Trisha: 14 ఏళ్ల తర్వాత..

‘విక్రమ్‌’తో గతేడాది సంచలన విజయం అందుకున్నారు దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌. ఆ చిత్రం భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని అలరించింది.

Updated : 02 Feb 2023 07:13 IST

‘విక్రమ్‌’(Vikram)తో గతేడాది సంచలన విజయం అందుకున్నారు దర్శకుడు లోకేశ్‌ కనకరాజ్‌ (Lokesh KanagaRaj). ఆ చిత్రం భాషలతో సంబంధం లేకుండా ప్రేక్షకుల్ని అలరించింది. ఈ నేపథ్యంలో లోకేశ్‌ కనకరాజ్‌ సృష్టించిన సినిమాటిక్‌ యూనివర్స్‌ గురించి మరింతగా చర్చ జరిగింది. ‘విక్రమ్‌’ తర్వాత విజయ్‌ (Vijay) కథానాయకుడిగా సినిమాని తెరకెక్కిస్తున్నారు లోకేశ్‌. ‘దళపతి 67’గా  పట్టాలెక్కుతున్న ఆ చిత్రంలో కథానాయికగా త్రిష (Trisha) ఎంపికైనట్టు సినీవర్గాలు ప్రకటించాయి. విజయ్‌ - త్రిషలు 14 ఏళ్ల విరామం తర్వాత మళ్లీ కలిసి నటిస్తున్నారు. సంజయ్‌దత్‌, ప్రియా ఆనంద్‌, అర్జున్‌ సర్జా, గౌతమ్‌ మేనన్‌, మిస్కిన్‌, మన్సూర్‌ అలీఖాన్‌, మాథ్యూ థామస్‌ తదితరులు నటిస్తున్న ఈ చిత్రాన్ని 7 స్క్రీన్‌ స్టూడియో పతాకంపై ఎస్‌.ఎస్‌.లలిత్‌కుమార్‌ నిర్మిస్తున్నారు. అనిరుధ్‌ స్వరాలు సమకూరుస్తుండగా, మనోజ్‌ పరమహంస కెమెరా ఛాయాగ్రాహకుడు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని