Pushpa: ‘పుష్ప’ ప్రి-రిలీజ్‌ వేడుకకు అతిథులుగా ఆ ముగ్గురు హీరోలు?

ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో త్వరలో చిత్రబృందం ప్రి-రిలీజ్‌ వేడుక

Published : 06 Dec 2021 14:16 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ఐకాన్‌ స్టార్‌ అల్లు అర్జున్.. దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో రాబోతున్న చిత్రం ‘పుష్ప’. రష్మిక కథానాయిక. ఫహాద్‌ ఫాజిల్‌, ధనుంజయ్‌, సునీల్‌, అనసూయ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో తొలి భాగం ‘పుష్ప- ది రైజ్‌’ డిసెంబర్‌ 17న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో త్వరలో చిత్రబృందం సినిమా ప్రి-రిలీజ్‌ వేడుక నిర్వహించనుంది. చాలా కాలం తర్వాత అల్లు అర్జున్‌ చిత్రం థియేటర్లో విడుదల కావడం.. ప్రేక్షకుల్ని థియేటర్లకు రప్పించాలనే ఉద్దేశంతో ఈ ప్రి-రిలీజ్‌ వేడుకను ఘనంగా నిర్వహించాలని భావిస్తున్నారు. అందుకే, చిత్ర బృందం ముగ్గురు స్టార్‌ హీరోలను ఈ వేడుకకు ముఖ్య అతిథులుగా తీసుకురాన్నట్లు సినీవర్గాల్లో గుసగుసలు వినిపిస్తున్నాయి.

చిరంజీవి.. అల్లు అర్జున్‌ ఒకే కుటుంబం కావడంతో వేడుక రోజు తనకు షూటింగ్‌ లేనట్లయితే తప్పకుండా చిరు హాజరవుతారని తెలుస్తోంది. మరోవైపు  ప్రభాస్‌ కూడా ముఖ్య అతిథిగా వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రభాస్‌.. ఇటీవల ముంబయిలో ‘ఆదిపురుష్‌’ షూటింగ్‌ పూర్తి చేసుకొని తిరిగొచ్చారు. దీంతో అల్లు అర్జునే స్వయంగా ప్రభాస్‌ను ఆహ్వానించనున్నట్లు సమాచారం. ఇక బాలీవుడ్‌ నుంచి మరో హీరో ఈ వేడుకకు హాజరవుతారని తెలుస్తోంది. అల్లు అర్జున్‌ తండ్రి, నిర్మాత అల్లు అరవింద్‌.. నాని నటించిన ‘జెర్సీ’ చిత్రాన్ని దిల్‌ రాజుతో కలిసి బాలీవుడ్‌లో అదే పేరుతో రీమేక్‌ చేస్తోన్న విషయం తెలిసిందే. షాహిద్‌ కపూర్‌ ఇందులో ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. దీంతో అల్లు అరవింద్‌ ఆహ్వానిస్తే ఆయన కూడా ‘పుష్ప’ ప్రి రిలీజ్‌ వేడుకకు హాజరయ్యే అవకాశముంది. మరి నిజంగా ఎవరెవరు వేడుకకు హాజరవుతారో తెలియాలంటే.. చిత్రబృందం నుంచి అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని