Tollywood: నిజ జీవితంలో ‘హిట్’ కొట్టని జంట కథలు
నాగచైతన్య, సమంత విడిపోయారు.. అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి. వాళ్లు కలిసి ఉండాలనీ, తెరపై మళ్లీ జంటగా నటించాలనుకున్న
నాగచైతన్య, సమంత విడిపోయారు.. అభిమానుల గుండెలు ముక్కలయ్యాయి. వాళ్లు కలిసి ఉండాలనీ, తెరపై మళ్లీ జంటగా నటించాలనుకున్న వాళ్లకి ఈ వార్తలు, తదనంతర పరిణామాలు బాధ కలిగించాయి. కలిసి ఉండలేనప్పుడు విడిపోవటమే మంచిదని ఇద్దరూ అభిప్రాయపడ్డారు. అయితే, అందుకు కారణాలపై మాత్రం ఇరువురూ నోరు విప్పలేదు. వీళ్లే కాదు.. వివిధ కారణాలతో వేరుపడ్డ సౌతిండియా సినిమా జంటలు చాలానే ఉన్నాయి. వాళ్లెవరు? ఎందుకు విడిపోయారో చూద్దాం!
నయనతార- ప్రభుదేవా
ఈ స్టార్ జంటది పదమూడేళ్ల ప్రేమకథ. చాలా ఏళ్లపాటు ‘టాక్ ఆఫ్ ది టౌన్’గా నిలిచారు. 2000 సంవత్సరంలో ఇద్దరి మధ్య ప్రేమ చిగురించింది. కానీ ప్రభుదేవాకి అప్పటికే రమాలత్తో పెళ్లైంది. మొదట్లో మేం ‘జస్ట్ ఫ్రెండ్స్’ అనేవాళ్లు. అంతకుమించి ఉందని మీడియా వార్తలు రాస్తూనే వచ్చింది. ‘నయన్ నా భర్తను వెంట తిప్పుకుంటోంది. వాళ్లిద్దరి మధ్య సంబంధంతో ప్రభుదేవా కుటుంబాన్ని పట్టించుకోవడం లేదు’ అంటూ రమాలత్ ఫిర్యాదు కూడా చేశారు. చివరికి ఆమె చెప్పిందే నిజమైంది. రమాలత్, ప్రభుదేవా 2010లో అధికారికంగా విడాకులు తీసుకున్నారు. నయనతారని పెళ్లి చేసుకుంటాడని అభిమానులు ఎదురుచూసినా ఏడాదిన్నరపాటు సహజీవనం చేశాక మనస్పర్థలు వచ్చి విడిపోయారు.
రష్మిక - రక్షిత్ శెట్టి.. నిశ్చితార్థంతోనే కట్
రష్మిక తెలుగువాళ్లకి పరిచయం కాకముందే కన్నడంలో మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెరంగేట్ర సినిమా ‘కిరిక్ పార్టీ’ చేస్తున్నప్పుడే హీరో రక్షిత్తో నిండా ప్రేమలో మునిగిపోయింది. జులై 2017లో ఈ జంట ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నారు. ఇద్దరిది చూడచక్కని జంట అని అభిమానులతో సహా అంతా అనుకున్నారు. ఈలోపు ఇద్దరు సినిమాల్లో బిజీ కావడంతో పెళ్లి వాయిదా వేసుకుంటూ వచ్చారు. మధ్యలో ఏమైందో తెలియదుగానీ ఏడాది తర్వాత బంధానికి బై చెప్పుకున్నారు. ఫ్యాన్స్ నిరాశలో మునిగిపోయారు. ఇద్దరి మధ్య వైరుధ్యాలు ఉండటంతో పెళ్లి చేసుకోలేకపోతున్నామని ప్రకటించారు. ఇదంతా రష్మిక వల్లే జరిగిందని రక్షిత్ అభిమానులు మందన్నని తీవ్రంగా విమర్శించారు. ట్రోల్ చేశారు. ఆమెని ప్రశాంతంగా ఉండనివ్వమని రక్షిత్ ఫ్యాన్స్ని కోరాడు.
అమలా పాల్-ఏఎల్ విజయ్
అమలా పాల్, విజయ్.. 2011లో ‘దేవ తిరుమగల్’ సినిమాకి కలిసి పని చేస్తున్నప్పుడు ప్రేమలో పడ్డారు. మూడేళ్లపాటు వీరి ప్రేమ ప్రయాణం కొనసాగింది. ఎన్నోసార్లు కెమెరాల కంట్లో పడ్డా ‘అబ్బే.. మా మధ్య ఏం లేదు’ అని చెబుతూ వచ్చారు. 2014లో ఇద్దరికీ స్టార్ హోదా వచ్చాక చివరికి అనుబంధాన్ని అధికారికంగా ప్రకటించి పెళ్లితో ఒక్కటయ్యారు. ఆదర్శ జంట అని పేరు కూడా తెచ్చుకున్నారు. మూడేళ్ల ప్రేమ తర్వాత మూడు ముళ్ల బంధం మూడేళ్లయ్యాక ముగిసింది. ‘ఒకరిపై ఒకరికి నమ్మకం లేకనే మేం విడిపోతున్నాం’ అని విజయ్ ప్రకటించాడు. అమలా, విజయ్ల మధ్య కలతలు చెలరేగడానికి ధనుష్ కారణమని విజయ్ తండ్రి, ప్రముఖ నిర్మాత ఏఎల్ అళగప్పన్ ఆరోపించాడు.
ప్రియదర్శన్- లిజీ
నటి లిజీ తెలుగువాళ్లకీ సుపరిచితమే. మంచి నటి.. మలయాళ దర్శకుడు ప్రియదర్శన్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. 24ఏళ్ల తర్వాత, ఇద్దరు పిల్లలు పుట్టి పెద్దవాళ్లు అయిన తర్వాత ఈ జంట విడిపోయింది. ఇన్నేళ్ల తర్వాత ఎందుకు విడిపోవాల్సి వచ్చింది? అని అంటే వాళ్లు చెప్పిన సమాధానం కలిసి ఉండటానికి ‘అహం’ అడ్డొచ్చిందని చెప్పడమే విచిత్రం.
కమల్ హాసన్- గౌతమి
దక్షిణ భారత సినిమా పరిశ్రమలో విడిపోయిన స్టార్ జంటలో ముందు చెప్పుకోవాల్సింది కమల్ హాసన్, గౌతమిల గురించి. కమల్ వాణీ గణపతి, సారికలతో విడాకులు తీసుకున్న తర్వాత తెలుగు నటి గౌతమితో దాదాపు పదేళ్లపాటు అనుబంధం కొనసాగించారు. నాలుగేళ్ల కిందట ఇద్దరూ విడిపోయారు. ‘నేను కమల్తో విడిపోవడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద బాధాకర నిర్ణయాల్లో ఒకటి’ అని ప్రకటించారు గౌతమి.
వీరే కాదు, పవన్కళ్యాణ్- రేణూ దేశాయ్, మంచు మనోజ్- ప్రణతి, సుమంత్- కీర్తి రెడ్డి, నోయల్-ఏస్తర్, సైతం ప్రేమించి, పెళ్లాడి విడిపోయారు. కథానాయిక మెహరీన్-బిష్ణోయ్, అఖిల్-శ్రియా భూపాల్ లు నిశ్చితార్థం తర్వాత వివాహాన్ని వద్దనుకున్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
సిద్ధు జొన్నలగడ్డ - అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. త్వరలో ఇది ఓటీటీలో విడుదల కానుంది. -
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
దర్శకధీరుడు రాజమౌళి (Rajamouli), నటుడు మహేశ్బాబు (Mahesh babu) కాంబినేషన్లో ఓ భారీ ప్రాజెక్ట్ పట్టాలెక్కనున్న విషయం తెలిసిందే. SSMB 29గా ఇది ప్రచారంలో ఉంది. -
ఇక్కడ ప్రభాస్, విష్ణు.. అక్కడ రజనీకాంత్, కమల్ హాసన్: వీరి చిత్రాల స్పెషల్ ఏంటంటే?
ప్రముఖ నటులు కొందరు కలిసి నటిస్తున్న చిత్రాలపై ప్రత్యేక కథనం. ఎవరెవరు ఏయే సినిమాల్లో నటిస్తున్నారంటే? -
నా పని తీరు నిదానమైనా.. నా సినిమాలు బలంగా మాట్లాడతాయి!
సున్నితమైన కథలతో యువతరం మెచ్చేలా సినిమాలు చేయడంలో దర్శకుడు శేఖర్ కమ్ములది అందె వేసిన చేయి. చిత్రసీమలో ఆయన ప్రయాణం మొదలై 25ఏళ్లు పూర్తవుతోంది. -
తరాలుగా తప్పని మహారణంతో... మిరాయ్
‘హను-మాన్’తో సూపర్ హీరో అనిపించుకున్న తేజ సజ్జా... సూపర్ యోధుడిగా తెరపై సందడి చేయనున్నారు. ఆయన కథానాయకుడిగా పీపుల్ మీడియా ఫ్యాక్టరీ పతాకంపై ఓ చిత్రం తెరకెక్కుతోంది. -
బయటి వాళ్లు అర్థం చేసుకోలేరు
చిత్రపరిశ్రమలోని నటీనటుల మధ్య ఉన్న స్నేహాన్ని బయటివాళ్లు ఎప్పటికీ అర్థం చేసుకోలేరని అంటోంది బాలీవుడ్ యువ కథానాయిక అనన్య పాండే. -
చిరంజీవిని కలిసిన మాస్కో బృందం
అగ్ర కథానాయకుడు చిరంజీవితో రష్యాకి చెందిన మాస్కో సాంస్కృతిక మంత్రిత్వ శాఖ ఉన్నత స్థాయి ప్రతినిధి బృందం గురువారం హైదరాబాద్లో సమావేశమైంది. -
కృష్ణ @ బృందావనం
ఆది సాయికుమార్ కథానాయకుడిగా... వీరభద్రమ్ చౌదరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘కృష్ణ ఫ్రమ్ బృందావనం’. ‘చుట్టాలబ్బాయ్’ తర్వాత ఆ కలయికలో రూపొందుతున్న చిత్రమిదే. -
మధ్య తరగతి కుటుంబ సంఘర్షణ
రాజా రవీంద్ర ప్రధాన పాత్రధారిగా... సాయిజా క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘సారంగదరియా’. పద్మారావు అబ్బిశెట్టి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. -
వీలైతే ఒకసారి వీళ్లపై తీసిన సినిమాలు చూడండి: పూరి జగన్నాథ్
‘పూరి మ్యూజింగ్స్’ పేరుతో పూరి జగన్నాథ్ మరో స్పెషల్ వీడియోను పంచుకున్నారు. అమిష్ పీపుల్ గురించి ఆసక్తికర విషయాలు చెప్పారు. -
‘అప్పుడు రూ.లక్ష కోట్ల అవినీతి.. ఇప్పుడు ఇంకా..’: శేఖర్ కమ్ముల
గతంలో తాను తెరకెక్కించిన ‘హ్యాపీడేస్’ రీ రిలీజ్ సందర్భంగా దర్శకుడు శేఖర్ కమ్ముల మీడియాతో మాట్లాడారు. -
దిగంగన కొత్త కబురు.. కేతికా రీడింగ్.. అదా టూర్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
‘టిల్లన్న వచ్చేస్తుండు’ ఓటీటీలోకి ‘టిల్లు స్క్వేర్’.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
-
ఆలస్యమైన మ్యాచ్.. హార్దిక్ పాండ్యకు జరిమానా
-
గరుడ ప్రసాద వితరణ.. చిలుకూరు బాలాజీ ఆలయ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్
-
మా హయాంలో ఇచ్చిన నోటిఫికేషన్లను వారి ఖాతాలో వేసుకున్నారు: కేటీఆర్
-
మహేశ్బాబు-రాజమౌళి మూవీ.. వైరల్గా మారిన వీడియో
-
డ్రోన్లను కూల్చేశామన్న ఇరాన్.. ‘నో కామెంట్స్’ అంటున్న ఇజ్రాయెల్