Friday Movies: ఈ శుక్రవారం బాక్సాఫీస్‌ దగ్గర ముగ్గురి పోటీ..!

ఈ శుక్రవారం టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. ‘కృష్ణ వ్రింద విహారి’, ‘అల్లూరి’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి.

Published : 21 Sep 2022 17:01 IST

హైదరాబాద్‌: ఈ శుక్రవారం టాలీవుడ్‌ బాక్సాఫీస్‌ వద్ద మూడు సినిమాలు పోటీ పడనున్నాయి. ‘కృష్ణ వ్రింద విహారి’, ‘అల్లూరి’, ‘దొంగలున్నారు జాగ్రత్త’ ఈ మూడు సినిమాలు ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమయ్యాయి. కథల ఎంపికలో కొత్తదనం చూపించే శ్రీ విష్ణు కథానాయకుడిగా ప్రదీప్‌ వర్మ దర్శకత్వంలో నటించిన చిత్రం ‘అల్లూరి’. ఈ సినిమాలో శ్రీవిష్ణు సరసన కయాదు లోహార్‌ నటిస్తోంది. పోలీసు అధికారి బయోపిక్‌గా వస్తున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో హీరో అల్లుఅర్జున్‌ కూడా భాగమయ్యారు. దీంతో ఈ సినిమాపై ప్రేక్షకులు ఆశలు పెట్టుకున్నారు. ఇక రొమాంటిక్‌ కామెడీ ఎంటర్‌టైనర్‌గా రానున్న నాగశౌర్య సినిమా ‘కృష్ణ వ్రింద విహారి’. అనిష్‌ ఆర్‌ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ సినిమాలో షిర్లీ సేథియా కథానాయిక. ఆద్యంతం వినోదాత్మకంగా ఉండనున్న ఈ చిత్రంలో నాగశౌర్య, షిర్లీల కెమిస్ట్రీ ప్రధాన ఆకర్షణగా నిలవనుంది. ప్రముఖ సంగీత దర్శకుడు కీరవాణి కొడుకు శ్రీసింహా ప్రధాన పాత్రలో థ్రిల్లర్‌ కథతో రూపొందిన చిత్రం ‘దొంగలున్నారు జాగ్రత్త’. ఈ సినిమాలో శ్రీసింహా సరసన ప్రీతి అస్రానీ నటించింది. ఈ సినిమా ఫస్ట్‌లుక్‌, పోస్టర్‌లు సినిమాపై ఆసక్తిని పెంచేవిధంగా ఉన్నాయి. రానున్న శుక్రవారం ఈ మూడు సినిమాలు డిఫరెంట్‌ జోనర్లతో ప్రేక్షకులను అలరించనున్నాయి.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని