Yadhalo Mounam: శ్రీదేవి మేనకోడలు, శివాజీ గణేశన్‌ మనవడు జంటగా.. ‘ఎదలో మౌనం’

ప్రముఖ తమిళ నటుడు దివంగత శివాజీ గణేశన్‌ మనవడు దర్శన్‌, దివంగత నటి శ్రీదేవి మేనకోడలు శిరీషపై రూపొందిన గీతం ‘యదలో మౌనం’.

Updated : 07 Dec 2022 19:30 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ తమిళ నటుడు దివంగత శివాజీ గణేశన్‌ మనవడు దర్శన్‌ గణేశన్‌, దివంగత నటి శ్రీదేవి మేనకోడలు శిరీషపై రూపొందిన గీతం ‘యదలో మౌనం’. భరతనాట్య కళాకారిణి, ప్రముఖ నటి దివంగత పద్మిని రామచంద్రన్‌ మనవరాలు లక్ష్మీదేవి దర్శకత్వం వహించారు. ఈ పాటని శుక్రవారం విడుదల చేశారు. పెళ్లి నేపథ్యంలో సాగే ఈ గీతం అన్ని వర్గాల శ్రోతల్ని అలరించేలా ఉంది. దర్శన్‌, శిరీష హావభావాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. ఈ గీతానికి వరుణ్‌ మేనన్‌, అచ్చు రాజమణి స్వరాలు సమకూర్చారు. పూర్ణాచారి సాహిత్యం అందించారు. అచ్చు రాజమణి ఆలపించారు. ఈ వీడియోకి ఛాయాగ్రహణం: అభినందన్‌ రామానుజం, కూర్పు: ఆంటోనీ గొంజాల్వెజ్‌. ఆంటోనీ ప్రముఖ దర్శకులు శంకర్‌, గౌతమ్‌ వాసుదేవ్‌ మేనన్‌ దగ్గర పనిచేశారు. లక్ష్మీదేవి ‘వెన్‌ ది మ్యూజిక్‌ ఛేంజెస్‌’ అనే చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఆస్కార్ ‘లైవ్‌ యాక్షన్ షార్ట్స్‌’ కేటగిరీలో నామినేట్‌ అయింది.

Read latest Cinema News and Telugu News

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని