జాంబిలకు కిరోసిన్‌ వాసన పనిచేయదా!

తేజ సజ్జా కథానాయకుడిగా ఆనంది, దక్ష కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది తెలుగులో వచ్చిన తొలి జాంబి సినిమా.

Published : 23 Apr 2021 14:24 IST

ఇంటర్నెట్‌ డెస్క్:  తేజ సజ్జా కథానాయకుడిగా ఆనంది, దక్ష కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘జాంబిరెడ్డి’. ప్రశాంత్‌ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ఈ ఏడాది ఫిబ్రవరి 5న విడుదలై ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇది తెలుగులో వచ్చిన తొలి జాంబి సినిమా. ప్రస్తుతం ఈ చిత్రం ఓటీటీ వేదికైన ఆహాలో ప్రసారం అవుతోంది. ఈ సందర్భంగా ఈ చిత్రంలో ఓ సన్నివేశాన్ని ‘ఆహా’ పంచుకుంది. ‘‘కిరోసిన్‌ వాసన పనిచేయక పోతే చస్తావ్‌..’’ అని ఆనంది అడ్డుకోబోతుండగా ‘‘నీ దగ్గర ఇంతకన్నా బెటర్‌ ఐడియా ఏమైనా ఉందా’’ అంటూ.. తేజ జాంబిల నుంచి తప్పించుకోవడానికి జీపుని తీసుకొస్తారు. జాంబిల నుంచి తేజ బృందం తప్పించుకుందా లేదా తెలియాలంటే మీరు కూడా ఈ వీడియో చూడాల్సిందే.  


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని