Cinema News: నాటక కళాకారుల జీవన చిత్రం

దిలీప్‌ ప్రకాష్‌, రెజీనా, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అంతరించిపోతున్న నాటక కళా రంగం గురించి పరిచయం చేస్తూ.. దర్శకుడు అర్జున్‌ సాయి తెరకెక్కించారు. సురేష్‌ పాటిల్‌ నిర్మించారు.

Updated : 23 May 2022 06:51 IST

దిలీప్‌ ప్రకాష్‌, రెజీనా, ప్రకాష్‌ రాజ్‌, బ్రహ్మానందం, రాజేంద్ర ప్రసాద్‌ తదితరులు ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘ఉత్సవం’. అంతరించిపోతున్న నాటక కళా రంగం గురించి పరిచయం చేస్తూ.. దర్శకుడు అర్జున్‌ సాయి తెరకెక్కించారు. సురేష్‌ పాటిల్‌ నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా.. విడుదలకు సిద్ధమవుతోంది. ‘‘సురభి నాటకాలు.. ఆ కళాకారుల బతుకులు.. వారి బాధలు.. జీవిత గాథల్ని ఈ సినిమాలో హృద్యంగా చూపించనున్నాం. అనూప్‌ పాటలు, నేపథ్య సంగీతం చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. కెమెరామెన్‌ రసూల్‌ సినిమాని అందంగా తీర్చిదిద్దారు. బ్రహ్మ కడలి సెట్స్‌ అద్భుతంగా ఉంటాయి. త్వరలో చిత్ర ఫస్ట్‌లుక్‌, టీజర్‌ విడుదల కానుంది’’ అని చిత్ర వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో రఘుబాబు, అలీ, ప్రియదర్శి, రచ్చ రవి తదితరులు కీలక పాత్రలు పోషించారు. కూర్పు: కోటగిరి వెంకటేశ్వరరావు, ఛాయాగ్రహణం: రసూల్‌ ఎల్లోర్‌.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని