Pawan Kalyan: పవన్‌ నుంచి వీటిని ఎవరూ ఊహించి ఉండరు..!

పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగ్‌లు.. స్టైలిష్‌ హీరోయిజం ఎలివేషన్స్‌.. కాస్తంత చిలిపితనం.. సాధారణంగా మనం సినిమాల్లో పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ఇలా అన్నిరకాల ఎమోషన్స్‌లో చూస్తుంటాం. అది కేవలం కెమెరా ముందు వరకూ మాత్రమే..

Updated : 10 Jun 2022 10:54 IST

వైరల్‌గా మారిన వీడియోలు

హైదరాబాద్‌: పవర్‌ఫుల్‌ పంచ్‌ డైలాగ్‌లు.. స్టైలిష్‌ హీరోయిజం.. కాస్తంత చిలిపితనం.. సాధారణంగా మనం పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ సినిమాలో ఇలా అన్నిరకాల ఎమోషన్స్‌ చూస్తుంటాం. అది కేవలం కెమెరా ముందు మాత్రమే. బయటకు వస్తే ఆయన చాలా గభీరంగా కనిపిస్తుంటారు. ఇక, సినిమా ఈవెంట్స్‌లో ఆయన ఎలా ఉంటారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తాజాగా జరిగిన ఓ ప్రీరిలీజ్‌ ఈవెంట్‌లో పవన్‌కల్యాణ్‌ నుంచి అభిమానులు ఊహించని ఘటనలు చోటుచేసుకున్నాయి. ఆయా వీడియోలు ప్రస్తుతం నెట్టింట అందర్నీ ఆకర్షిస్తున్నాయి.

ఏవీ చూసి గోల చేసి..!

నాని కథానాయకుడిగా మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మించిన ఫుల్‌ టైమ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ ‘అంటే సుందరానికీ..’. వివేక్‌ ఆత్రేయ దర్శకుడు. గురువారం సాయంత్రం ఈ సినిమా ప్రీరిలీజ్‌ వేడుక హైదరాబాద్‌లోని శిల్పాకళావేదికలో జరిగింది. పవన్‌కల్యాణ్‌ ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఇందులో భాగంగా పవన్‌కల్యాణ్‌పై ఓ ప్రత్యేక ఏవీ ప్రదర్శించారు. ఆయన నటించిన చిత్రాల్లోని పవర్‌ఫుల్‌ డైలాగ్స్‌, ఆయన నటనపై సినీ ప్రముఖుల ప్రశంసలు, క్రేజీ సాంగ్స్‌కు ఆయన వేసిన స్టెప్పులు.. ఇలా ఈ ఏవీ సాగింది. అయితే ఈ ఏవీ ప్రదర్శన సమయంలో పవన్‌ హావభావాలు ఆకట్టుకున్నాయి. పాటలు ప్లే అవుతున్నప్పుడు ఆ మ్యూజిక్‌ని ఎంజాయ్‌ చేస్తూ ఆయన గోల చేశారు.

జైహింద్‌ చెప్పాక వెళ్లిపోవాలి.. కానీ..!

రాజకీయం, సినిమాలు.. ఇలా పవన్‌కల్యాణ్‌ ఎక్కడ స్పీచ్‌ ఇచ్చినా ‘జైహింద్‌’ అని చెప్పిన అనంతరం అభిమానులకు అభివాదం చేసుకుంటూ అక్కడ నుంచి వెళ్లిపోతారు. కానీ, నిన్న జరిగిన ఈవెంట్‌లో స్పీచ్‌ పూర్తై ‘జైహింద్‌’ అని చెప్పి అక్కడ నుంచి పవన్‌ బయలుదేరిన సమయంలో నటీమణులు నజ్రియా, నివేదా థామస్‌ ఆయన్ని పలకరించారు. తాను ఇచ్చిన స్పీచ్‌లో నివేదా థామస్‌ గురించి ఏం మాట్లాడలేదని గ్రహించిన ఆయన వెంటనే ఆమెను స్టేజ్‌ ముందుకు తీసుకువచ్చి ప్రత్యేకంగా ఫొటోలు దిగారు. ‘‘క్షమించాలి ఇందాక నివేదా థామస్‌ గురించి చెప్పడం మర్చిపోయాను. ఆమె చాలా గొప్ప నటి. అద్భుతంగా యాక్ట్‌ చేస్తారు. మీరు ఇలాగే ముందుకు సాగాలని కోరుకుంటున్నా’’ అని చెప్పారు. ఆయన ఆ మాట చెప్పడంతో నివేదా సంతోషం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ రెండు వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని