Thiruveer: ఆ స్వేచ్ఛ దొరికింది ఇప్పుడే!
‘‘ఇప్పటివరకూ నన్ను ప్రతినాయక కోణంలోనే చూస్తూ అవకాశాలిచ్చారు. చేసిన సినిమాలు.. పాత్రల ప్రభావం అలాంటిది.
‘‘ఇప్పటివరకూ నన్ను ప్రతినాయక కోణంలోనే చూస్తూ అవకాశాలిచ్చారు. చేసిన సినిమాలు.. పాత్రల ప్రభావం అలాంటిది. ఇప్పటికీ నా దగ్గరికి అలాంటి పాత్రలు వస్తుంటాయి. ఆ ముద్ర నుంచి బయటికి రావడానికి చాలా సమయమే పట్టింది. ‘మసూద’ సినిమాతో నాలోని అమాయకత్వం కూడా బయటికొచ్చింది. ‘పరేషాన్’ (Pareshan)తో నాలోని అన్ని కోణాలూ కనిపిస్తాయి. ఇప్పట్నుంచి కథలు రాసుకునేవాళ్లకి నేనూ ఓ ప్రత్యామ్నాయం అవుతా’’ అన్నారు తిరువీర్ (Thiruveer). ‘పలాస’, ‘ఘాజీ’, ‘టక్ జగదీష్’, ‘మసూద’ తదితర చిత్రాలతో ప్రేక్షకులకి చేరువైన నటుడీయన. ఆయన ప్రధాన పాత్రధారిగా ‘పరేషాన్’ తెరకెక్కింది. రూపక్ రొనాల్డ్సన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం జూన్ 2న ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ సందర్భంగా తిరువీర్ మంగళవారం హైదరాబాద్లో విలేకర్లతో ముచ్చటించారు.
‘‘ఇదివరకు చేసిన ‘మసూద’ సీరియస్ కథే అయినా... నేను కనిపించినప్పుడంతా ప్రేక్షకులు నవ్వుకున్నారు. ‘పరేషాన్’ సినిమాతో ఇంకా ఎక్కువగా నవ్వుకుంటారు. ఇందులో ప్రతి పాత్రకీ ఏదో ఒక పరేషాన్ ఉంటుంది. అందుకే ఈ పేరు పెట్టాం. సహజంగా, పాత్రల అమాయకత్వం నుంచి పుట్టిన హాస్యంతో రూపొందిన చిత్రమిది. 2020లో కరోనా తొలి దశలో లాక్డౌన్ సడలింపుల తర్వాత చేసిన సినిమా ఇది. నిర్మాణానంతర కార్యక్రమాలే దాదాపుగా 20 నెలలు చేశాం. ఆ కథకి తగ్గట్టుగా సహజత్వం కోసమే ఇదంతా. సింగరేణి కుర్రాళ్ల కథ ఇది. నేనొక పాస్టర్ కొడుకుగా కనిపిస్తా’’.
* ‘‘దర్శకుడు రూపక్ రొనాల్డ్సన్ ఓ నాలుగు సన్నివేశాల కోసం ఆడిషన్ ఆడిగాడు. ఆ నాలుగు సన్నివేశాలు చెప్పినప్పుడే మరేమీ ఆలోచించకుండా నేను ఈ సినిమా చేస్తానని చెప్పా. అంత కొత్తగా అనిపించింది తన రచన. తను చూసిన జీవితం, ఊరు, స్నేహాలు, అక్కడి ప్రజల పాత్రల్ని తీసుకుని ఓ ఊహా ప్రపంచాన్ని సృష్టించారు. కథ, పాత్రలు, లొకేషన్లు... అన్నీ కొత్తగా ఉంటాయి. చిత్రీకరణ కోసం మంచిర్యాలలోనే రెండు నెలలు గడిపా. కేరళలా అనిపించింది ఆ ప్రదేశం. రానా దగ్గుబాటి ఈ సినిమాని చూస్తూ నవ్వుతూనే ఉన్నారు. చూడటం పూర్తయ్యాక ‘నాకు తెలియని ప్రపంచంలోకి నన్ను తీసుకెళ్లిందీ చిత్రం. ప్రేక్షకుల ముందుకు తీసుకెళ్లడానికి ఏం చేయగలనో చెప్పండి?’ అని అడిగారు. తను ఈ ప్రాజెక్ట్లోకి వచ్చాక తన సొంత సినిమాలా భుజాన వేసుకుని ప్రచారం చేస్తున్నారు’’.
* ‘‘ఇప్పటివరకూ పాత్రల్ని ఎంపిక చేసుకునే అవకాశమే నాకు రాలేదు. మిగిలిన పాత్రల్నే నేను చేశా. అయితే థియేటర్ ఆర్ట్స్ చేశాక నటుడిగా నేనెలాంటి సినిమాలు చేయాలనుకున్నానో అలాంటివే నాకోసం మిగిలాయి. వాటినే చేశా. ‘మసూద’ తర్వాత అంటే.. ఈ ఏడాది నుంచే నేను కథల్ని, పాత్రల్ని ఎంపిక చేసుకునే స్వేచ్ఛ దొరికింది. ఇప్పుడు ఇది చేశాను కాబట్టి, తర్వాత ఇదే చేస్తానని కాకుండా... కథ, కథలోని పాత్ర బాగుంటే చేయడానికి సిద్ధమైపోతున్నా. కొత్తగా నాలుగు సినిమాలు ఒప్పుకున్నా’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ తెరకెక్కిస్తున్న ‘పుష్ప2’లో కన్నడ నటుడు తారక్ పొన్నప్ప కీలకపాత్రలో నటిస్తున్నారు. తాజాగా తన పాత్ర గురించి వివరించారు. -
ఎవరీ అశ్వత్థామ.. కృష్ణుడు అతడికి ఇచ్చిన శాపం ఏంటి?
ప్రభాస్ (Prabhas) కథానాయకుడిగా నాగ్ అశ్విన్ దర్శకత్వంలో రూపొందుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 ఏడీ’ (Kalki 2898 AD). ఇందులో ప్రముఖ నటుడు అమితాబ్ బచ్చన్ అశ్వత్థామగా (Ashwathama) కనిపించనున్నారు. -
హిట్ జోడీ.. మళ్లీ సెట్!
నాయకానాయికలు తెరపై జంటగా కనిపించి ఒక్కసారి హిట్ జోడీ అనిపించుకుంటే చాలు.. మళ్లీ వారిద్దరి కలయికలో ఎప్పుడెప్పుడు సినిమా వస్తుందా? అని ఎదురుచూస్తుంటారు ప్రేక్షకులు. -
ఒక్క పోరాటం 26 రోజులు
అగ్ర తారల సినిమా అనగానే పాటలు, పోరాటాలే గుర్తొస్తాయి. వాటిపై కథానాయకులు మరింత శ్రద్ధ తీసుకుంటుంటారు. సెట్లో ఎన్ని సవాళ్లు ఎదురైనా స్వీకరించి రాజీ పడకుండా నటిస్తుంటారు. -
ఈ వేసవిలో బాగా నవ్విస్తాం: అల్లరి నరేశ్
పెళ్లెప్పుడు పెళ్లెప్పుడు అని వెంటపడేవాళ్లకి ఓ కొత్త సెక్షన్ పెట్టి లోపల వేయించండంటూ న్యాయస్థానంలో మొర పెట్టుకున్నాడు ఓ కుర్రాడు. అతని పెళ్లి గోల వెనక కథేమిటి? ఇంతకీ అతడికి పెళ్లయిందా లేదా? -
డైరెక్టర్స్ డేని ఘనంగా నిర్వహిస్తాం
‘‘భారతీయ సినిమాకి డైరెక్టర్స్ డే అనేది తలమానికం. తెలుగులో తప్ప ఇతర భాషల్లో ఎక్కడా ఇలాంటి ప్రయత్నం జరగలేదు. ఇందుకు కారణం... తెలుగు సినిమా గౌరవాన్ని ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పి, గిన్నిస్ బుక్ రికార్డ్ సాధించిన ఏకైక దర్శకుడు దాసరి నారాయణరావు. -
గురిపెట్టిన సత్యభామ
కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రధారిగా తెరకెక్కుతున్న ‘సత్యభామ’ విడుదల ఖరారైంది. సుమన్ చిక్కాల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మే 17న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నట్టుగా ఓ ప్రత్యేకమైన వీడియోతో ప్రకటించింది చిత్రబృందం. -
రజనీకాంత్ చిత్రం... కూలీ
లోకేశ్ కనగరాజ్ దర్శకత్వంలో రజనీకాంత్ కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రానికి ‘కూలీ’ అనే పేరుని ఖరారు చేశారు. ఇది రజనీ 171వ చిత్రం. సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. -
మహేశ్బాబు- కమిన్స్ ఫొటో వైరల్.. ఫ్రెండ్స్తో రాశీ.. కాజల్ ‘వింటేజ్ వైబ్స్’
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరు.. ‘ది దిల్లీ ఫైల్స్’ అప్డేట్ ఇచ్చిన దర్శకుడు
‘ది దిల్లీ ఫైల్స్’లో పెద్ద స్టార్స్ ఎవరూ ఉండరని దర్శకుడు స్పష్టం చేశారు.
తాజా వార్తలు (Latest News)
-
ఆయన్ని చూసి ఆశ్చర్యపోయాను.. అల్లు అర్జున్పై ‘కేజీఎఫ్’ నటుడు ప్రశంసలు..
-
దాని గురించి మాట్లాడటానికి ఇది సరైన సమయం కాదు: హార్దిక్ పాండ్య
-
కొండగట్టు క్షేత్రంలో ఘనంగా హనుమాన్ జయంతి
-
జైల్లో కేజ్రీవాల్కు ఇన్సులిన్.. మరి ఇప్పుడు ఎందుకు ఇచ్చారన్న ఆప్
-
టీ20 వరల్డ్ కప్లో ఓపెనర్లుగా గంగూలీ ఛాయిస్ వీళ్లే..!
-
గాల్లో ఢీకొన్న రెండు హెలికాప్టర్లు.. 10 మంది మలేసియా నేవీ సిబ్బంది మృతి