బాలీవుడ్లోకి కేంద్రమంత్రి కుమార్తె
కేంద్ర మంత్రి రమేశ్ పోక్రియాల్ నిశాంక్ తనయ ఆరుషి నిశాంక్ బాలీవుడ్లోకి అడుగుపెట్టడనున్నారు.
ముంబయి: కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్ తనయ ఆరుషి నిశాంక్ బాలీవుడ్లోకి అడుగుపెట్టనున్నారు. తరిణి చిత్రంతో తన నట జీవితాన్ని ప్రారంభించనున్నారు. మహిళా దినోత్సవం సందర్భంగా ఈ విషయాన్ని ఆరుషి ఇన్స్టా వేదికగా వెల్లడించారు.‘మహిళా దినోత్సవం సందర్భంగా తరిణి చిత్రం గురించి వెల్లడించడం ఎంతో సంతోషంగా ఉంది. తుపాన్లు, భయాలను జయించి చరిత్ర సృష్టించిన ఆరుగురు మహిళా నావికా సిబ్బంది చారిత్రక ప్రయాణమిది. ఐఎన్ఎస్ తరిణిలో వారు 254 రోజుల పాటు 21,600 నాటికల్ మైళ్ల దూరం ప్రయాణించి భూగోళాన్ని చుట్టివచ్చారు’ అంటూ తన చిత్ర కథాంశాన్ని వెల్లడించారు. ఆరుగురు మహిళల్లో ఒకరిగా ఆరుషి నటించనున్నట్లు తెలుస్తోంది. గ్లామర్ ప్రపంచం వైపు అడుగులు వేస్తోన్న ఈమెలో..ఒక సామాజిక కార్యకర్త ఉన్నారు. ‘గంగా బచావో అభియాన్’ ఉద్యమానికి ఈమె అంతర్జాతీయ స్థాయిలో అవార్డు అందుకున్నారు. అలాగే ఈ కరోనా సమయంలో జాగ్రత్తలు పాటించేలా ప్రజల్ని చైతన్యవంతుల్ని చేశారు. అంతేకాకుండా ఆమె ఎర్త్డే నెట్వర్క్ స్టార్గా కూడా ఎంపికయ్యారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
తాజా వార్తలు (Latest News)
-
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 1 PM
-
అది మీ రికార్డు పోలింగ్ కంటే ఎక్కువే..: పాశ్చాత్య మీడియాకు జై శంకర్ కౌంటర్
-
‘‘వాళ్లింట్లో వ్యక్తులను ఇలాగే కామెంట్ చేస్తే..’’: నెటిజన్పై బిగ్బాస్ నటి ఆగ్రహం
-
ఉచిత ఆధార్ కోసం వార్నర్ పరుగులు.. వీడియో చూశారా..?
-
టీ20 ప్రపంచ కప్ కోసం నేనూ రేసులో ఉన్నా: లఖ్నవూ సెంచరీ హీరో
-
భారత్లోకి టెస్లా ఎంట్రీ.. ఇప్పట్లో లేనట్లేనా?