Unstoppable: అవన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నా.. ‘లైగర్‌’టీమ్‌తో బాలకృష్ణ ఫన్‌!

ప్రముఖ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌’. ఇప్పటికే పలువురు తారలను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఇప్పుడు ‘లైగర్‌’  టీమ్‌తో ముచ్చటించారు.

Published : 11 Jan 2022 10:19 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ నటుడు బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న కార్యక్రమం ‘అన్‌స్టాపబుల్‌’. ఇప్పటికే పలువురు తారలను ఇంటర్వ్యూ చేసిన ఆయన ఇప్పుడు ‘లైగర్‌’ టీమ్‌తో ముచ్చటించారు. దర్శకుడు పూరి జగన్నాథ్‌, కథానాయకుడు విజయ్‌ దేవరకొండ, నిర్మాత ఛార్మితో బాలకృష్ణ చేసిన సందడికి సంబంధించిన ప్రోమో విడుదలైంది.

తాను పోషించిన పాత్రల్లో ఇప్పటికీ ఎప్పటికీ మరిచిపోలేనిది ‘తేడాసింగ్‌’ (పైసా వసూల్‌) అని బాలకృష్ణ పూరి జగన్నాథ్‌కి తెలిపారు. అదే సినిమాలోని ‘మామా ఏక్‌ పెగ్‌లా’ గురించి ప్రస్తావించారు. ‘పూరీ.. నీకు స్పానిష్‌ భాష అంటే ఇష్టం కదా’ అంటూ తనకొచ్చిన విధంగా మాట్లాడి నవ్వులు పంచారు. తాము కలిసి నటించిన ‘అల్లరి పిడుగు’ చిత్రాన్ని గుర్తు చేసుకుని ఇప్పుడు ‘పిడుగు’లా ఉన్నావంటూ ఛార్మిని ఆట పట్టించారు. ‘నువ్వు రౌడీ అయితే నేను రౌడీ ఇన్‌స్పెక్టర్‌. అసలు నువ్వెలా రౌడీగా ఫిక్స్‌ అయ్యావ్‌’ అని విజయ్‌ దేవరకొండని ప్రశ్నించారు. అనంతరం, తానే స్వయంగా కొబ్బరి బొండాలను కొట్టి ముగ్గురు అతిథులకు అందించారు. ఈ క్రమంలో  ‘బ్యాంకాక్‌లో అయితే ఇందులో మద్యం కలిపి ఇస్తారు’ అని ఛార్మి చెప్పగా ‘అన్నీ చేశాకే ఇక్కడికొచ్చి కూర్చున్నా’ అని బాలకృష్ణ సమాధానమివ్వడంతో షోలో నవ్వులు విరబూశాయి.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని