Radheshyam: తెలంగాణ ప్రభుత్వ నిర్ణయంతో ప్రభాస్‌ ఫ్యాన్స్ హ్యాపీ

‘రాధేశ్యామ్‌’ విడుదల కోసం రెబల్‌స్టార్‌ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తు్న్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రియులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది...

Published : 10 Mar 2022 15:26 IST

హైదరాబాద్‌: ‘రాధేశ్యామ్‌’ విడుదల కోసం రెబల్‌స్టార్‌ అభిమానులందరూ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలోనే సినీ ప్రియులందరికీ తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. ప్రభాస్‌ కథానాయకుడిగా నటించిన ‘రాధేశ్యామ్‌’ సినిమా ఐదో ఆటకు అనుమతి ఇస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు మార్చి 11 నుంచి 25 వరకూ ఐదో షో ప్రదర్శించుకోవచ్చని తెలిపింది. తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ప్రభాస్‌ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. వరుస కమర్షియల్‌, యాక్షన్‌ సినిమాల తర్వాత ప్రభాస్‌ లవర్‌బాయ్‌ రోల్‌ పోషించిన చిత్రమిది. వింటేజ్‌ ప్రేమకథగా రూపుదిద్దుకున్న ఈ సినిమాలో ప్రభాస్‌ సరసన పూజాహెగ్డే నటించారు. రాధాకృష్ణ కుమార్‌ దర్శకుడు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని