‘ఉప్పెన’ విడుదల మరింత ఆలస్యం కానుందా?

వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. మైత్రీ

Updated : 07 Dec 2022 20:49 IST

ఇంటర్నెట్‌ డెస్క్: వైష్ణవ్‌తేజ్‌ కథానాయకుడిగా బుచ్చిబాబు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉప్పెన’. కృతిశెట్టి కథానాయిక. మైత్రీ మూవీ మేకర్‌ నిర్మించిన ఈ చిత్రం ఈ ఏడాది వేసవికి ముందే విడుదల కావాల్సి ఉంది. కరోనా కారణంగా వాయిదా పడింది. కరోనా పరిస్థితులు ఇప్పుడిప్పుడే చక్కబడుతుండటంతో థియేటర్లు తెరిచేందుకు ప్రభుత్వం నుంచి ఇటీవలే అనుమతి లభించింది. దీంతో సంక్రాంతి బరిలో ‘ఉప్పెన’ ఉండొచ్చని అంతా భావించారు. కానీ, చిత్ర బృందం ఆలోచన మరోలా ఉంది.

వచ్చే ఏడాది మార్చిలో ఈ చిత్రాన్ని థియేటర్లలోకి తీసుకొచ్చేందుకు నిర్మాతలు ఆలోచిస్తున్నట్లు సమాచారం. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడే అవకాశం ఉంది. దేవిశ్రీప్రసాద్‌ స్వరాలు సమకూర్చిన ఇందులోని పాటలు యూట్యూబ్‌లో మిలియన్ల కొద్ది వ్యూస్‌ దక్కించుకుని అమిత ప్రేక్షాదరణ పొందాయి. దీంతో అనేక ఓటీటీ మాధ్యమ సంస్థలు ఈ చిత్ర విడుదల హక్కులు పొందేందుకు భారీగానే ఆఫర్‌ చేశాయి. కానీ మెగా మేనల్లుడు వైష్ణవ్‌తేజ్‌ మొదటి సినిమా కావడంతో థియేటర్‌ సందడి మిస్‌ కాకూడదని ఇంతకాలం వేచి చూశారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని