MAA Election: రసవత్తరంగా ‘మా’రిన ఎన్నికలు
తెలుగు చిత్రపరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ఈ ఏడాది మరింత ఉత్కంఠగా జరగనున్నాయి. ‘మా’లో ఈ సారి త్రిముఖ పోరు జరగనుంది.
ఆసక్తికర పోరుకు సిద్ధమైన నటీనటులు
అందరి చూపు ‘మా’ వైపే!
హైదరాబాద్: తెలుగు చిత్రపరిశ్రమలో మరో రసవత్తర పోరుకు రంగం సిద్ధమైంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ‘మా’ ఎన్నికలు ఈసారి మరింత ఉత్కంఠగా జరగనున్నాయి. ‘మా’లో ఈ సారి చతుర్ముఖ పోరు జరగనుంది. ఓ వైపు నటుడు ప్రకాశ్ రాజ్, మరోవైపు హీరో మంచు విష్ణు అధ్యక్ష పదవి కోసం బరిలోకి దిగుతున్నట్లు ఇప్పటికే ప్రకటించిన విషయం విదితమే. కాగా, తాజాగా నటి జీవిత రాజశేఖర్, హేమ సైతం సెప్టెంబర్లో జరగనున్న ‘మా’ ఎన్నికలకు రంగం సిద్ధమయ్యారు. దీంతో ‘మా’ రాజకీయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
మెగా ఫ్యామిలీ మద్దతు..!
మొదటిసారి ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్న ప్రకాశ్రాజ్కి మెగాస్టార్ చిరంజీవి మద్దతు ఇస్తున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఈ విషయంపై ప్రకాశ్ రాజ్ ఓ ఇంటర్వ్యూలో స్పందిస్తూ.. ‘చిరంజీవి అందరి వ్యక్తి. ఆయన వ్యక్తిగతంగా ఏ ఒక్కరికో మద్దతు ఇవ్వరు. మంచి చేస్తారని ఆయన భావించినవారికి మద్దతిస్తారు. అన్నయ్యతో నాకున్న సాన్నిహిత్యాన్ని దీనికోసం వినియోగించుకోను’ అని సమాధానం ఇచ్చారు.
తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న సమస్యల గురించి తనకు పూర్తి అవగాహన ఉందని, వాటిని అధిగమించడానికి తనవద్ద సరైన ప్రణాళిక ఉందన్నారు. ఇతర చిత్ర పరిశ్రమలతో పోలిస్తే చాలా విషయాల్లో తెలుగు చిత్రపరిశ్రమ పెద్దదనీ.. కానీ ఒకప్పుడు ఉన్న పేరు ప్రఖ్యాతులు ఇప్పుడు లేవని ప్రకాశ్ రాజ్ అన్నారు. దేశవ్యాప్తంగా ‘మా’కు అత్యున్నత గౌరవం తీసుకొచ్చేందుకు తనవంతు కృషి చేస్తానన్నారు. ‘మా’కు ఇప్పటివరకూ సొంత భవనం లేదని, తాను అధ్యక్షుడైతే తప్పకుండా సొంత భవనం నిర్మిస్తానని హామీ ఇచ్చారు. సినీ కార్మికులకు సాయం చేయడానికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఎంతోమంది సహృదయం కలిగిన నటులు ఉన్నారని, వాళ్లందరినీ ఏక తాటిపైకి తీసుకొస్తానని ప్రకాశ్ రాజ్ ఇంటర్వ్యూలో వెల్లడించారు. ఇదిలా ఉండగా చిరంజీవి సోదరుడు నటుడు నాగబాబు ఇప్పటికే ప్రకాశ్ రాజ్కు తన మద్దతు ప్రకటించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే మెగా ఫ్యామిలీ హీరోలు కూడా ప్రకాశ్ రాజ్కు మద్దతు ఇచ్చే అవకాశాలు ఉండొచ్చని ఫిల్మ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.
మోహన్బాబు వారసుడు..!
సీనియర్ నటుడు మంచు మోహన్బాబు కుమారుడు హీరో విష్ణు ఈ ఏడాది ‘మా’ ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్లు ప్రకటించారు. త్వరలో జరగనున్న ‘మా’ అధ్యక్ష ఎన్నికల్లో తాను పోటీ చేయాలనుకుంటున్నట్లు చెప్పారు. దీంతో ఈ ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. సూపర్స్టార్ కృష్ణ, రెబల్స్టార్ కృష్ణంరాజు వంటి ప్రముఖ నటీనటులను విష్ణు సంప్రదించి ఈ ఎన్నికల్లో పోటీలో నిలబడటానికి సిద్ధమయ్యారు. ఈ మేరకు విష్ణు తన తండ్రి మోహన్బాబుతో వెళ్లి, కృష్ణని కలిసిన కొన్ని ఫొటోలు కూడా బయటకు వచ్చాయి. ‘మా’ సభ్యుల సంక్షేమం, ‘మా’ సొంత భవనం ఏర్పాటుకు కృషి వంటివి ప్రధాన అజెండాగా పెట్టుకుని ముందుకు సాగాలని మంచు విష్ణు నిర్ణయించుకున్నారు. ఈ మేరకు ఆయన పక్కా ప్రణాళికను సిద్ధం చేసుకుని సమరానికి సన్నద్ధమవుతున్నారు.
జీవిత సైతం..!
ప్రముఖ నటుడు రాజశేఖర్ సతీమణి జీవిత సైతం ఈ ఏడాది ‘మా’ ఎన్నికల బరిలోకి దిగనున్నట్లు వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం ‘మా’ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఆమె త్వరలో జరగనున్న అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ఫిల్మ్నగర్ వర్గాల్లో టాక్. ‘మా’ సభ్యురాలిగా.. తనకున్న అనుభవంతో అసోసియేషన్లో అంతర్గతంగా ఉన్న సమస్యలను తీర్చేందుకు ఆమె ఇప్పటికే పక్కా ప్లాన్ సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది.
ట్రెజరర్గా పోటీ చేద్దాం అనుకుని...
‘మా’ ఎన్నికలు ఈ ఏడాది మరింత ఉత్కంఠగా జరిగే అవకాశం కనిపిస్తోంది. నటి జీవితరాజశేఖర్ ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించిన 24 గంటల్లోనే మరో నటి హేమ పోరుకు సిద్ధమని ప్రకటించారు. ఆమె గతంలో ‘మా’లో ఉపాధ్యక్షురాలిగా, సంయుక్త కార్యదర్శిగా, ఈసీ సభ్యురాలిగా వ్యవహరించారు. ఈ అనుభవంతోనే ఆమె తాజాగా మా ఎన్నికల్లో పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈసారి ట్రెజరర్ పదవికి పోటీ చేయాలని అనుకున్నాను. అయితే నాకు అండగా నిలిచిన వారందరి కోసం, నా వారి కోసం ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవికి పోటీ చేయాలనుకుంటున్నాను అని హేమ అంటున్నారు.
ఇలా.. అధ్యక్ష పదవి కోసం నలుగురు హోరాహోరీగా పోటీ పడుతుండటంతో ‘మా’ ఎన్నికలు సర్వత్రా చర్చనీయాంశంగా మారాయి. ‘మా’ అభివృద్ధే నినాదంగా అందరూ బరిలోకి దిగుతుండటంతో ఫిల్మ్ నగర్వైపే అందరి దృష్టి ఉంది. ఈ వాడివేడి పోటీలో ఎవరి సపోర్ట్ ఎవరికి ఉందో.. ఎవరు ఎన్నికల బరిలో గెలుపొందుతారో.. తెలియాలంటే కొంతకాలం వేచి చూడాల్సిందే.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
రాశీఖన్నా ‘గోల్డెన్’ మెరుపులు.. అలా చూడొద్దన్న కేతిక.. టీమ్తో కృతి సనన్
సినీ తారలు సోషల్మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
లీడర్ పిలిస్తే.. జనసేన పార్టీ ప్రచారానికి సిద్ధంగా ఉన్నా: నటి అనసూయ
తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న అనసూయ పొలిటికల్ పార్టీల తరఫున ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. -
సినిమాలకు బ్రేక్ ఇవ్వనున్న స్టార్ హీరోయిన్.. కారణమిదేనా!
దీపికా పదుకొణెకు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఆమె సినిమాలకు బ్రేక్ తీసుకోనున్నట్లు వార్తలు వస్తున్నాయి. -
వారిద్దరు టామ్ అండ్ జెర్రీలా.. మెగా, మంచు ఫ్యామిలీలపై మనోజ్ డైలాగ్
రామ్ చరణ్ పుట్టిన రోజు వేడుకలకు హీరో మంచు మనోజ్ తదితరులు అతిథులుగా హాజరై, సందడి చేశారు. -
జాన్వీతో రామ్ చరణ్ సినిమా.. ఏడేళ్ల క్రితమే కోరిక బయటపెట్టిన చిరంజీవి
రామ్ చరణ్- జాన్వీ కపూర్ కలిసి సినిమా చేయాలని చిరంజీవి ఏడేళ్ల క్రితమే కోరుకున్నారు. గతంలో ఓ ఇంటర్వ్యూలో ఆయన ఈ విషయాన్ని బయటపెట్టారు. -
వరుస పరాజయాలతో నిద్రలేని రాత్రులు.. నేను కాబట్టి తట్టుకోగలిగా: స్టార్ హీరోయిన్
దాదాపు 25 ఏళ్ల సినీ కెరీర్లో తాను ఎదుర్కొన్న ఇబ్బందులపై బాలీవుడ్ నటి కరీనా కపూర్ (Kareena Kapoor) స్పందించారు. కెరీర్ ఆరంభంలో ఎన్నో ప్రశంసలు అందుకున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద విజయం అందుకోవడానికి అవి ఏమాత్రం ఉపయోగపడలేదన్నారు. -
‘ఇదొక అద్భుతమైన చిత్రం.. ప్రేక్షకులు తప్పక సపోర్ట్ చేయాలి’ - కమల్ హాసన్
పృథ్వీరాజ్ సుకుమారన్ (Prithviraj Sukumaran) ప్రధాన పాత్రలో నటించిన ‘ఆడు జీవితం’(Aadujeevitham)పై అగ్ర కథానాయకుడు కమల్ హాసన్ (Kamal Haasan) ప్రశంసల వర్షం కురిపించారు. -
వివాహ బంధంలోకి సిద్ధార్థ్ - అదితి రావు
నటుడు సిద్ధార్థ్ (Siddharth) అదితిరావు హైదరీ (Aditi Rao Hydari)ని వివాహం చేసుకున్నారు. -
రామ్చరణ్ బర్త్డే.. భక్తులకు సురేఖ అన్నదానం
నటుడు రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు నేడు. ఈ వేడుకలను ఆయన తల్లి సురేఖ ప్రత్యేకంగా సెలబ్రేట్ చేశారు. -
లండన్లో ఇల్లు కొన్న ప్రభాస్..?
ప్రభాస్(prabhas)కు సంబంధించిన ఓ ఆసక్తికర విషయం నెట్టింట వైరల్గా మారింది. విలాసవంతమైన ఇంటిని ఆయన కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య