Nagarjuna: ఆ ఆలోచనే ఉంటే అన్నీ ‘శివ’, ‘అన్నమయ్య’లే అయ్యేవి: నాగార్జున
ప్రేక్షకులెప్పుడు ఎలాంటి చిత్రాలు అంగీకరిస్తారు? ఎలాంటి పాత్రలు అంగీకరించరు? అనే విషయంలో తనకే కాదు ఎవ్వరికీ సరైన ఆలోచన ఉండకపోవచ్చని నటుడు, అగ్ర కథానాయకుడు నాగార్జున (Nagarjuna) అన్నారు......
హైదరాబాద్: ప్రేక్షకులెప్పుడు ఎలాంటి చిత్రాలు అంగీకరిస్తారు? ఎలాంటి పాత్రలు అంగీకరించరు? అనే విషయంలో తనకే కాదు ఎవ్వరికీ సరైన ఆలోచన ఉండకపోవచ్చని నటుడు, అగ్ర కథానాయకుడు నాగార్జున (Nagarjuna) అన్నారు. ఆయన ప్రధానపాత్రలో నటించిన ‘ది ఘోస్ట్’ (The Ghost) ఫస్ట్ విజువల్ ట్రీట్ రిలీజ్ అనంతరం ‘ఘోస్ట్’ టీమ్తో కలిసి ఆయన మీడియాతో ముచ్చటించారు. విలేకర్లు అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు. ఆ విశేషాలు మీకోసం..
‘శివ’లో(SHIVA) సైకిల్ చైన్తో ఫైట్ చేశారు. ఇప్పుడు కత్తులు పట్టుకున్నారు. ఈ సినిమా మరో ‘శివ’ అనుకోవచ్చా?
నాగార్జున: ‘శివ’తో పోల్చాలని ఆ యాక్షన్ సీక్వెన్స్ క్రియేట్ చేయలేదు. ఫైట్ సీక్వెన్స్ కొత్తగా, కాస్త స్టైలిష్గా ఉండాలనే ఉద్దేశంతో అలా చేశాం. ‘శివ’ ఒక విభిన్నమైన కథ. దానికి దీనికి ఎలాంటి సంబంధం ఉండదు.
‘ఘోస్ట్’(Ghost) అంటే ఏమిటి?
నాగార్జున: ఈ సినిమాలో నా పాత్ర పేరు విక్రమ్. ఇంటర్పోల్ ఆఫీసర్గా కనిపిస్తా. ‘ఘోస్ట్’ అనేది విక్రమ్కు కోడ్ నేమ్.
మీ నుంచి ‘మనం’, ‘సోగ్గాడే చిన్నినాయనా’, ‘బంగార్రాజు’ వచ్చాయి. అలాగే ‘వైల్డ్డాగ్’, ‘ఆఫీసర్’ లాంటి సినిమాలూ వచ్చాయి. ప్రేక్షకులు ఎలాంటి సినిమాలు అంగీకరిస్తారు అనే విషయంలో మీకొక ఐడియా వచ్చి ఉంటుంది కదా?
నాగార్జున: నిజంగా ఇప్పటికీ తెలియదు. నాకే కాదు ఇండస్ట్రీలో ఎవరికీ తెలియకపోవచ్చు. ఎందుకంటే ప్రేక్షకులు ఎప్పుడు ఎలాంటి కథను ఓకే చేస్తున్నారో, ఏ సినిమా ఎందుకు హిట్ అవుతుందో?
తెలియడం లేదు. ఇటీవల రాజమౌళితో ఇదే విషయంపై మాట్లాడాను. ‘‘మన మనసుకు నచ్చిన చిత్రాన్నే చేయాలి. ఏది ఏమైనా ఆ సినిమాపై ముందు మనకి నమ్మకం ఉంటే ప్రేక్షకులకూ అది నచ్చుతుంది’’ అని ఆయన చెప్పారు.
ప్రేక్షకులు మిమ్మల్ని ఎలాంటి సినిమాల్లో ఓకే చేస్తారు అనే విషయంపై మీకో ఆలోచన ఉంటుంది కదా?
నాగార్జున: నాకు ఆ ఆలోచన లేదు. ‘వైల్డ్డాగ్’ సరిగ్గా ఆడలేదని మీరు అంటున్నారు. కానీ, ఆ సినిమా బాగా ఆడిందని నేనంటాను. డెల్టా వైరస్ వ్యాపిస్తున్న సమయంలో మాకు వేరే గత్యంతరం లేక రిలీజ్ చేశాం.నెట్ఫ్లిక్స్లో ఆ సినిమా పది వారాలు పాటు నెం.1 స్థానంలోనే ఉంది. ఎంటర్టైన్మెంట్ విషయంలో జనం నాడి ఎప్పుడు ఎలా ఉంటుందో పట్టుకోవడం తెలిస్తే ఇండస్ట్రీలో అందరూ నంబర్ 1 గానే ఉంటారు. వర్మ తీసిన ‘శివ’ను మెచ్చుకున్నారు.. ‘ఆఫీసర్’ను తిరస్కరించారు. కృష్ణవంశీ తీసిన ‘నిన్నే పెళ్లాడతా’ బాగా ఆడింది. ఆ తర్వాత మా కాంబినేషన్లో వచ్చిన ‘చంద్రలేఖ’ ఫ్లాప్ అయింది. ఇలా ప్రేక్షకులు దేన్ని అంగీకరిస్తారు? దేన్ని అంగీకరించరు? అనే విషయంపై నాకొక ఆలోచన ఉంటే నా కెరీర్లో అన్నీ ‘శివ’, ‘అన్నమయ్య’లే ఉండేవి. ‘అన్నమయ్య’ తీస్తున్నప్పుడు ఆడదని అన్నారు. కానీ, రాఘవేంద్రరావుగారు నమ్మకంతో తీశారు.
నాగచైతన్యతో ‘లవ్స్టోరీ’ చేశారు. నాగార్జునతో ‘ఘోస్ట్’ చేస్తున్నారు. మరి అఖిల్తో ఎప్పుడు సినిమా చేస్తారు?
సునీల్ నారంగ్: అఖిల్ ఎప్పుడు ఓకే చెబితే అప్పుడు చేస్తాం.
‘ఘోస్ట్’ ఓకే చేయడానికి కారణం ఏమిటి?
నాగార్జున: ప్రవీణ్ చెప్పిన యాక్షన్ సీక్వెన్స్లు కొత్తగా అనిపించాయి. అందుకే వెంటనే ఓకే అనేశా. ఇప్పుడున్న ట్రెండ్కి ఇది నప్పుతుందని భావిస్తున్నా.
కొవిడ్లోనూ వరుస షూట్స్ చేశారు కదా?
నాగార్జున: వర్క్ చేయకపోతే నాకెందుకో వెలితిగా అనిపిస్తుంటుంది. కొవిడ్లోనూ వరుస షూట్స్లో పాల్గొని.. ఎంతోమందికి ఉపాధి కల్పించినందుకు, వారి మన్ననలు పొందినందుకు అదృష్టవంతుడిగా భావిస్తున్నా. కొవిడ్ వల్ల ఎంటర్టైన్మెంట్ ప్రేక్షకులకు మరింత చేరువైంది. భాషతో సంబంధం లేకుండా అందరూ అన్ని రకాల సినిమాలు, సిరీస్లు చూస్తున్నారు.
ఈ సినిమా టికెట్ ధరలు ఎలా ఉంటాయి?
సునీల్ నారంగ్: సాధారణ టికెట్ ధరలే ఉంటాయి. ధరలు పెంచాలనుకోవడం లేదు.
యాక్షన్ సీక్వెన్స్ ఎక్కువగా ఉంటాయా? పార్ట్-2 ప్లాన్ ఉందా?
ప్రవీణ్ సత్తారు: ఇందులో మొత్తం 12 యాక్షన్ సీక్వెన్స్లు ఉంటాయి. అందులో ఎనిమిది భారీగా ఉంటాయి. ఇక, పార్ట్-2పై ఎలాంటి ఆలోచన లేదు. సినిమా విడుదలయ్యాక వచ్చే స్పందన ఆధారంగా చేసుకుని భవిష్యత్తులో ఆలోచిస్తా.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నా జీవితంలో ఇదే రిస్కీ సినిమా
‘క్రూ’.. ఇటీవలే విడుదలైన ఈ సినిమాతో మంచి విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది బాలీవుడ్ భామ కృతిసనన్. ఇందులో ఎయిర్హోస్టెస్ పాత్రలో కనిపించి సినీప్రియుల్ని మెప్పించింది. -
ఆ విషయంలో అల్లరి నరేశ్ను పట్టుబట్టా: నాని
నరేశ్ హీరోగా తెరకెక్కిన కామెడీ ఫిల్మ్ ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా ట్రైలర్ ఈవెంట్లో నాని సందడి చేశారు. -
అలాంటి మాటలు చెప్పే అలవాటు లేదు
‘పొలిమేర’ సిరీస్ సినిమాలతో అందర్నీ మెప్పించి సత్తా చాటారు సత్యం రాజేశ్. ఇప్పుడాయన హీరోగా నటించిన చిత్రం ‘టెనెంట్’. వై.యుగంధర్ తెరకెక్కించిన ఈ సినిమాని మోగుళ్ల చంద్రశేఖర్ రెడ్డి నిర్మించారు. -
చరణ్, జాన్వీ ‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ సీక్వెల్ చేయాలన్నది నా కల: చిరంజీవి
‘జగదేక వీరుడు అతిలోక సుందరి’ రెండో భాగంలో రామ్చరణ్, జాన్వీకపూర్ కలిసి నటిస్తే చూడాలన్నది తన కల అని, దానికోసం ఎదురుచూస్తున్నానని అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) అన్నారు. -
హీరో ఒక్కడే థియేటర్లలోకి రప్పించలేడు
‘సినిమాలో పెద్ద హీరో ప్రధాన పాత్రధారిగా ఉన్నంతమాత్రాన ప్రేక్షకుడిని థియేటర్లలోకి రప్పించలేం. కథే సిసలైన హీరో’ అంటోంది కృతి సనన్. -
ఆ అవకాశం ఉంటే చెన్నై వదిలి ఇక్కడే సినిమాలు చేస్తా!
వైవిధ్యభరితమైన థ్రిల్లర్ కథలకు చిరునామాగా నిలుస్తుంటారు విజయ్ ఆంటోని. ఇప్పుడాయన తొలిసారి రొమాంటిక్ జానర్లో ‘లవ్ గురు’ అనే చిత్రం చేశారు. ఆయన స్వయంగా నిర్మించిన ఈ సినిమాని వినాయక్ వైద్యనాథన్ తెరకెక్కించారు. -
ఆ దిగ్గజ నటుడు నాకు ఆరాధ్య దైవంతో సమానం: మురళీ మోహన్
సినీ నటుడు మురళీ మోహన్ తాజాగా ‘ఆలీతో సరదాగా’లో పాల్గొన్నారు. ఆయన జీవితంలోని కొన్ని ఆసక్తికర అంశాలను పంచుకున్నారు. -
ఆ మాటలతోనే స్టార్నయ్యా.. ఇప్పటికీ షాంపూ బాటిల్లో నీళ్లు పోసి వాడుతుంటా!: చిరంజీవి
కెరీర్ పరంగా తాను ఎదుర్కొన్న సవాళ్లు, తన కుటుంబం, పొదుపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi). -
చిరంజీవితో ఆ పాటకు డ్యాన్స్ వేయడం కష్టంగా అనిపించింది: రాధ
నటి రాధ ‘ఆలీతో సరదాగా’ కార్యక్రమానికి హాజరయ్యారు. ఆమె కెరీర్కు సంబంధించిన ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
Prithviraj Sukumaran: అందుకు మలయాళ ఇండస్ట్రీ నాపై అసూయ పడిందేమో: పృథ్వీరాజ్ సుకుమారన్
తన కొత్త సినిమా ‘ఆడుజీవితం’ ప్రచారంలో భాగంగా హైదరాబాద్కు వచ్చారు మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమార్. ఆ చిత్రం గురించి పలు విశేషాలు పంచుకున్నారు. -
alitho saradaga: డబ్బులు అడుగుతానేమోనని కొందరు తప్పించుకు తిరిగేవాళ్లు: పుల్లెల గోపీచంద్
ప్రముఖ బ్యాడ్మింటన్ కోచ్ పుల్లెల గోపీచంద్ ఆలీతో సరదాగా కార్యక్రమానికి వచ్చారు. చాముండేశ్వర నాథ్తో కలిసి ఆయన చెప్పిన సంగతులేంటంటే.. -
Anupama Parameswaran: అందుకు బోర్ ఫీలయ్యా.. గ్లామర్ డోస్పై స్పందించిన అనుపమ
సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ జంటగా నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. ఈ సినిమా సాంగ్ లాంచ్ ఈవెంట్లో హైదరాబాద్లో జరిగింది. -
Priyadarshi: స్వచ్ఛమైన హాస్యంతో సినిమా ఓ పెద్ద సవాల్
‘‘కథానాయకుడు అనగానే ఒక ప్రత్యేకమైన ఇమేజ్కి పరిమితం చేసినట్టు ఉంటుంది. స్వేచ్ఛగా ఉండలేను. నన్ను నేను ఓ నటుడిగా చూసుకోవడానికే ఇష్టపడతా’’ అన్నారు ప్రియదర్శి. -
Sivaji: ఆలీ అన్నా.. దయచేసి ఎన్నికల్లో పోటీ చేయొద్దు: శివాజీ
ఇప్పటి రోజుల్లో రాజకీయాలు వ్యాపారంగా మారాయన్నారు నటుడు శివాజీ. డబ్బులు ఖర్చుపెట్టడంతోపాటు వివిధ మార్గాల్లో ఆ మొత్తాన్ని తిరిగి లాక్కొనేవారికే పాలిటిక్స్ సెట్ అవుతాయన్నారు. -
Allari Naresh: ‘ఆ ఒక్కటీ అడక్కు’ టైటిల్.. ఆ ఉద్దేశంతో పెట్టలేదు : అల్లరి నరేశ్
నరేశ్ హీరోగా రూపొందిన తాజా చిత్రం ‘ఆ ఒక్కటీ అడక్కు’. ఈ సినిమా టీజర్ లాంచ్ ఈవెంట్లో నరేశ్ పాల్గొని సందడి చేశారు. -
Raghu Karumanchi: స్టాక్మార్కెట్.. రూ.కోట్లలో నష్టపోయా: రఘు
ఈటీవీలో ప్రసారమవుతోన్న సెలబ్రిటీ టాక్ షో ‘చెప్పాలని ఉంది’ (Cheppalani Vundi). బాలాదిత్య వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ కార్యక్రమంలో తాజాగా టాలీవుడ్ హాస్యనటుడు రఘు కారుమంచి (Raghu Karumanchi) పాల్గొన్నారు. తన కెరీర్ విశేషాలు పంచుకున్నారు. -
Akash Puri: అప్పటి వరకు నాన్న దర్శకత్వంలో నటించను: ఆకాశ్ పూరి
తన తండ్రి పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ప్రస్తుతానికి నటించాలనుకోవడంలేదని నటుడు ఆకాశ్ తెలిపారు. హైదరాబాద్లో నిర్వహించిన ప్రెస్మీట్లో ఆయన మాట్లాడారు. -
Suhaas: రూ.3 కోట్ల రెమ్యూనరేషన్.. సుహాస్ ఏమన్నారంటే!
తాజాగా ‘ప్రసన్నవదనం’ టీజర్ లాంచ్ ఈవెంట్ జరిగింది. ఇందులో సుహాస్ తన రెమ్యూనరేషన్పై స్పందించారు. -
Gopichand: ఆ పిల్లల చదువుకు సాయం చేస్తున్నా.. చెప్పకపోవడానికి కారణమదే: గోపీచంద్
ప్రముఖ హాస్యనటుడు ఆలీ వ్యాఖ్యాతగా ఈటీవీ వేదికపై విశేష ఆదరణ సొంతం చేసుకున్న సెలబ్రిటీ టాక్ షో ‘ఆలీతో సరదాగా’ (Alitho Saradaga). ఈ షో సెకండ్ సీజన్ తాజాగా మొదలైంది. తొలి ఎపిసోడ్కు గోపీచంద్ (Gopichand) అతిథిగా విచ్చేశారు. -
Gopichand: భీమా ప్రేక్షకుల మదిలో నిలిచిపోయే పాత్ర: గోపీచంద్
భీమా ప్రమోషన్స్లో భాగంగా హీరో గోపీచంద్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
మూఢ నమ్మకాలు లేని దెయ్యం సినిమా ‘వళరి’
‘హారర్ సినిమాల సంఖ్య తగ్గుతున్న సమయంలో.. ఆ లోటును ‘వళరి’ చిత్రం తీర్చేయడానికి త్వరలో రాబోతుంది’ అంటున్నారు దర్శకురాలు మ్రితికా సంతోషిణి. దర్శకురాలిగా ఆమె రూపొందించిన తొలి చిత్రమిది. రితికా సింగ్, శ్రీరామ్ ప్రధాన పాత్రల్లో నటించారు.
తాజా వార్తలు (Latest News)
-
పతి దేవుడికి గుడి కట్టింది!
-
ఐపీఎల్లో భారీ స్కోర్లు అందుకే..: శుభ్మన్ గిల్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
-
శరీర బరువు తగ్గించే శస్త్రచికిత్సకు వెళ్లి..
-
సీఎంపై గులకరాయి వేసినా పట్టుకుంటారు... ఆయన బాబాయ్ను గొడ్డలితో నరికినా పట్టదా?
-
పులివెందులలోనూ పరదాల వీరుడే.. నేడు సీఎం జగన్ నామినేషన్