వైష్ణవ్‌ కొత్త సినిమా.. కథానాయిక ఆమేనా?

తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. ‘ఉప్పెన’ తర్వాత పలువురు

Published : 27 Mar 2021 17:18 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: తొలి చిత్రంతోనే ఘన విజయాన్ని సొంతం చేసుకున్నాడు వైష్ణవ్‌ తేజ్‌. ‘ఉప్పెన’ తర్వాత పలువురు దర్శక-నిర్మాతల చూపు ఆయనపై పడింది. ఇప్పటికే ఆయన రెండు చిత్రాలకి పచ్చజెండా ఊపారు. అందులో ఒకటి త్వరలోనే ప్రారంభం కానున్నట్టు తెలుస్తోంది.

‘అర్జున్‌రెడ్డి’ చిత్రాన్ని తమిళంలో రీమేక్‌ చేసిన గిరీశయ్య దర్శకత్వంలో వైష్ణవ్‌ తేజ్‌ సినిమా చేయనున్నారు. బి.వి.ఎస్‌.ఎన్‌.ప్రసాద్‌ నిర్మాత. వచ్చే నెల ఆరంభంలోనే ఆ చిత్రానికి కొబ్బరికాయ కొట్టనున్నారు. ఇందులో వైష్ణవ్‌కి జోడీగా కేతిక శర్మ నటించే అవకాశాలున్నాయి.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

    ap-districts
    ts-districts

    సుఖీభవ

    చదువు