Tollywood: ఏపీ సీఎంతో మీటింగ్.. సినీ ప్రముఖులు ఏం మాట్లాడారంటే..!
సినిమా టికెట్ ధరల పెంపు, భారీ బడ్జెట్ చిత్రాలకు రాయితీలు.. ఇలా పలు అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్తో తాము జరిపిన చర్చలు కొంతమేర సఫలీకృతమైనట్లేనని గురువారం సినీ ప్రముఖులు మీడియా సమావేశంలో..
హైదరాబాద్: సినిమా టికెట్ ధరల పెంపు, భారీ బడ్జెట్ చిత్రాలకు రాయితీలు.. ఇలా పలు అంశాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్తో తాము జరిపిన చర్చలు సఫలీకృతమైనట్లేనని గురువారం సినీ ప్రముఖులు మీడియా సమావేశంలో వెల్లడించిన విషయం తెలిసిందే. చిరంజీవి, మహేశ్బాబు, ప్రభాస్, కొరటాల శివ, రాజమౌళి, పోసాని కృష్ణ మురళీ, అలీ, ఆర్.నారాయణ మూర్తి వంటి సినీ ప్రముఖులు సినీ పరిశ్రమ ఎదుర్కొంటోన్న ఇబ్బందుల గురించి సీఎంకు వివరించారు. తమ ప్రతిపాదనలు వెల్లడించారు. చిరంజీవి, మహేశ్బాబు, రాజమౌళి.. సీఎంతో జరిగిన సమావేశంలో ఏం మాట్లాడారంటే..
‘‘కేవలం ప్రభుత్వం నియమించిన కమిటీ ఇచ్చిన నివేదికలను మాత్రమే పరిగణనలోకి తీసుకోకుండా మా నుంచి కూడా అభిప్రాయాలు తెలుసుకునేందుకు మమ్మల్ని ఆహ్వానించినందుకు ధన్యవాదాలు. మీ అభిప్రాయాలు, నిర్ణయాలను మేం ఎప్పుడూ గౌరవిస్తాం. పేద ప్రజలకు అన్నీ అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతో మీరు తీసుకున్న నిర్ణయాన్ని మేం గౌరవిస్తూ.. అదే సమయంలో ఇండస్ట్రీపై ఆధారపడి బతుకుతున్న వేలాది మంది కార్మికులను దృష్టిలో ఉంచుకుని పెరుగుతున్న ఖర్చుల దృష్ట్యా.. అదే విధమైన రెవెన్యూ కూడా ఉంటే బాగుంటుందని మేం భావిస్తున్నాం. అందుకోసం మేమంతా చర్చించుకుని ఓ నిర్ణయం తీసుకోవడం.. దానిపై మీరు ఆలోచించి అందరికీ అందుబాటులో ఉండేలా నిర్ణయం తీసుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మీరు కొత్తగా నిర్ణయించిన టికెట్ ధరలు మాకెంతో ఆనందాన్ని ఇచ్చాయి. మీ నిర్ణయం మా పరిశ్రమ మొత్తానికి వెసులుబాటు. మీ నిర్ణయాన్ని మేమంతా ఏకీభవిస్తున్నాం. విభేదించడం లేదు. పరిశ్రమ మాటగా మీకు ధన్యవాదాలు చెబుతున్నా. ఇక మాదొక చిన్న ప్రతిపాదన.. భారీ బడ్జెట్ చిత్రాలకు కాస్త మినహాయింపులు ఇస్తే బాగుంటుందని మేం కోరుతున్నాం. ప్రేక్షకుల్ని థియేటర్కు రప్పించడానికి విజువల్ ఇంపాక్ట్ క్రియేట్ చేయడం కోసం కొన్నిసార్లు ఎక్కువ ఖర్చు చేయాల్సి వస్తోంది. అలాంటివి ఉంటేకానీ థియేటర్కు వెళ్లి చూడాలనే మూడ్ ప్రేక్షకులకు రావడం లేదు. ఎందుకంటే మా సినిమాలు రిలీజైన వారంలోనే ఓటీటీల్లో వచ్చేస్తున్నాయ్, అదీకాక పైరసీ మాకు ఎప్పటి నుంచో ఉన్న సమస్య. ఇవన్నీ అధిగమించి ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలంటే ఖర్చు ఎక్కువగా పెట్టాల్సి వస్తోంది. ఖర్చుకు అనుగుణంగా రెవెన్యూ కోరుకోవడం సర్వసాధారణం. ఖ్యాతి పొందుతున్న తెలుగు సినిమాలను కాపాడే దిశగా మీ చర్యలు కొనసాగాలి. అందులో భాగంగా ఇండస్ట్రీ వైపు చల్లని చూపు చూడాలని చేతులు జోడించి అడుగుతున్నాం. ఆ తర్వాత ఐదో షో అవకాశం ఉంటే చిన్న సినిమాలకు వెసులుబాటు ఉంటుందని ఎప్పటినుంచో ఆర్.నారాయణ మూర్తి అడుగుతున్నారు. ఆ విషయంపై ఇటీవల మీతో చర్చించగా.. మీరు అప్పటికప్పుడే ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు’’ - చిరంజీవి
‘‘కరోనా వల్ల మాత్రమే కాదు.. సినిమాలు ఎప్పుడు రిలీజ్ అవుతాయో కూడా తెలియక గడిచిన రెండేళ్లు ఎంతో కష్టంగా గడిచాయి. ప్రతి రెండు నెలలకొకసారి రిలీజ్ డేట్ అనుకుంటాం.. అది వాయిదా పడుతుంది. షూటింగ్స్ చేస్తాం.. మళ్లీ ఆగిపోతుంది. నా మొత్తం కెరీర్లో ఈ రెండు సంవత్సరాలు ఎంతో కష్టంగా అనిపించాయి. నాకు మాత్రమే కాదు మొత్తం చిత్రపరిశ్రమకూ ఈ రెండేళ్లు గడ్డుకాలమే. కానీ మీరు తీసుకున్న నిర్ణయంతో ఈరోజు ఎంతో ఆనందంగా ఉంది’’ - మహేశ్ బాబు
‘‘చిత్రపరిశ్రమకు, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి మధ్య వార్ జరుగుతోందని గడిచిన కొన్నిరోజులుగా వార్తలు వస్తున్నాయి. ఆ వార్తలన్నింటికీ ఫుల్స్టాప్ పెడుతూ నేడు మా అందర్నీ పిలిచి సమస్యలపై చర్చలు జరిపినందుకు ధన్యవాదాలు’’ - రాజమౌళి
‘‘చిన్న సినిమాలు, చిన్న సినిమా నిర్మాతలను కాపాడాలనే ఉద్దేశంతో ఐదోషోకు అనుమతి ఇచ్చినందుకు ధన్యవాదాలు’’ - ఆర్. నారాయణమూర్తి
‘‘చిన్న సినిమాలకు థియేటర్లు ఇప్పించండి’’ - పోసాని కృష్ణ మురళీ
‘‘ఇండస్ట్రీలో కేవలం దర్శకులు, నిర్మాతలు, నటీనటులు మాత్రమే కాకుండా సాంకేతిక నిపుణులు కూడా ఉన్నారు. వాళ్లకు ఉపయోగపడే విధంగా ఏదైనా నిర్ణయం తీసుకోవాలని కోరుతున్నా’’ - అలీ
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
కావ్య బాధ.. శారీలో లావణ్య, మౌనీరాయ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
ఆ దర్శకుడి మూఢనమ్మకం.. 42 రోజులపాటు ఒకే దుస్తులు: విద్యా బాలన్
తన తదుపరి చిత్రం ‘దో ఔర్ దో ప్యార్’ ప్రమోషన్స్లో భాగంగా వరుస ఇంటర్వ్యూల్లో పాల్గొంటున్నారు నటి విద్యాబాలన్ (Vidya Balan). -
నటీనటులకు రవాణా ఖర్చులు ఇవ్వకపోవడం బాధాకరం: మనోజ్ బాజ్పాయ్
‘సైలెన్స్ 2’ ప్రమోషన్లో భాగంగా పాల్గొన్న ఇంటర్వ్యూలో మనోజ్ బాజ్పాయ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. -
మీ ప్రేమ వెలకట్టలేనిది.. ట్రెండింగ్లో ‘మిరాయ్’..
తేజ సజ్జా నటిస్తోన్న తాజా చిత్రం ‘మిరాయ్’. దీని గ్లింప్స్ సోషల్మీడియాలో ట్రెండింగ్లో ఉంది. -
వాళ్లకు బాలీవుడ్ సేఫ్ కాదు.. ఎందుకంటే: ప్రీతీ జింటా
సినీ నేపథ్యం లేకుండా బాలీవుడ్లో రాణించడం కష్టమని నటి ప్రీతీ జింటా అన్నారు. -
మమ్ముట్టితో విభేదాలు.. స్పందించిన ‘ది వారియర్’ దర్శకుడు
మలయాళీ అగ్ర కథానాయకుడు మమ్ముట్టి (Mammootty)తో నెలకొన్న విభేదాలపై కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి (Lingusamy) స్పందించారు. 23 ఏళ్ల క్రితం ఏం జరిగిందో చెప్పారు. -
నా కామెంట్ సెక్షన్లో మీ పంచాయితీ ఏంటి?: రీతూవర్మ
‘డార్లింగ్’ అనే పిలుపు విషయంలో నటుడు ప్రియదర్శి, నటి నభానటేశ్ మధ్య బుధవారం సోషల్ మీడియాలో ఆసక్తికర సంభాషణ జరిగిన విషయం తెలిసిందే. ఇందులో ఇప్పుడు నటి రీతూవర్మ భాగమయ్యారు. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
చిరంజీవిని కలిసిన రష్యన్ ప్రతినిధులు.. దేనిపై చర్చించారంటే..!
చిరంజీవిని రష్యన్ ప్రతినిధులు కలిశారు. సినీ పరిశ్రమకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. -
స్టార్ హీరోను కలిసిన రిషబ్ శెట్టి.. ‘కాంతార 2’ కోసమేనా..!
మలయాళం అగ్ర కథానాయకుడు మోహన్లాల్ను కాంతార హీరో రిషబ్ శెట్టి కలిశారు. -
సినిమాల్లేక ఖాళీగా కూర్చొనే వాళ్లే అలా ఆలోచిస్తారు: విశాల్
తమిళనాడు చిత్ర నిర్మాతల మండలి తనకు రెడ్ కార్డ్ జారీ చేయడంపై నటుడు విశాల్ (Vishal) స్పందించారు. ఖాళీగా కూర్చొనే వాళ్లే అలాంటి ఆలోచనలు చేస్తారని ఆయన వ్యంగ్యాస్త్రాలు విసిరారు. -
ఆర్థికంగా ఇబ్బంది పడ్డా.. కమల్ స్క్రిప్ట్ మార్చేసేవారు: లింగుస్వామి కామెంట్స్
కమల్హాసన్ (Kamal haasan) హీరోగా దర్శకుడు లింగుస్వామి (Lingu Swamy) నిర్మించిన చిత్రం ‘ఉత్తమ విలన్’ (Uttama Villain). కమల్ అందించిన కథతో రమేశ్ అరవింద్ దీనిని తెరకెక్కించారు. -
తండ్రినయ్యాక ఆ అలవాటు మానేశాను: నిఖిల్
కుమారుడు పుట్టిన తర్వాత తన జీవితంలో చాలా మార్పులు వచ్చాయని హీరో నిఖిల్ అన్నారు. -
మిమ్మల్ని నా సినిమాలోకి తీసుకున్నందుకు చింతిస్తున్నా: సీనియర్ నటుడికి సందీప్ చురకలు
బాలీవుడ్ సీనియర్ నటుడు అదిల్ హుస్సేన్పై దర్శకుడు సందీప్రెడ్డి వంగా (Sandeep Reddy Vanga) ఆగ్రహం వ్యక్తంచేశారు. ఆయన్ని తన చిత్రంలోకి తీసుకున్నందుకు బాధగా ఉందన్నారు. -
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా!.. బడ్జెట్ ఎంతంటే..
బాలీవుడ్ స్టార్ హీరోతో ప్రశాంత్ వర్మ సినిమా తీయనున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడనుందని టాక్. -
ఇచ్చిన మాట నిలబెట్టుకున్న లారెన్స్.. నెటిజన్ల ప్రశంసలు
నటుడు, కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ (Raghava Lawrence) మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు. దివ్యాంగులకు వాహనాలు అందజేశారు. -
‘మహర్షి’ రాఘవను సన్మానించిన చిరంజీవి.. ఎందుకంటే..?
‘మహర్షి’గా తెలుగులో ఆదరణ సొంతం చేసుకున్న నటుడు రాఘవ. ఆయన్ను అగ్ర కథానాయకుడు చిరంజీవి (Chiranjeevi) సన్మానించారు. -
మిస్టర్.. కామెంట్ చేసేముందు మాటలు జాగ్రత్త: నటుడికి నభా నటేశ్ రిప్లై
నటి నభా నటేశ్కు నటుడు ప్రియదర్శికి మధ్య జరిగిన సంభాషణ ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ‘కామెంట్ చేసేముందు మాటలు సరి చూసుకోవాలి’ అని ఆమె సూచించారు.
తాజా వార్తలు (Latest News)
-
పిల్లలతో అశ్లీల వీడియోలు తీయడం ఆందోళనకరం, నేరం : సుప్రీంకోర్టు
-
వివేకా హత్యలో నాపై రెండు క్రిమినల్ కేసులు.. అఫిడవిట్లో పేర్కొన్న అవినాష్రెడ్డి
-
స్కూల్లో హెచ్ఎంకు ఫేషియల్ వీడియో తీసిన టీచరుపై దాడి
-
సైబర్ యుద్ధాలను ఎదుర్కొనేందుకు చైనా సైన్యంలో కొత్త విభాగం
-
MS Dhoni: ధోని.. ఇంకా నాటౌటే
-
వైకాపా పాలనలో చంద్రబాబుపై 22 కేసులు