
Updated : 26 Nov 2021 15:44 IST
Perni Nani: ఆన్లైన్ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో పేర్ని నాని భేటీ
అమరావతి: సినిమాకు సంబంధించి ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ఏపీ ప్రభుత్వం త్వరలోనే అందుబాటులోకి తీసుకురానున్న విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం ఏపీ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి పేర్ని నాని ఆన్లైన్ టికెట్ల సర్వీసు ప్రొవైడర్లతో భేటీ అయ్యారు. వెబ్సైట్, యాప్ రూపకల్పనపై చర్చించారు. ఈ సమావేశంలో బుక్ మై షో, పేటీఎం, జస్ట్ బుకింగ్ ప్రతినిధులు పాల్గొన్నారు. ప్రభుత్వం నిర్దేశించిన ధరలను మాత్రమే థియేటర్లలో అమలు చేసేందుకు ఆన్లైన్ వ్యవస్థ ఉపయోగపడుతుందనే ఉద్దేశంతో ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నమిదని గతంలో మంత్రి నాని అన్నారు. ఇప్పటికే దీనిపై పలుమార్లు నిర్మాతలు, డిస్ట్రిబ్యూటర్లు, థియేటర్ల యాజమాన్యాలతో చర్చలు కూడా జరిపారు. చాలామంది ఆన్లైన్ వ్యవస్థపై మొగ్గుచూపడంతో ప్రభుత్వం కార్యచరణను వేగవంతం చేస్తోంది.
► Read latest Cinema News and Telugu News
ఇవీ చదవండి
Tags :