Trisha: ‘బృందా’ ప్రయాణం పూర్తి

ఓటీటీ ప్రపంచంలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమైంది నటి త్రిష. ఆమె ప్రస్తుతం ‘బృందా’ అనే ఓ తెలుగు వెబ్‌ సిరీస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య వంగల తెరకెక్కిస్తున్నారు.

Updated : 24 Nov 2022 07:10 IST

ఓటీటీ ప్రపంచంలోకి తొలి అడుగు వేసేందుకు సిద్ధమైంది నటి త్రిష (Trisha). ఆమె ప్రస్తుతం ‘బృందా’ (Brinda) అనే ఓ తెలుగు వెబ్‌ సిరీస్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. సూర్య వంగల తెరకెక్కిస్తున్నారు. ఈ సిరీస్‌ తొలి సీజన్‌ చిత్రీకరణ పూర్తి చేసినట్లు ఞ సామాజిక మాధ్యమాల ద్వారా ప్రకటించింది. ఈ సందర్భంగా సెట్‌లోని ఓ ఫొటోను అభిమానులతో పంచుకుంది. ఆ ఫొటోను బట్టి.. ఈ సిరీస్‌లో ఆమె పోలీస్‌ పాత్రలో కనిపించనున్నట్లు స్పష్టత వచ్చింది. ఈ సిరీస్‌ త్వరలో ప్రముఖ ఓటీటీ వేదిక సోనీలివ్‌లో విడుదల కానుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని