ఓటీటీలో త్రిష కొత్త చిత్రం

నటి త్రిష తన 60వ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దీనికి ‘పరమపాదం విలయట్టు’ అనే టైటిల్‌

Published : 04 Apr 2021 16:28 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: నటి త్రిష తన 60వ చిత్రాన్ని ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. దీనికి ‘పరమపాదం విలయట్టు’ అనే టైటిల్‌ ఖరారు చేశారు. కె.తిరుజ్ఞానం దర్శకుడు. ఓ  విభిన్నమైన పొలిటికల్‌ థ్రిల్లర్‌ కథాంశంతో     రూపొందుతోన్న ఈ చిత్రం ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకుంది. ఫిబ్రవరిలోనే థియేటర్లలో విడుదల    చేయాలని భావించినా.. అనుకోని కారణాల వల్ల ఆఖరి నిమిషంలో వాయిదా పడింది.

ఇప్పుడీ సినిమాని తమిళ సంవత్సరాది కానుకగా ఏప్రిల్‌ 14న డిస్నీ+ హాట్‌స్టార్‌ ఓటీటీ వేదికలో విడుదల కానుంది. యథార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన చిత్రమిది. దీంట్లో త్రిష ఓ ప్రముఖ రాజకీయ నేతకు చికిత్స అందించే వైద్యురాలిగా కనిపించనుందని సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని