Balakrishna: బాలకృష్ణ సరసన శ్రుతిహాసన్‌.. ఆ క్రేజీ ప్రాజెక్టు ఏంటంటే?

టాలీవుడ్‌లో కొత్త జోడీ కుదిరింది. ప్రముఖ నటుడు బాలకృష్ణ కొత్త చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా ఎంపికైంది. ‘క్రాక్‌’ సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి మంచి విజయం అందుకున్న దర్శకుడు గోపీచంద్‌ మలినేని.

Published : 05 Nov 2021 01:41 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: టాలీవుడ్‌లో కొత్త జోడీ కుదిరింది. ప్రముఖ నటుడు బాలకృష్ణ కొత్త చిత్రంలో శ్రుతిహాసన్‌ కథానాయికగా ఎంపికైంది. ‘క్రాక్‌’ సినిమాతో ఈ ఏడాది సంక్రాంతికి మంచి విజయం అందుకున్న దర్శకుడు గోపీచంద్‌ మలినేని. ఆ ఉత్సాహంలోనే బాలకృష్ణ హీరోగా తదుపరి చిత్రాన్ని (ఎన్బీకే 107 వర్కింగ్‌ టైటిల్‌) ఇటీవల ప్రకటించారు. దీపావళి సందర్భంగా నాయిక వివరాల్ని తెలియజేశారు. ఈ క్రేజీ ప్రాజెక్టులోకి శ్రుతిని ఆహ్వానిస్తూ పోస్టర్‌ని విడుదలని చేశారు.

మైత్రీ మూవీ మేకర్స్‌ సంస్థ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా రూపొందనుంది. చిత్రీకరణ త్వరలోనే ప్రారంభంకానుంది. గోపీచంద్‌ గతంలో తెరకెక్కించిన ‘బలుపు’, ‘క్రాక్‌’ సినిమాల్లోనూ శ్రుతి హాసన్‌ నటించింది. ప్రస్తుతం.. ‘అఖండ’ చిత్రంతో బిజీగా ఉన్నారు బాలకృష్ణ. బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమా త్వరలోనే విడుదలకానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని