Adipurush: తెలుగులో భారీ ధరకు ‘ఆది పురుష్’ థియేట్రికల్ రైట్స్?
‘రాధేశ్యామ్’ అంచనాలను అందుకోలేకపోయినా, దేశవ్యాప్తంగా ప్రభాస్కు ఉన్న క్రేజీ ఏమాత్రం తగ్గలేదు.
ఇంటర్నెట్డెస్క్: ‘రాధేశ్యామ్’ అంచనాలను అందుకోలేకపోయినా, దేశవ్యాప్తంగా ప్రభాస్కు ఉన్న క్రేజీ ఏమాత్రం తగ్గలేదు. ప్రస్తుతం ఆయన వరుస చిత్రాలతో బిజీగా ఉన్నారు. అందులో ఒకటి ఓం రౌత్ దర్శకత్వంలో రూపొందుతున్న మైథలాజికల్ మూవీ ‘ఆది పురుష్’. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా కనిపించనున్నారు. దాదాపు చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకొంటోంది. ముఖ్యంగా వీఎఫ్ఎక్స్ పనులు జరుగుతున్నాయి. మరోవైపు ఈ చిత్రానికి సంబంధించిన ట్రేడ్ వర్క్ కూడా జరుగుతోంది. ‘ఆది పురుష్’ తెలుగు వెర్షన్ థియేట్రికల్ రైట్స్ భారీ ధరకు అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది. ఏకంగా రూ.100 కోట్లకు యూవీ క్రియేషన్స్ ఈ హక్కులను దక్కించుకున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఎలాంటి అధికారిక సమాచారం లేదు. యూవీ క్రియేషన్స్ బ్యానర్పై గతంలో ప్రభాస్ ‘సాహో’లో నటించారు.
‘ఆది పురుష్’లో కృతిసనన్ సీతగా కనిపించనుంది. లంకేశ్గా ప్రతినాయకుడి పాత్రలో సైఫ్ అలీఖాన్ నటించారు. సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 12న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. మరోవైపు ప్రభాస్ వరుస చిత్రాలతో తీరిక లేకుండా ఉన్నారు. ‘సలార్’, ‘ప్రాజెక్ట్’ ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉండగా, మారుతీ దర్శకత్వంలో ఓ మూవీ, సందీప్ వంగాతో ‘స్పిరిట్’ చేయాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం
-
గుండెపోటుతో గ్యాంగ్స్టర్ ముఖ్తార్ అన్సారీ మృతి.. యూపీలో 144 సెక్షన్
-
వేడుకగా బర్రెలక్క వివాహం.. విషెస్ చెబుతోన్న నెటిజన్లు..
-
మర్మాంగంలోకి ఎయిర్ బ్లోయర్ నాజిల్.. యువకుడు మృతి