ఏప్రిల్‌ 16న ఓటీటీలో ‘తెల్లవారితే గురువారం’ 

ఓటీటీలో సినిమా ప్రేక్షకులను అలరించేందుకు మరో చిత్రం సిద్ధమైంది. శ్రీసింహా కోడూరి, మిషా నారంగ్‌, చిత్ర శుక్లా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. ఏప్రిల్‌ 16న ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో విడుదల కానుంది.

Published : 12 Apr 2021 15:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఓటీటీ వేదికపై సినిమా ప్రేక్షకులను అలరించేందుకు మరో చిత్రం సిద్ధమైంది. శ్రీసింహా కోడూరి, మిషా నారంగ్‌, చిత్ర శుక్లా ప్రధానపాత్రల్లో నటించిన చిత్రం ‘తెల్లవారితే గురువారం’. ఏప్రిల్‌ 16న ప్రముఖ తెలుగు ఓటీటీ వేదిక ‘ఆహా’లో విడుదల కానుంది. మణికాంత్‌ గెల్లి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మార్చి 27న థియేటర్లలో విడుదలైంది. ఇప్పుడు ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమైంది. వారాహి చలనచిత్రం, లౌక్య ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై రజని కొర్రపాటి, రవీంద్ర బెనర్జీ ముప్పనేని సంయుక్తంగా నిర్మించారు. రాజీవ్‌ కనకాల, సత్య, అజయ్‌, వైవా హర్ష కీలకపాత్రలు పోషించారు. కాలభైరవ సంగీతం అందించారు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని