F3: ఆడియన్స్‌కి గుడ్‌న్యూస్‌.. ‘ఎఫ్‌3’ టికెట్‌ రేట్లపై దిల్‌రాజు ప్రకటన

దగ్గుబాటి, మెగా హీరోల కాంబినేషన్‌లో వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌-2’. సుమారు మూడేళ్ల క్రితం బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా సృష్టించిన చేసిన నవ్వుల సునామీని ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎవ్వరూ.....

Updated : 18 May 2022 15:38 IST

హైదరాబాద్‌: దగ్గుబాటి, మెగా హీరోల కాంబినేషన్‌లో వచ్చిన పక్కా ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘ఎఫ్‌-2’. మూడేళ్ల క్రితం బాక్సాఫీస్‌ వద్ద ఈ సినిమా సృష్టించిన నవ్వుల సునామీని ఇప్పటికీ ఫ్యామిలీ ఆడియన్స్‌ మర్చిపోరు. ఇప్పుడు ఇదే చిత్రానికి సీక్వెల్‌గా ‘ఎఫ్‌-3’ వస్తోంది. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్‌, వరుణ్‌తేజ్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ చిత్రం వేసవి కానుకగా మే 27న విడుదల కానుంది. అయితే, ఇటీవల స్టార్‌హీరోల చిత్రాలు విడుదలైన సమయంలో కొద్ది రోజులపాటు టికెట్‌ ధరలు పెంచిన విషయం తెలిసిందే. దీంతో ‘ఎఫ్‌-3’కి కూడా టికెట్‌ రేట్లు పెంచుతారా? అని సినీ ప్రియులు చర్చించుకుంటున్నారు. దీనిపై బుధవారం ఉదయం చిత్ర నిర్మాత దిల్‌రాజు ఓ ప్రకటన చేశారు. ‘‘ఎఫ్‌-3’ చిత్రానికి టికెట్‌ రేట్లు పెంచడం లేదు. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకే మేము ఈ చిత్రాన్ని  మీ ముందుకు తెస్తున్నాం’’ అని స్పష్టత ఇచ్చారు. దిల్‌రాజు ప్రకటనతో ఫ్యామిలీ ఆడియన్స్‌ ఎంతో ఆనందిస్తున్నారు. డబ్బు, దాని వల్ల వచ్చే అనర్థాలు అనే ఆసక్తికరమైన కాన్సెప్ట్‌తో ‘ఎఫ్‌-3’ తెరకెక్కింది. వెంకీ, వరుణ్‌లకు జోడీగా తమన్నా, మెహ్రీన్‌లు నటించారు. మురళీ శర్మ, సోనాల్‌ చౌహాన్‌, సునీల్‌, అలీ తదితరులు కీలకపాత్రలు పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ స్వరాలు అందించారు.



Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని