‘ఉప్పెన’ జోడీగా సుధీర్‌-రష్మి సందడి

‘వీడు ముసలోడు అవ్వకూడదు’ అంటూ బేబమ్మగా వెండి తెరపై సందడి చేసింది కృతిశెట్టి. ఇప్పుడదే సందడిని బుల్లి తెరపైకి తీసుకొస్తుంది రష్మి.

Published : 12 Apr 2021 01:26 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ‘వీడు ముసలోడు అవ్వకూడదు’ అంటూ బేబమ్మగా వెండి తెరపై సందడి చేసింది కృతిశెట్టి. ఇప్పుడదే సందడిని బుల్లి తెరపైకి తీసుకొస్తుంది రష్మి. సుధీర్‌ని ఉద్దేశిస్తూ ఈ డైలాగ్‌ చెప్పి ఆకట్టుకుంటోంది. ప్రతి పండగకు ప్రత్యేక కార్యక్రమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తోన్న ఈటీవీ ఉగాది సందర్భంగా ‘ఉగాది జాతిరత్నాలు’ కార్యక్రమాన్ని రూపొందించింది. దీనికి ‘టక్‌ జగదీష్‌’ చిత్ర కథానాయకుడు నాని, రీతూ వర్మ అతిథులుగా విచ్చేశారు. ఈ షోలోనే సుధీర్- రష్మి ‘ఉప్పెన’ జోడీగా మారి జల జల జలపాతం గీతంలో కనిపించి, అందులోని ఫేమస్‌ డైలాగ్‌ చెప్పి అలరించారు.

ఈ కార్యక్రమంలో సుధీర్‌- రష్మి ప్రేమకథతోపాటు పవన్‌ కల్యాణ్‌గా సుధీర్‌, జూనియర్‌ ఎన్టీఆర్‌గా రామ్‌ ప్రసాద్‌, రామ్‌ చరణ్‌గా ఆది వేసిన స్టెప్పులు ఆకట్టుకుంటున్నాయి. గాయకుడు మనో, నటి పూర్ణ మధ్య సాగే సన్నివేశాలు నవ్వులు పూయిస్తున్నాయి. మరి ఈ హంగామా అంతా చూడాలంటే ఉగాది వరకు ఆగాల్సిందే. అప్పటి వరకు ఈ ప్రోమో చూసి ఆనందించండి...


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని