Tollywood: సంక్రాంతికి స్ట్రయిట్‌ తెలుగు సినిమాలకే ప్రాధాన్యత ఇవ్వాలి: నిర్మాతల మండలి

ఏపీ, తెలంగాణలోని ఎగ్జిబిటర్లకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి లేఖ రాసింది. వచ్చే ఏడాది సంక్రాంతి, దసరాకు స్ట్రయిట్‌ తెలుగు సినిమాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది.

Published : 13 Nov 2022 13:55 IST

హైదరాబాద్‌: ఏపీ, తెలంగాణలోని ఎగ్జిబిటర్లకు తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి లేఖ రాసింది. వచ్చే ఏడాది సంక్రాంతి, దసరాకు స్ట్రయిట్‌ తెలుగు సినిమాల ప్రదర్శనకే ప్రాధాన్యత ఇవ్వాలని సూచించింది. ఈ మేరకు 2017లో తెలుగు చలనచిత్ర వాణిజ్య మండలి నిర్ణయం తీసుకుందని తెలిపింది. 

స్ట్రయిట్‌ సినిమాలు ఉండగా డబ్బింగ్‌ చిత్రాలకు థియేటర్లు ఎలా ఇస్తామంటూ గతంలో ప్రముఖ నిర్మాత దిల్‌ రాజు పేర్కొన్న విషయాన్ని ఈ సందర్భంగా చలన చిత్ర నిర్మాతల మండలి గుర్తు చేసింది. ఈ నిర్ణయాన్ని ఎగ్జిబిటర్లు పాటించాలని కోరింది. తెలుగు చిత్ర పరిశ్రమను కాపాడుకునేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని