Puneeth Rajkumar: 2006లోనూ ఇలాగే..!
నటుడిగానే కాకుండా తన సేవాగుణంతో కన్నడనాట విపరీతమైన ఫ్యాన్ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న పవర్స్టార్ పునీత్కుమార్ మరణంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా విషాదఛాయలు అలుముకున్నాయి....
ఆనాటి రోజుల్ని గుర్తుచేసుకుని అభిమానులు కన్నీరుమున్నీరు
బెంగళూరు: నటుడిగానే కాకుండా తన సేవాగుణంతో కన్నడనాట భారీ ఫ్యాన్ఫాలోయింగ్ను సొంతం చేసుకున్న పవర్స్టార్ పునీత్కుమార్ హఠాన్మరణంతో ఆ రాష్ట్రవ్యాప్తంగా విషాదఛాయలు అలముకున్నాయి. పునీత్ను కడసారి చూసేందుకు బెంగళూరులోని కంఠీరవ స్టేడియానికి అభిమానులు భారీగా తరలివస్తున్నారు. దీంతో ఆ పరిసర ప్రాంతాల్లో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ప్రస్తుత పరిస్థితులు ఆనాడు రాజ్కుమార్ మరణించిన రోజుల్ని గుర్తు చేసేలా ఉన్నాయని పలువురు అభిమానులు అంటున్నారు. ఇంతకీ 2006లో రాజ్కుమార్ మరణించినప్పుడు ఏం జరిగిందంటే..!
వాకింగ్కు వెళ్లి వచ్చి.. కుప్పకూలి..!
ఆరోగ్యం విషయంలో ఎంతో జాగ్రత్తగా ఉండే రాజ్కుమార్ ప్రతిరోజూ ఉదయాన్నే వాకింగ్కు వెళ్తారు. 2006 ఏప్రిల్ 12న ఎప్పటిలానే వాకింగ్ చేసి ఇంటికి తిరిగి వచ్చి.. 11.30 గంటల సమయంలో రెగ్యులర్ హెల్త్ చెకప్ చేయించుకున్నారు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న ఆయన మధ్యాహ్నం ఒంటి గంట సమయంలో ఉన్నట్టుండి సోఫాలో కుప్పకూలిపోయారు. ఆయన వ్యక్తిగత వైద్యుడు.. ప్రాథమిక చికిత్స అందించి హుటాహుటిన ఆస్పత్రికి తరలించాడు. ఈ క్రమంలోనే మధ్యాహ్నం 2.30 గంటలకు రాజ్కుమార్ కన్నుమూశారని వైద్యులు ప్రకటించారు.
15 సంవత్సరాల తర్వాత మళ్లీ..!
సుమారు 15 సంవత్సరాల తర్వాత పునీత్ గుండెపోటుతో మరణించడం అభిమానుల్ని ఎంతగానో కలచివేస్తోంది. ఫిట్నెస్ విషయంలో ఎన్నో జాగ్రత్తలు పాటించే పునీత్ జిమ్లో వర్కౌట్లు.. సైక్లింగ్.. వాకింగ్.. రన్నింగ్.. ఇలా ఏదో ఒకరకంగా తన ఉదయాన్ని ప్రారంభించేవారు. శుక్రవారం ఉదయం నిద్రలేచిన తర్వాత తన పనులను ముగించుకుని జిమ్లోకి అడుగుపెట్టారు. తొమ్మిది గంటల సమయంలో వ్యాయామం చేస్తున్న ఆయన ఒక్కసారిగా కుప్పకూలారు. గుండెలో నొప్పిగా ఉందనడంతో.. ఇంటిసభ్యులు, ఆయన వ్యక్తిగత సిబ్బంది వెంటనే దగ్గర్లోని ఓ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం విక్రమ్ ఆస్పత్రికి తరలించగా.. పునీత్ ప్రాణాలు కాపాడటానికి అక్కడి వైద్యులు ఎంతగానో శ్రమించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. మధ్యాహ్నం సుమారు 2.30 గంటల సమయంలో పునీత్ మరణించినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఇక, తన తండ్రిని ఆదర్శంగా తీసుకున్న పునీత్ ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. రాజ్కుమార్ మాదిరిగానే పునీత్ కూడా.. మరణానంతరం తన కళ్లను దానం చేస్తానని ఓ సందర్భంలో చెప్పుకొచ్చారు.
రాజ్కుమార్ పెద్దకుమారుడు శివరాజ్కుమార్ గతంలో ఓసారి గుండెపోటుకు గురయ్యారు. 2015లో ఆయనకు స్వల్పంగా గుండెపోటు రావడంతో కుటుంబసభ్యులు ఆస్పత్రిలో చేర్పించారు. చికిత్స అనంతరం ఆయన ఆరోగ్యం మెరుగుపడింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
Balakrishna: 2014 రోజులు గుర్తొస్తున్నాయి... జయం మనదే
‘‘మంచి ఉద్దేశంతో సినిమా తీస్తే ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారు. వాళ్ల ఆదరణ ఒక బాధ్యతగా భావిస్తా. సమాజం పట్ల స్పృహతో, రాజకీయంగానూ చైతన్యం కలిగించాలనే ఆలోచనతోనే కథాంశాల్ని ఎంచుకుంటా. 2014లో ఎన్నికలకు ముందు ‘లెజెండ్’ విడుదలైంది. -
టిల్లు నవ్వడు.. నవ్వేలా చేస్తాడు!
‘డీజే టిల్లు’ చిత్రంతో సినీప్రియుల మదిపై చెరగని ముద్ర వేశారు సిద్ధు జొన్నలగడ్డ. ఆ పాత్రతో తెరపై ఆయన చేసిన అల్లరి అందర్నీ కడుపుబ్బా నవ్వించింది. దీంతో ఇప్పుడదే టిల్లు పాత్రతో మరోసారి అలరించేందుకు ‘టిల్లు స్క్వేర్’ సినిమాతో సిద్ధమయ్యారు సిద్ధు. -
కొన్నేళ్లపాటు గుర్తుపెట్టుకునేలా... ఫ్యామిలీస్టార్
తన కుటుంబాన్ని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించే ప్రతి వ్యక్తి ఫ్యామిలీస్టార్ అని చెప్పడమే ఈ సినిమా కథాంశం అన్నారు దిల్రాజు. ఆయన శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై శిరీష్తో కలిసి నిర్మించిన చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. -
చివరి తరంలో స్టార్స్ మేమే
‘‘చిత్రపరిశ్రమలో హిట్స్ మాత్రమే అందుకున్న నటీనటులు ఎవరు లేరు. ప్రతి ఒక్కరూ వారి కెరీర్లో హిట్ ఫ్లాప్ల రుచి చూశాకే విజయబాటలో నడుస్తార’’ని అంటోంది బాలీవుడ్ నాయిక కంగనా రనౌత్. -
హీరామండీ తారల మెరుపులు అప్పుడే
భారతీయ సినిమా స్థాయిని పెంచిన దర్శకుల్లో సంజయ్ లీలా భన్సాలీ ఒకరు. ప్రతి చిత్రాన్ని ఎంతో క్లాసిక్గా తీర్చిదిద్దడం ఈయన స్టైల్. త్వరలో తన కలల ప్రాజెక్టు ‘హీరామండీ: -
పేరు... ఆ రోజు
రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. రజనీకి ఇది 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
చరిత్రను మార్చిన సంఘటన
బాలీవుడ్ కథానాయకుడు విక్రాంత్ మాస్సే, రాశీ ఖన్నా ప్రధాన పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘ది సబర్మతీ రిపోర్ట్’. రంజన్ చందేల్ తెరకెక్కిస్తున్నారు. -
సూర్య 44వ చిత్రం ఖరారు
ప్రేక్షకుల్ని... అభిమానుల్ని ఆశ్చర్య పరుస్తూ తన కొత్త సినిమాని ప్రకటించారు సూర్య. ఎవరూ ఊహించని రీతిలో కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నట్టు ప్రకటించారు. అసలేమాత్రం ప్రచారంలోకి రాని కలయిక ఇది. -
తగ్గేదేలే..
దుబాయిలోని మేడమ్ టుస్సాడ్స్ మ్యూజియంలో గురువారం తన మైనపు విగ్రహం వద్ద అల్లు అర్జున్ -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘అగ్నివీర్’లో మార్పులకు సిద్ధం: రాజ్నాథ్
-
వైకాపా అభ్యర్థి రాజ్యలక్ష్మి ఎస్టీ కాదంటూ వ్యాజ్యం
-
లోయలో పడిన బస్సు.. 45 మంది మృతి.. గాయాలతో బయటపడ్డ 8 ఏళ్ల బాలిక
-
ఏపీలో రోగులకు ఎన్నికల కష్టాలు
-
అనపర్తి స్థానం మార్పు వైకాపా కుట్ర: నల్లమిల్లి
-
బరిలో ఐదుగురు ఓ.పన్నీర్సెల్వంలు.. అందరి నామినేషన్లు ఆమోదం