Tollywood: నవ్వులు పంచే ‘క్రేజీ ఫెలో’
‘‘పులితో పరుగు పందెం.. నాతో మందు పందెం వేయకూడదు’’ అంటున్నారు ఆది సాయికుమార్. ఆయన హీరోగా ఫణికృష్ణ సిరికి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్రేజీ ఫెలో’. కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. దిగంగన సూర్యవంశి, మర్నా మేనన్ కథానాయికలు. ఈ సినిమా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది
‘‘పులితో పరుగు పందెం.. నాతో మందు పందెం వేయకూడదు’’ అంటున్నారు ఆది సాయికుమార్ (Aadi). ఆయన హీరోగా ఫణికృష్ణ సిరికి తెరకెక్కిస్తున్న చిత్రం ‘క్రేజీ ఫెలో’ (Crazy Fellow). కె.కె.రాధామోహన్ నిర్మిస్తున్నారు. దిగంగన సూర్యవంశి, మర్నా మేనన్ కథానాయికలు. ఈ సినిమా అక్టోబర్ 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలోనే ప్రచార కార్యక్రమాల్లో భాగంగా గురువారం చిత్ర టీజర్ విడుదల చేశారు. ‘‘టైటిల్కు తగ్గట్లుగానే సినిమాలో ఆది పాత్ర చాలా క్రేజీగా ఉంటుంది. అతను చేసే పనులు తనకు కావాల్సిన వారికి ఇబ్బందులు కలిగిస్తుంటాయి. ఇలాంటి వ్యక్తి జీవితంలోకి ఇద్దరు అమ్మాయిలు ఎంట్రీ ఇస్తారు. మరి ఆ తర్వాత ఏమైంది? అన్నది మిగతా కథ’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. సంగీతం: ఆర్.ఆర్.ధ్రువన్, కూర్పు: సత్య గిడుతూరి, ఛాయాగ్రహణం: సతీష్ ముత్యాల.
నవంబర్లో ‘బనారస్’
జైద్ ఖాన్, సోనాల్ మాంటెరో జంటగా జయతీర్థ తెరకెక్కించిన పాన్ ఇండియా చిత్రం ‘బనారస్’ (Banaras). తిలకరాజ్ బల్లాల్ నిర్మాత. సుజయ్ శాస్త్రి, దేవరాజ్, అచ్యుత్ కుమార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ సినిమా నవంబర్ 4న తెలుగు, తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ విషయాన్ని చిత్ర బృందం ఇటీవల అధికారికంగా ప్రకటించింది. ‘‘బనారస్ సిటీ (వారణాసి) నేపథ్యంలో సాగే ఆహ్లాదకరమైన ప్రేమకథా చిత్రమిది. జైద్, సోనాల్ జోడీ అందరినీ ఆకట్టుకుంటుంది. మరిన్ని వివరాలు త్వరలో వెల్లడిస్తాం’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ చిత్రానికి సంగీతం: బి.అజనీష్ లోక్నాథ్, ఛాయాగ్రహణం: అద్వైత గురుమూర్తి.
గౌరవం పెంచే ‘అల్లూరి’
‘‘ఓ పోలీస్ జీవిత ప్రయాణమే.. ‘అల్లూరి’ (Alluri). సినిమా పూర్తయ్యే సరికి ప్రతి ఒక్కరికీ పోలీస్ వృత్తిపై ఎనలేని గౌరవం ఏర్పడుతుంది’’ అన్నారు నిర్మాత బెక్కెం వేణుగోపాల్. ఆయన నిర్మాణంలో శ్రీవిష్ణు హీరోగా రూపొందిస్తున్న చిత్రమే ‘అల్లూరి’. ప్రదీప్ వర్మ దర్శకుడు. బెక్కెం బబిత సమర్పిస్తున్నారు. ఈ సినిమా సెప్టెంబర్ 23న విడుదల కానుంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా నిర్మాత వేణుగోపాల్ మాట్లాడుతూ.. ‘‘మంచి కంటెంట్తో యాక్షన్ సినిమా తీయాలని కోరిక ఉండేది. అలాంటి సమయంలోనే దర్శకుడు ప్రదీప్ ఈ కథ చెప్పాడు. అల్లూరి పేరు వింటేనే ఓ పవర్ వస్తుంది. అంత పవర్ఫుల్ స్టోరీ ఇందులో ఉంది. శ్రీవిష్ణు చాలా కష్టపడ్డాడు. దీంట్లో ఆయన విశ్వరూపం చూస్తారు. ప్రదీప్ దీన్ని చాలా గొప్పగా తీశాడు. హర్ష వర్ధన్ రామేశ్వర్ అద్భుతమైన సంగీతం అందించారు. ఈ సినిమాపై ఉన్న ప్రేమ, గౌరవంతోనే ఇలా పోలీస్ డ్రెస్లో మీ ముందుకొచ్చా. సెప్టెంబర్ 3న వైజాగ్లోని అల్లూరి సీతారామరాజు సమాధి దగ్గర నుంచి చిత్ర బృందంతో కలిసి యాత్ర ప్రారంభిస్తున్నాం. 12రోజుల పాటు సాగే ఈ యాత్ర నిజామాబాద్లో ముగుస్తుంది. రేపటి నుంచి పాటలు విడుదల చేస్తాం. పది రోజుల తర్వాత ట్రైలర్ విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కూర్పు: ధర్మేంద్ర కాకరాల, ఛాయాగ్రహణం: రాజ్ తోట.
‘నేచర్’.. ప్రేమకథ
ప్రకృతిని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? ఆ ప్రేమ వల్ల అతను ఎన్ని కష్టాలు పడ్డాడు? చివరకు ప్రేమించిన అమ్మాయిని ఎలా దక్కించుకున్నాడు? తెలియాలంటే ‘నేచర్’ (Nature) చూడాల్సిందే. కృష్ట, ముస్కాన్ రాజేందర్ జంటగా అశ్విన్ కామరాజు కొప్పల తెరకెక్కిస్తున్న చిత్రమిది. సి.యశోదమ్మ, టి.చేతన్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అజయ్ ఘోష్, గౌతమ్రాజు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ సినిమాలోని ‘‘నిన్నే చూడందే’’ పాటను నటుడు అలీ ఇటీవల హైదరాబాద్లో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘‘టైటిల్ చాలా బాగుంది. ప్రకృతి బాగుంటే మనమంతా బాగుంటాం. ఈ పాట వింటుంటే నాకు ఇళయరాజా గీతాలు గుర్తొస్తున్నాయి’’ అన్నారు. ‘‘ప్రకృతిని ఇష్టపడే కుర్రాడు ప్రేమలో పడితే ఎలా ఉంటుంది? అనే కాన్సెప్ట్తో ఈ చిత్రం రూపొందిస్తున్నాం’’ అన్నారు చిత్ర దర్శకుడు అశ్విన్ కామరాజు. ఈ కార్యక్రమంలో యం.యల్.రాజా, కృష్ణుడు, కాశీ విశ్వనాథ్, సుధాకర్ తుపాకుల, రవి చల్ల తదితరులు పాల్గొన్నారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది. -
తెలుగు సినిమాకి కావల్సింది సహజత్వమే!
భారతీయ ప్రముఖ ఛాయాగ్రాహకుల్లో కె.యు.మోహనన్ ఒకరు. బాలీవుడ్లో షారుక్ఖాన్, ఆమిర్ఖాన్, అక్షయ్ కుమార్ తదితర అగ్ర కథానాయకులతో సినిమాలు చేశారు. కెమెరాతో ప్రేక్షకుల్ని ముగ్ధుల్ని చేస్తున్న ఆయన తెలుగులో ‘మహర్షి’ తర్వాత ‘ఫ్యామిలీస్టార్’ చిత్రానికి పనిచేశారు. -
నయన్... నాయికా ప్రాధాన్య చిత్రం?
ఆకర్షించే అందం, అద్భుతమైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకునే అగ్రతారల్లో ఒకరు నయనతార. పాత్ర ఏదైనా తన నటనతో అభిమానులను మెప్పిస్తుందీ భామ. -
అదే కాంబో కొత్త చిత్రం?
‘బూమ్’తో చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టింది బాలీవుడ్ నాయిక కత్రినా కైఫ్. తొలి సినిమాకే అగ్రకథానాయకుడు అమితాబ్ బచ్చన్తో తెరను పంచుకునే అవకాశం దక్కించుకుంది. ఆ తర్వాత ‘మల్లీశ్వరి’గా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైంది కత్రినా. -
అదితిరావ్, సిద్ధార్థ్ల పెళ్లి!
కథానాయకుడు సిద్ధార్థ్, నాయిక అదితిరావ్ హైదరీ వివాహ బంధంలోకి అడుగుపెట్టినట్టు తెలుస్తోంది. బుధవారం వనపర్తి జిల్లా శ్రీరంగాపురంలోని రంగనాథస్వామి ఆలయంలో ఇరు కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో పెళ్లి జరిగింది. -
గాయంతోనే చిత్రీకరణ పూర్తి చేశా
‘దిల్ సే సోల్జర్..దిమాక్ సే సైతాన్స్’ అంటూ యాక్షన్ హంగామా మొదలుపెట్టారు బాలీవుడ్ కథానాయకులు అక్షయ్ కుమార్, టైగర్ ష్రాఫ్. వారిద్దరూ కలిసి నటించిన యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రమే ‘బడేమియా ఛోటేమియా’. -
రెండు సంస్థలు కలిసి...
గోపీచంద్ కథానాయకుడిగా... శ్రీనువైట్ల దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ సినిమా కొత్త షెడ్యూల్ చిత్రీకరణ బుధవారం నుంచి ప్రారంభమైంది. ప్రధాన తారాగణంపై కీలక సన్నివేశాల్ని తెరకెక్కిస్తున్నారు. -
‘కలియుగం కలుషితం’ అనుకున్నాము
విశ్వ కార్తికేయ, ఆయూషి పటేల్ జంటగా రమాకాంత్ రెడ్డి తెరకెక్కించిన చిత్రం ‘కలియుగం పట్టణంలో’. కందుల చంద్ర ఓబుల్ రెడ్డి, జి.మహేశ్వర రెడ్డి, కాటం రమేష్ నిర్మించారు. శుక్రవారం ఈ సినిమా విడుదల కానుంది. -
నా బెడ్ రూమ్లో దెయ్యం కనిపించేది
హారర్ థ్రిల్లర్స్లో ‘ఇన్స్పెక్టర్ రిషి’ ఒక ప్రత్యేకమైన సిరీస్ అవుతుందన్నారు నవీన్చంద్ర. ఆయన కథానాయకుడిగా... నందిని జేఎస్ దర్శకత్వంలో రూపొందిన సిరీస్ ఇది. సునయన, కన్నా రవి, శ్రీకృష్ణ దయాల్, మాలినీ జీవరత్నం, కుమార్ వేల్ కీలక పాత్రలు పోషించారు.
తాజా వార్తలు (Latest News)
-
కాంగ్రెస్ vs కాంగ్రెస్.. హస్తం కంచుకోటకు అసమ్మతి బీటలు
-
భారత సరిహద్దులు పూర్తి సురక్షితం - రాజ్నాథ్ సింగ్
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 5 PM
-
మహబూబ్నగర్ ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో 99.86 శాతం పోలింగ్
-
పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
-
పరిశ్రమలు తెచ్చి కొడంగల్ను అభివృద్ధి చేస్తా: సీఎం రేవంత్