మోహన్‌బాబు గర్జన.. ట్యూన్‌ కష్టమన్న ఇళయరాజా

మోహన్‌బాబు డైలాగ్‌ డెలివరీ గురించి మనందరికీ తెలిసిందే. అందుకే ఆయన డైలాగ్‌కింగ్‌ అయ్యారు. అయితే.. మోహన్‌బాబు చెప్పిన డైలాగ్‌కు ట్యూన్‌ కట్టడం కష్టమైన పని అంటున్నారు మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజ. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో మోహన్‌బాబ్‌ నటిస్తున్నారు.

Published : 20 Feb 2021 23:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: మోహన్‌బాబు డైలాగ్‌ డెలివరీ గురించి మనందరికీ తెలిసిందే. అందుకే ఆయన డైలాగ్‌కింగ్‌ అయ్యారు. అయితే.. మోహన్‌బాబు చెప్పిన డైలాగ్‌కు ట్యూన్‌ కట్టడం కష్టమైన పని అంటున్నారు మ్యూజిక్‌ మ్యాస్ట్రో ఇళయరాజా. డైమండ్‌ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కతున్న ‘సన్‌ ఆఫ్‌ ఇండియా’లో మోహన్‌బాబు నటిస్తున్నారు. ఈ చిత్రానికి ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. శ్రీలక్ష్మీప్రసన్న పిక్చర్స్‌, 24ఫ్రేమ్స్‌ ఫ్యాక్టరీ నిర్మిస్తున్నాయి.

కాగా.. మోహన్‌బాబు ఈ సినిమాలోని 11వ శతాబ్దం నాటి గర్జనను ఇళయరాజాకు వినిపించారు. వెంటనే.. ఇళయరాజా స్పందిస్తూ.. ‘ఇంత కఠినంగా ఉంది. ఇది పూర్తిగా గద్యం. మీరు పాటలా పాడుతారా..? దీనికి ట్యూన్‌ చేయడం చాలా కష్టం’ అని అన్నారు. అయితే.. ‘మీరే చేయగలరు. మీకు సాధ్యం కానిదేదీ లేదు’ అని మోహన్‌బాబు అన్నారు. వీళ్లతో పాటు డైరెక్టర్‌ రత్నబాబు కూడా ఉన్నారు. ఈ సంభాషణను వీడియో తీసి మంచు విష్ణు తన ట్విటర్‌లో పోస్టు చేశాడు. ‘దిగ్గజాలతో సినిమా నిర్మించడం నాకు దేవుడు ఇచ్చిన అవకాశం. ఒక గద్యాన్ని పాటగా మలచడం కేవలం లెజెండ్స్‌కు మాత్రమే సాధ్యం’ అంటూ రాసుకొచ్చాడు.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని