Cinema news: నెల నెలా.. మెరుపులా
వేసవి సినీ మారథాన్ ముగిసింది. అగ్రతారల మెరుపులతో సినీ సీమ కొత్త సొబగులద్దుకుంది. ఇక ఇప్పుడు యువ హీరోల వంతు. వేసవి జోష్ని కొనసాగిస్తూ.. వినోదాల జల్లుల్లో తడిపేందుకు సిద్ధమవుతున్నారు కుర్ర కథానాయకులు. ఈ వానాకాలంలో పసందైన వినోదాల్ని వేడి వేడిగా వడ్డించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో నెలల వ్యవధిలో వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్న యువ హీరోలూ ఉన్నారు. మరి వారెవరు? ఆ చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..
వేసవి సినీ మారథాన్ ముగిసింది. అగ్రతారల మెరుపులతో సినీ సీమ కొత్త సొబగులద్దుకుంది. ఇక ఇప్పుడు యువ హీరోల వంతు. వేసవి జోష్ని కొనసాగిస్తూ.. వినోదాల జల్లుల్లో తడిపేందుకు సిద్ధమవుతున్నారు కుర్ర కథానాయకులు. ఈ వానాకాలంలో పసందైన వినోదాల్ని వేడి వేడిగా వడ్డించేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇందులో నెలల వ్యవధిలో వరుస సినిమాలతో బాక్సాఫీస్ ముందు సందడి చేయనున్న యువ హీరోలూ ఉన్నారు. మరి వారెవరు? ఆ చిత్ర విశేషాలేంటి? తెలుసుకుందాం పదండి..
కార్తి.. ముచ్చటగా మూడు
జయాపజయాలతో సంబంధం లేకుండా వరుస సినిమాలతో జోరు చూపిస్తుంటారు కథానాయకుడు కార్తి. ప్రస్తుతం ఆయన ‘విరుమన్’, ‘పొన్నియిన్ సెల్వన్’, ‘సర్దార్’ సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ మూడు చిత్రాలు వరుస నెలల్లో ప్రేక్షకుల ముందుకు రానున్నాయి. వీటిలో తొలుత బాక్సాఫీస్ ముందుకు రానున్న చిత్రం ‘విరుమన్’. ఎం.ముత్తయ్య దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా ఆగస్ట్ 31న విడుదల కానుంది. తర్వాత నెల రోజులకే ‘పొన్నియిన్ సెల్వన్’తో వినోదాలు పంచనున్నారు. మణిరత్నం తెరకెక్కించిన భారీ పీరియాడికల్ చిత్రమిది. చోళుల కాలం నాటి చారిత్రక కథాంశంతో రూపొందిన ఈ సినిమా.. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రానుంది. తొలి భాగాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దాదాపు రూ.500కోట్ల భారీ బడ్జెట్తో నిర్మితమవుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంపై జాతీయ స్థాయిలో భారీ అంచనాలు నెలకొని ఉన్నాయి. ఇక కార్తి - పి.ఎస్.మిత్రన్ కలయికలో రూపొందిన సినిమా ‘సర్దార్’. రాశి ఖన్నా కథానాయిక. సరికొత్త స్పై యాక్షన్ థ్రిల్లర్ కథాంశంతో రూపొందిన ఈ చిత్రం అక్టోబర్ 24న ప్రేక్షకుల ముందుకు రానుంది.
చైతూ.. డబుల్ ట్రీట్
గతేడాది ‘లవ్స్టోరీ’తో భారీ విజయాన్ని అందుకున్న నాగచైతన్య తర్వాత తెలుగులో ‘థ్యాంక్ యూ’, హిందీలో ‘లాల్ సింగ్ చద్దా’ సినిమాల్లో నటించారు. ఇప్పుడీ రెండు సినిమాలు ఒకదాని వెంట మరొకటి బాక్సాఫీస్ ముందుకు వరుస కట్టనున్నాయి. అయితే వీటిలో ముందుగా ప్రేక్షకుల్ని పలకరించనున్న చిత్రం ‘థ్యాంక్ యూ’నే. ‘మనం’ వంటి హిట్ తర్వాత చైతన్య - విక్రమ్.కె.కుమార్ కాంబినేషన్లో రూపొందిన రెండో చిత్రమిది. దిల్రాజు, శిరీష్ సంయుక్తంగా నిర్మించారు. రాశి ఖన్నా, మాళవిక నాయర్, అవికా గోర్ కథానాయికలు. వినూత్నమైన ప్రేమ కథాంశంతో రూపొందిన ఈ సినిమా జులై 8న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇందులో చైతూ మూడు భిన్నమైన గెటప్పుల్లో కనిపించనుండటం విశేషం. ఇది విడుదలైన మరుసటి నెలలోనే ఆగస్ట్ 11న ‘లాల్ సింగ్ చద్దా’తో మరోమారు సినీప్రియుల ముందుకు రానున్నారు చైతన్య. ఇది ఆయన నటించిన తొలి బాలీవుడ్ సినిమా. ఆమీర్ఖాన్ హీరోగా నటించారు.హాలీవుడ్లో విజయవంతమైన ‘ఫారెస్ట్ గంప్’నకు రీమేక్గా రూపొందింది. ఇందులో ఆమిర్ స్నేహితుడిగా బాలా అనే ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారు చైతూ. ట్రైలర్ ప్రచార చిత్రంలో యుద్ధ నేపథ్యంలో ఆమిర్, చైతన్య మధ్య వచ్చిన సన్నివేశాలు హత్తుకునేలా ఉన్నాయి.
రెండు నెలలు.. రెండు థ్రిల్లర్లు
‘క్షణం’, ‘గూఢచారి’, ‘ఎవరు’ చిత్రాలతో వరుస విజయాలందుకొని జోరు మీదున్నారు అడివి శేష్. కొవిడ్ పరిస్థితుల వల్ల రెండేళ్లుగా బాక్సాఫీస్ ముందుకు రాలేకపోయిన ఆయన.. ఇప్పుడు ‘మేజర్’, ‘హిట్2’ సినిమాలతో ప్రేక్షకులకు డబుల్ ట్రీట్ ఇవ్వనున్నారు. ఈ రెండూ ఒక నెల వ్యవధిలోనే బాక్సాఫీస్ ముందుకు రానున్నాయి. 26/11 ముంబయి ఉగ్రదాడుల్లో వీరమరణం పొందిన మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితాధారంగా రూపొందిన చిత్రమే ‘మేజర్’. శశికిరణ్ తిక్క తెరకెక్కించారు. ఇది జూన్ 3న తెలుగు, హిందీ, మలయాళ భాషల్లో విడుదల కానుంది. ఈ చిత్ర హడావుడి ముగిసిన వెంటనే ‘హిట్2 ద సెకండ్ కేస్’తో థియేటర్లలో సందడి చేయనున్నారు అడివి శేష్. విష్వక్సేన్ నటించిన ‘హిట్’కు కొనసాగింపుగా రూపొందిన చిత్రమిది. శైలేష్ కొలను తెరకెక్కించారు. ప్రశాంతి తిప్పిరినేని నిర్మాత. నాని సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు. విభిన్నమైన ఇన్వెస్టిగేషన్ డ్రామా కథతో రూపొందిన ఈ సినిమా జులై 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమా.. ప్రస్తుతం నిర్మాణాంతర పనుల్లో ఉంది.
సత్యదేవ్.. ఒకే నెలలో రెండు
వైవిధ్యభరితమైన పాత్రల్లో మెప్పిస్తున్న సత్యదేవ్ ఒకే నెలలో ‘గాడ్సే’, ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాలతో సినీప్రియుల్ని పలకరించనున్నారు. వీటిలో ముందుగా సందడి చేయనున్న సినిమా ‘గాడ్సే’. ‘బ్లఫ్ మాస్టర్’ ఫేమ్ గణేష్ పట్టాభి తెరకెక్కించిన చిత్రమిది. సి.కల్యాణ్ నిర్మించారు. ఈ సినిమా జూన్ 17న విడుదల కానుంది. ఇందులో సత్యదేవ్ రాజకీయ వ్యవస్థను ప్రశ్నించే యువకుడిగా కనిపించనున్నారు. ఇదే నెలలో ఆయన నుంచి రానున్న మరో సినిమా ‘గుర్తుందా శీతాకాలం’. నాగశేఖర్ తెరకెక్కించారు. తమన్నా కథానాయిక. మేఘా ఆకాష్, కావ్య శెట్టి కీలక పాత్రలు పోషించారు. చిత్రీకరణ పూర్తి చేసుకున్న ఈ సినిమాని జూన్లో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. అయితే విడుదల తేదీపై స్పష్టత రావాల్సి ఉంది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
బాలకృష్ణ హీరోగా దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కించిన చిత్రాల్లో ‘లెజెండ్’ ఒకటి. ఈ సినిమా విడుదలై పదేళ్లు పూర్తయింది. ఈ సందర్భంగా నిర్వహించిన వేడుకలో బాలకృష్ణ సందడి చేశారు. -
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
హీరోగా తన తొలి సినిమా విడుదలైన రోజే అల్లు అర్జున్కు అరుదైన గౌరవం దక్కింది. అదేంటంటే? -
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
‘అఖండ 2’లో బాలకృష్ణ లుక్స్ ‘అఖండ’కు మించి ఉంటాయని రామ్స్ అన్నారు. తాను హీరోగా నటించిన ‘ఫైటర్ రాజా’ టీజర్ లాంచ్ ఈవెంట్లో ఆయన ఆసక్తికర కామెంట్స్ చేశారు. -
కార్తిక్ సుబ్బరాజు దర్శకత్వంలో ‘సూర్య44’.. అధికారికంగా ప్రకటించిన హీరో
ప్రముఖ కథానాయకుడు సూర్య తన 44వ చిత్రాన్ని సోషల్మీడియా వేదికగా ప్రకటించారు. -
ప్రెగ్నెన్సీపై స్పందించిన పరిణీతి చోప్రా.. ఏమన్నారంటే!
తల్లి కానున్నట్లు వస్తోన్న రూమర్స్పై నటి పరిణీతి చోప్రా స్పందించారు. -
రాఖీభాయ్ లుక్లో యశ్.. కేజీఎఫ్3 కోసమేనా?
కన్నడ నటుడు యశ్ తన ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఓ వీడియో వైరల్ అవుతోంది. -
పూజాహెగ్డే ‘స్పై’ ఫొటో.. ప్రగ్యా ‘పోజు’ రిపీట్.. మెహందీతో కావ్య!
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ.. -
నెట్ఫ్లిక్స్లో రికార్డు సృష్టించిన ‘ఫైటర్’.. టాప్3లో స్థానం
‘ఫైటర్’ చిత్రం నెట్ఫ్లిక్స్లో రికార్డు నెలకొల్పింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువమంది చూసిన చిత్రాల్లో టాప్3లో నిలిచింది. -
మేము సహ నటీనటులం మాత్రమే: రాశీఖన్నా
రాశీఖన్నా, నటుడు సిద్ధార్థ్ మల్హోత్రా గురించి ఓ ఇంటర్వ్యూలో మాట్లాడారు. -
అక్షయ్తో బ్రేకప్.. ఆత్మహత్య వార్తలపై స్పందించిన రవీనా టాండన్
అక్షయ్ కుమార్ (Akshay Kumar)తో వివాహం రద్దు కావడంపై నటి రవీనా టాండన్ (Raveena Tandon) స్పందించారు. బ్రేకప్ తర్వాత వచ్చిన పలు కథనాల గురించి ఆమె మాట్లాడారు. -
‘పుష్ప3’ టైటిల్ ఇదేనా.. వైరలవుతోన్న న్యూస్!
‘పుష్ప3’ మూడో భాగానికి సంబంధించిన ఓ వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. దీనికి టైటిల్ ఖరారైనట్లు తెలుస్తోంది. -
అదితితో పెళ్లి వార్తలు.. ఫొటో షేర్ చేసిన సిద్ధార్థ్
నటుడు సిద్ధార్థ్ (Siddharth), నటి అదితి రావు హైదరీ (Aditi rao Hydari) వివాహం చేసుకున్నారంటూ బుధవారం నెట్టింట వార్తలు చక్కర్లు కొట్టాయి. దీనిపై తాజాగా వీరిద్దరూ స్పందించారు. -
అనుపమ బాధపడటానికి కారణమదే: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ (Tillu Square)తో ప్రేక్షకులకు వినోదాన్ని అందించేందుకు సిద్ధమయ్యారు సిద్ధు జొన్నలగడ్డ (Siddu Jonnalagadda), అనుపమ పరమేశ్వరన్ (Anupama Parameswaran). ‘డీజే టిల్లు’కు సీక్వెల్గా తెరకెక్కిన ఈ చిత్రం శుక్రవారం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
21 ఏళ్ల తర్వాత అదే రోజున వస్తున్నాం: ‘ఫ్యామిలీ స్టార్’ రిలీజ్పై దిల్రాజు
విజయ్ దేవరకొండ (Vijay Deverakonda), మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur) ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఫ్యామిలీ స్టార్’ (Family Star) పరశురామ్ దర్శకుడు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమం హైదరాబాద్లో జరిగింది. -
చిత్రీకరణ కోసం ఇతర దేశాలకు వెళ్లడం తప్పేంకాదని తెలుసుకున్నా: ప్రియమణి
జాతీయ అవార్డు అందుకున్న తర్వాతే కథల ఎంపికలో మార్పు వచ్చిందని ప్రియమణి అన్నారు. -
రివ్యూ: ఆడుజీవితం: ది గోట్లైఫ్.. పృథ్వీరాజ్ సుకుమారన్ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉంది?
మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్, అమలాపాల్ కీలకపాత్రల్లో బ్లెస్సీ తీసిన ‘ఆడు జీవితం’ తెలుగు ప్రేక్షకులను మెప్పించిందా? -
వరుస ఫ్లాప్స్ వల్లే రాజకీయాల్లోకి అడుగుపెట్టారా: కంగన సమాధానం ఏమిటంటే..?
నటి కంగనా రనౌత్ (Kangana Ranaut) ఇటీవల రాజకీయాల్లోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. ఉన్నట్టుండి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వడంపై ఆమె తాజాగా స్పందించారు. -
‘డీజే టిల్లు’కు సీక్వెల్ అనగానే భయపడ్డా.. చాలా సర్ప్రైజ్లు ఉన్నాయి: సిద్ధు జొన్నలగడ్డ
‘టిల్లు స్క్వేర్’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్లో సిద్ధు జొన్నలగడ్డ మాట్లాడారు. ఆయన హీరోగా రూపొందిన ఈ సినిమా ఈ నెల 29న ప్రేక్షకుల ముందుకు రానుంది. -
ఓటీటీలోకి అభినవ్ గోమఠం కొత్త సినిమా.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..?
‘సేవ్ ది టైగర్స్’ వెబ్ సిరీస్తో తెలుగు ప్రేక్షకుల్లో విశేష ఆదరణ సొంతం చేసుకున్నారు నటుడు అభినవ్ గోమఠం (Abhinav Gomatam). ఆయన ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘మస్తు షేడ్స్ ఉన్నయ్ రా’ (MasthuShadesUnnaiRa). -
నన్ను తిట్టుకోవద్దు.. ఈసారి నేను ఎలాంటి లీకులు ఇవ్వలేను: దిల్రాజు
రామ్చరణ్ (Ram Charan) పుట్టినరోజు సందర్భంగా బుధవారం సాయంత్రం హైదరాబాద్లో వేడుకలు జరిగాయి. పలువురు సినీ ప్రముఖులు ఇందులో సందడి చేశారు. చరణ్తో తమకున్న అనుబంధాన్ని పంచుకున్నారు. -
ఆట మార్చే మాస్ పాట
‘సిక్స్ ప్యాక్లో యముడండీ... సిస్టమ్ తప్పితే మొగుడండీ...’ అంటూ రామ్చరణ్ పాత్ర తీరుతెన్నుల్ని పరిచయం చేసింది ‘గేమ్ ఛేంజర్’ పాట. రామ్చరణ్ కథానాయకుడిగా... శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రమిది.
తాజా వార్తలు (Latest News)
-
బుల్లెట్ రైలు.. మరో కీలక అప్డేట్ ఇచ్చిన అశ్వినీ వైష్ణవ్
-
దిల్లీకి మళ్లీ నిరాశే.. ఉత్కంఠ పోరులో రాజస్థాన్ విజయం
-
మేం మాటల మనుషులం కాదు.. చేసి చూపిస్తాం: బాలకృష్ణ
-
అల్లు అర్జున్కు మరో అరుదైన గౌరవం.. తొలి సినిమా విడుదలైన రోజే
-
బాలకృష్ణ లుక్స్.. ఈ సారి ‘అఖండ’కు మించి: రామ్స్
-
భారాసకు షాక్.. వరంగల్ ఎంపీ బరి నుంచి తప్పుకొన్న కావ్య