్మా బొట్టుపెడతా, సాగరసంగమం సినిమాల్లోని ప్లాష్ బ్యాక్ను రామశాస్త్రి తన పుస్తకంలో ప్రస్తావించారు’’ అని తనికెళ్ల భరణి తెలిపారు. రామశాస్త్రి పుస్తకాన్ని చదివిన కె.విశ్వనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. పుస్తకం చదువుతుంటే ప్రస్తుతం తన చిత్రాలను తానే చూసుకున్నట్టుందని రామశాస్త్రిని అభినందించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
500మంది డ్యాన్సర్లతో వెల్కమ్ ఆటాపాటా
బాలీవుడ్లోని ప్రముఖ నటీనటులందరినీ ఏకం చేసి కొత్త తరహా కాన్సెప్ట్తో ప్రేక్షకులను అలరించడానికి రాబోతున్న చిత్రం ‘వెల్కమ్ టు ది జంగిల్’. అగ్రకథానాయకుడు అక్షయ్ కుమార్ ప్రధాన పాత్రలో నటిస్తున్నారు. -
ప్రేమలో పడ్డారు.. లవ్ స్టోరీతో..
ఒకప్పుడు మన సినిమాల్లో ప్రేమకథలదే జోరు. అగ్ర తారలు సైతం ప్రేమ లేఖలు రాస్తూ... ప్రేమ పాటలు పాడుకుంటూ తెరపై కనిపించేవాళ్లు. ఆ తర్వాత యువ హీరోలకే ఆ కథలు పరిమితం అయ్యాయి -
‘హను-మాన్’ విజయం ప్రేక్షకుల బహుమానం
‘‘నా చిన్నప్పుడు చూసిన వంద రోజుల సినిమా వేడుకలు బాగా గుర్తున్నాయి. కానీ దర్శకుడినయ్యాక సినిమాల ప్రదర్శనలు ఒక వారానికి పరిమితం అయ్యాయి. -
గోద్రా రైలులోని రహస్యాలు బయటపడేది ఆ రోజే
గోద్రా రైలు దహనకాండ ఆధారంగా రూపొందుతున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా జంటగా నటిస్తున్నారు. -
సందీప్ కిషన్ చిత్రం ప్రారంభం
ముప్పై సినిమాల మైలురాయిని చేరుకున్నారు సందీప్కిషన్. ఆయన కథానాయకుడిగా ఏకే ఎంటర్టైన్మెంట్స్తో కలిసి హాస్య మూవీస్ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. -
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
‘శ్రీకాంత్’ కోసం ఆమిర్ గీతం
మరికొద్ది రోజుల్లో ‘శ్రీకాంత్’ సినిమాతో ప్రేక్షకుల్ని పలకరించడానికి సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు రాజ్కుమార్ రావ్. తుషార్ హీరానందాని తెరకెక్కిస్తున్నారు. -
మోహన్లాల్ 360 షురూ
ప్రయోగాత్మక కథలు, భిన్నమైన పాత్రలు ఎంచుకుంటూ సినీప్రియుల్ని మెప్పించే మోహన్లాల్.. ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘ఎల్360’ (వర్కింగ్ టైటిల్). తరుణ్ మూర్తి తెరకెక్కిస్తున్నారు. -
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్
పూరి మ్యూజింగ్స్లో ‘ది డెవిల్’ అంటూ ఆలోచనల గురించి మాట్లాడారు పూరి జగన్నాథ్ -
కియారా ‘టీ’ ముచ్చట.. సోనాల్ బ్రేక్ఫాస్ట్ సంగతులు
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
రంగనాథస్వామి దేవస్థాన ప్రధాన అర్చకుడు హఠాన్మరణం
-
యూసఫ్గూడలో రోడ్డు ప్రమాదం.. యువతిపై బస్సు ఎక్కడంతో మృతి
-
ఈ నగరంలో అడుగుపెట్టాలంటే.. టికెట్ కొనాల్సిందే!
-
నేడే తెలంగాణ ఇంటర్ ఫలితాలు.. రిజల్ట్స్ ఈనాడు.నెట్లో..
-
జీవితంలో ముందుకెళ్లాలంటే ధైర్యం ఉండాలి : ఐపీఎస్ ఆఫీసర్ పోస్ట్ వైరల్
-
బెంగాలీ అమ్మాయి.. నాన్న కొట్టిన చెంప దెబ్బ.. ఇవే ఆలోచనలు: పూరి జగన్నాథ్