KritiSanon: ఈ ఏడాది మూడు కాదు.. నాకు నాలుగు విజయాలు.. : అల్లు అరవింద్‌

‘ఆదిపురుష్‌’ కో స్టార్‌ ప్రభాస్‌ అంటే తనకు ఇష్టమని, ఆయన్ని తాను అభిమానిస్తున్నానని అన్నారు నటి కృతి సనన్‌. హైదరాబాద్‌లో జరిగిన ‘తోడేలు’ ప్రీ రిలీజ్‌ ప్రెస్‌మీట్‌లో ఆమె ఈ విషయాన్ని బయటపెట్టారు. 

Updated : 19 Nov 2022 15:20 IST

హైదరాబాద్‌: ప్రభాస్‌ (Prabhas) అంటే తనకు ఇష్టమని చెప్పారు నటి కృతిసనన్ (KritiSanon)‌. ‘ఆదిపురుష్‌’ (Adipurush) రిలీజ్‌ కోసం తాను ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తన తదుపరి చిత్రం ‘తోడేలు’ ప్రమోషన్స్‌లో భాగంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రెస్‌మీట్‌లో పాల్గొన్న ఆమె ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘‘1 నేనొక్కడినే’తో నటిగా ఎంట్రీ ఇచ్చాను. ఆ సినిమా అప్పుడు మహేశ్‌ నాకెంతో సహకారం అందించారు. ఆయన మంచి వ్యక్తి. చాలా సంవత్సరాల తర్వాత ‘తోడేలు’తో తెలుగు వారిని అలరించేందుకు సిద్ధమైనందుకు ఆనందిస్తున్నా. ఈ చిత్రాన్ని కూడా మీ అందరూ ప్రేమిస్తారని అనుకుంటున్నా’’ అని తెలిపారు. నటుడు వరుణ్‌ ధావన్‌ సైతం.. ‘తోడేలు’ తెలుగులో రిలీజ్‌ అవుతున్నందుకు సంతోషం వ్యక్తం చేశారు. అనంతరం విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు చిత్రబృందం చెప్పిన విశేషాలివే.

తెలుగులో మీకు నచ్చిన నటుడెవరు? అలాగే సినిమాలు ఏమిటి?

కృతిసనన్‌: డార్లింగ్ ప్రభాస్‌ అంటే నాకెంతో ఇష్టం. ‘పుష్ప’, ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ నాకు బాగా నచ్చాయి.

ఈ సినిమా కోసం మీరెలా సిద్ధమయ్యారు?

వరుణ్‌ ధావన్‌: ఈ సినిమా కోసం ఎంతో కష్టపడి వర్క్‌ చేశా. ఇందులో నటించడానికి ఎనర్జీ ముఖ్యం.  ఈ సినిమా చేస్తున్నప్పుడు నా గొంతు ఎన్నోసార్లు పోయింది. దవడ కూడా తెరుచుకోలేదు.

వరుణ్‌లో మీకు బాగా నచ్చే విషయం ఏమిటి?

కృతిసనన్‌: వరుణ్‌ సెట్‌లో ఎంతో పాజిటివ్‌, ఎనర్జిటిక్‌గా ఉంటారు. సినిమాలో పనిచేస్తోన్న ప్రతి ఒక్కరి అభినయంపై ఆయన దృష్టి పెడతారు అది నాకెంతో నచ్చింది. 

మీ సినిమా తెలుగులో విడుదలవుతున్నందుకు ఎలా ఫీలవుతున్నారు?

వరుణ్‌ ధావన్‌: ఆనందంగా ఉంది. ఇది నాకొక ఇల్లులా ఫీలవుతున్నా. హైదరాబాద్‌లో సినీ ప్రియులెక్కువ. గతంలో నేను నటించిన ‘డ్యాన్స్‌ 3డీ’ తెలుగులోనూ విడుదలైంది. కాకపోతే ఆ సమయంలో మేము ఎక్కువగా ప్రమోట్‌ చేయలేదు. ఇప్పుడు గీతాఆర్ట్స్‌ వల్ల ప్రమోషన్స్‌ చేయడం వీలుపడింది. 

పాన్‌ ఇండియా సినిమా వల్ల ఒత్తిడికి గురవుతున్నారా?

కృతిసనన్‌: పాన్‌ ఇండియా ఒత్తిడి నాకేమీ లేదు. తెలుగు సినిమాతో నా కెరీర్‌ మొదలైంది. ‘ఆదిపురుష్‌’ షూట్‌ అప్పుడు తెలుగులో మాట్లాడుతుంటే నటిగా తొలి అడుగులేసిన రోజులు గుర్తుకు వచ్చాయి. మేమంతా ఒక్కటే. మంచి సినిమాలు చేసి ప్రేక్షకుల్ని ఎంటర్‌టైన్‌ చేయడమే మా లక్ష్యం. పాన్‌ ఇండియా ప్రాజెక్ట్‌లలో భాగమైనందుకు ఆనందిస్తున్నా. ‘ఆదిపురుష్‌’ కోసం ఆశగా ఎదురుచూస్తున్నా

ఈ సినిమాతో హ్యాట్రిక్‌ కొట్టనున్నారా?

అల్లు అరవింద్‌: ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంటుందని నమ్ముతున్నా. ‘కాంతార’, ‘ఊర్వశివో రాక్షసివో’ తర్వాత వరుసగా ఇది హ్యాట్రిక్‌ అనుకోవచ్చు. డిసెంబర్‌లో మరో రిలీజ్‌ (నిఖిల్‌, అనుపమ పరమేశ్వర్‌ జంటగా నటించిన 18 పేజెస్‌) ఉంది. కాబట్టి ఈ ఏడాది నా ఖాతాలో నాలుగు విజయాలు వేసుకోండి.

సంక్రాంతికి కేవలం తెలుగు సినిమాలు మాత్రమే విడుదల చేయాలంటూ ఇటీవల తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి ఓ లేఖ రాసింది. దానిపై మీ కామెంట్‌?

అల్లు అరవింద్‌: అది జరిగే పని కాదు.





Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని