Bhumi Pednekar: మనాలీ వెళ్లడానికి..

బాలీవుడ్‌ యువ కథానాయిక భూమి పెడ్నేకర్‌ ప్రస్తుతం ‘ది లేడీ కిల్లర్‌’ చిత్రంలో నటిస్తోంది. కథానాయకుడు అర్జున్‌ కపూర్‌. అజయ్‌ బహ్‌ల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ కోసం ఈ బృందం త్వరలోనే

Updated : 22 Apr 2022 12:19 IST

బాలీవుడ్‌ యువ కథానాయిక భూమి పెడ్నేకర్‌ ప్రస్తుతం ‘ది లేడీ కిల్లర్‌’ చిత్రంలో నటిస్తోంది. కథానాయకుడు అర్జున్‌ కపూర్‌. అజయ్‌ బహ్‌ల్‌ దర్శకత్వం వహిస్తున్నారు. చిత్రీకరణ కోసం ఈ బృందం త్వరలోనే మనాలీ వెళ్లనుంది. ఈ సందర్భంగా భూమి తన ఆనందాన్ని పంచుకుంది. ‘నా వృత్తి వల్లే నేను ఎపుడూ చూడని ప్రదేశాలను చూడగలుగుతున్నాను. వివిధ ప్రదేశాల అందాలను, సంస్కృతిని చూసే అదృష్టం దక్కింది. మనాలీలో తొలి సారి షూటింగ్‌లో పాల్గొనడానికి ఎదురుచూస్తున్నా..’ అంది. ప్రయాణాలంటే ఇష్టపడే ఈ భామ తను మొదటి సారిగా మనాలీకి వెళ్తుండటంతో ఎగిరిగంతేస్తోంది. చిన్న పట్టణంలో జరిగే ఒక రొమాంటిక్‌ థ్రిల్లర్‌గా ‘ది లేడీ కిల్లర్‌’ తెరకెక్కుతోంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని