Thaman: థియేటర్‌లో కన్నీళ్లు పెట్టుకున్న తమన్‌.. కాలర్‌ ఎగరేసిన దిల్‌రాజు

‘వారిసు’ సినిమా ఫస్ట్ డే ఫస్ట్‌ షోలో తమన్‌ కన్నీరు పెట్టుకున్నారు. సినిమాపై ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమతో ఆయన భావోద్వేగానికి గురయ్యారు.

Published : 11 Jan 2023 17:18 IST

చెన్నై‌: విజయ్‌ (Vijay) హీరోగా వంశీ పైడిపల్లి (Vamshi Paidipally) దర్శకత్వం వహించిన చిత్రం ‘వారిసు’ (Varisu). కమర్షియల్‌, ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈసినిమా సంక్రాంతి కానుకగా బుధవారం ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ నేపథ్యంలో ‘వారిసు’ ఫస్ట్‌ డే ఫస్ట్‌ షోలో చిత్రబృందం సందడి చేసింది. చెన్నైలోని ఓ ప్రముఖ థియేటర్‌కు వెళ్లిన చిత్ర దర్శకుడు వంశీ, నిర్మాత దిల్‌రాజు, సంగీత దర్శకుడు తమన్‌.. సినిమా చూశారు. సినిమా పూర్తయ్యే సమయానికి తమన్‌ (Thaman) కన్నీటి పర్యంతమయ్యారు. ప్రేక్షకులు చూపిస్తోన్న ప్రేమ, సినిమాలోని భావోద్వేగ సన్నివేశాలతో ఆయన ఈ విధంగా ఎమోషనల్‌ అయ్యారు. మరోవైపు సినిమా విజయంపై దిల్‌రాజు (Dil Raju) చాలా ఆనందంగా ఉన్నారు. థియేటర్‌లో ప్రేక్షకులను చూసి ఆయన కాలర్‌ ఎగురవేశారు. నటి త్రిష (Trisha) సైతం థియేటర్‌లో సందడి చేశారు. స్నేహితులతో కలిసి థియేటర్‌కు వచ్చిన ఆమె సినిమాని ఎంజాయ్‌ చేశారు.

‘బీస్ట్‌’ తర్వాత విజయ్‌ నటించిన చిత్రమిది. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్‌ నటించడం ఇదే తొలిసారి. రష్మిక కథానాయిక. కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కిన ఈసినిమాలో జయసుధ, ఖుష్బూ, శ్రీకాంత్‌, శ్యామ్‌, ప్రకాశ్‌రాజ్‌, శరత్‌కుమార్‌ వంటి అగ్ర తారలు కీలకపాత్రలు పోషించారు. ఇదే చిత్రాన్ని తెలుగులో ‘వారసుడు’ (Vaarasudu) పేరుతో విడుదల చేయనున్నారు. అయితే, ‘వీర సింహారెడ్డి’, ‘వాల్తేరు వీరయ్య’ రిలీజ్‌లను దృష్టిలో ఉంచుకుని తెలుగు రాష్ట్రాల్లో ఈ చిత్రాన్ని జనవరి 14న విడుదల చేయనున్నారు.





Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని