Upasana: ఉపాసనకు కొవిడ్‌.. కోలుకున్నా అంటూ పోస్ట్‌

నటుడు రామ్‌చరణ్‌ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల కొవిడ్‌ బారిన పడ్డారు. చెన్నైలో ఉంటోన్న కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్లాలనుకున్న ఆమె కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది.....

Published : 11 May 2022 12:01 IST

హైదరాబాద్‌: నటుడు రామ్‌చరణ్‌ సతీమణి, వ్యాపారవేత్త ఉపాసన కొణిదెల ఇటీవల కొవిడ్‌ బారిన పడ్డారు. చెన్నైలో ఉంటోన్న కుటుంబసభ్యులను కలిసేందుకు వెళ్లాలనుకున్న ఆమె కొవిడ్‌ పరీక్షలు చేయించుకోగా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ బుధవారం ఉదయం ఆమె ఓ పోస్ట్‌ పెట్టారు. ప్రస్తుతం తాను కొవిడ్‌ నుంచి కోలుకున్నట్లు తెలిపారు.

‘కొవిడ్‌ నుంచి కోలుకున్నా. విశ్రాంతి తీసుకుంటూనే మళ్లీ లైఫ్‌ని అన్నివిధాలుగా ప్రారంభించేందుకు సిద్ధమయ్యా. గతవారం నేను కొవిడ్‌ బారినపడ్డాను. వ్యాక్సినేషన్‌ తీసుకోవడం వల్ల స్వల్ప లక్షణాలు మాత్రమే కనిపించాయి. దాంతో వైద్యులు కేవలం పారాసిటిమాల్‌, విటమిన్‌ మందులు మాత్రమే వాడమని చెప్పారు. కొవిడ్‌ నుంచి కోలుకున్నాక. శారీరకంగా, మానసికంగా ఎంతో ధైర్యంగా ఉన్నా. కొవిడ్‌ మళ్లీ విరుచుకుపడుతుందా? అంటే చెప్పలేం. కాబట్టి మన జాగ్రత్తల్లో మనం ఉండటం, సంతోషంగా జీవించడం ఎంతో ముఖ్యం. చెన్నైలో ఉన్న మా తాతయ్యని కలిసేందుకు వెళ్లాలనుకుని పరీక్షలు చేయించుకుంటే పాజిటివ్‌గా తేలింది. ఒకవేళ టెస్టులు చేయించుకోకపోతే ఎవరికీ తెలిసేది కాదు’’ అని ఉపాసన రాసుకొచ్చారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని