Samantha: ‘యశోద’గా సమంత.. పాన్‌ ఇండియా చిత్రం ప్రారంభం

ప్రముఖ కథానాయిక సమంత సినిమా అవకాశాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు.

Published : 06 Dec 2021 17:03 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: ప్రముఖ కథానాయిక సమంత సినిమా అవకాశాల విషయంలో జోరు ప్రదర్శిస్తున్నారు. ఇప్పటికే పలు చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె మరో క్రేజీ ప్రాజెక్టులో భాగమయ్యారు. ‘యశోద’ అనే పాన్‌ ఇండియా చిత్రంలో ఆమె ప్రధాన పాత్ర పోషిస్తున్నారు. ఈ సినిమా సోమవారం పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర బృందం ఓ పోస్టర్‌ను పంచుకుంది. ఈ చిత్రానికి హరీశ్‌ నారాయణ్‌, హరిశంకర్‌ దర్శకత్వం వహిస్తున్నారు. మణిశర్మ స్వరాలు సమకూరుస్తున్నారు. శ్రీదేవి మూవీస్‌ పతాకంపై శివలెంక కృష్ణప్రసాద్‌ నిర్మిస్తున్నారు. ఈ సినిమా థ్రిల్లర్‌ నేపథ్యంలో సాగుతుందని సమాచారం. ఇతర తారాగణం వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

సమంత ప్రధాన పాత్రలో దర్శకుడు గుణశేఖర్‌ తెరకెక్కిస్తున్న ‘శాకుంతలం’ త్వరలోనే విడుదలకానుంది. ‘ది అరేంజ్‌మెంట్స్‌ ఆఫ్‌ లవ్‌’ అనే అంతర్జాతీయ చిత్రంలో ఆమె నటించనున్నారు. అల్లు అర్జున్‌ హీరోగా తెరకెక్కుతున్న ‘పుష్ప’ చిత్రంలో ప్రత్యేక గీతంలో సందడి చేయనున్నారు.

Read latest Cinema News and Telugu News

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని