Vaisshnav tej: ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది
‘‘ఫలానా జానర్ కథ చేయాలి.. పాన్ ఇండియా కథల్లో నటించాలని ప్రత్యేకంగా ప్రణాళికలేం లేవు. నా దారిలోకి వచ్చిన వాటిలో ఏ కథైతే నన్ను ఉత్తేజపరుస్తుందో.. అది చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నా’’ అన్నారు వైష్ణవ్ తేజ్. ‘ఉప్పెన’తో తెలుగు తెరపైకి అడుగు పెట్టి..
‘‘ఫలానా జానర్ కథ చేయాలి.. పాన్ ఇండియా కథల్లో నటించాలని ప్రత్యేకంగా ప్రణాళికలేం లేవు. నా దారిలోకి వచ్చిన వాటిలో ఏ కథైతే నన్ను ఉత్తేజపరుస్తుందో.. అది చేసుకుంటూ వెళ్లాలనుకుంటున్నా’’ అన్నారు వైష్ణవ్ తేజ్ (Vaisshnav tej). ‘ఉప్పెన’తో తెలుగు తెరపైకి అడుగు పెట్టి.. తొలి ప్రయత్నంలోనే చక్కటి విజయంతో అందరి దృష్టినీ ఆకర్షించిన హీరో ఆయన. ఇప్పుడాయన కేతిక శర్మతో కలిసి ‘రంగ రంగ వైభవంగా’తో (Ranga Ranga Vaibhavanga) వినోదాలు పంచేందుకు సిద్ధమయ్యారు. గిరీశాయ తెరకెక్కించిన ఈ చిత్రాన్ని బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించారు. శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది. ఈ నేపథ్యంలోనే గురువారం హైదరాబాద్లో విలేకర్లతో చిత్ర విశేషాలు పంచుకున్నారు వైష్ణవ్ తేజ్.
అరుదుగా వచ్చే కథ..
‘‘దర్శకుడు గిరీశాయ ఈ కథ వినిపించగానే బాగా నచ్చేసింది. స్క్రిప్ట్ వింటున్నప్పుడు చాలా నవ్వుకున్నాను. కథతో పూర్తిగా కనెక్ట్ అయ్యా. ఇందులో యువతరం మెచ్చే అంశాలతో పాటు కుటుంబ ప్రేక్షకులకీ నచ్చే ఫ్యామిలీ డ్రామా ఉంది. ఇలాంటి కథలు చాలా అరుదుగా వస్తుంటాయి. అందుకే స్టోరీ వినగానే మరో ఆలోచన లేకుండా చేస్తానని చెప్పేశా’’.
అందుకే ఈ కథే ఒప్పుకొన్నా..
‘‘ఈ చిత్రంలో నేను వైద్య విద్యార్థిగా కనిపిస్తా. నాకు కేతికకు మధ్య ఇగోతో సాగే చక్కటి ప్రేమకథ కనిపిస్తుంది. అందరూ ఇది ‘ఖుషి’, ‘నిన్నే పెళ్లాడతా’ ఫ్లేవర్లో కనిపిస్తోంది అంటున్నారు. నిజానికి దీనికి ఆ సినిమాలకు ఏ సంబంధం ఉండదు. ఇది పూర్తిగా కొత్త కథ. ఈ కథకే నేను కనెక్ట్ అవ్వడానికి కారణం గిరీశాయ ఈ స్క్రిప్ట్ను తీర్చిదిద్దిన తీరు. తప్పకుండా మంచి సినిమా అవుతుందనిపించింది’’.
విలువైన విషయాలు నేర్చుకున్నా..
‘‘ఈ చిత్రంతో చాలా మంది సీనియర్ నటులతో కలిసి పనిచేసే అవకాశం దొరికింది. ‘కొండపొలం’లో కొందరు సీనియర్స్తో పని చేశాను. ఇందులో ఇంకా ఎక్కువ మందితో నటించగలిగా. నరేశ్, ప్రభు, ప్రగతి, తులసి.. ఇలా ప్రతి ఒక్కరి నుంచీ ఎన్నో విలువైన విషయాలు నేర్చుకున్నా. నవీన్ చంద్ర ఇందులో ఓ స్పెషల్ రోల్ చేశాడు. తను సెట్ బయట ఒకలా ఉంటారు. షాట్ రెడీ అనగానే ఒక్కసారిగా మారిపోతారు. ఇలాంటివి తన నుంచి నేర్చుకున్నా. నేను లెర్నింగ్ యాక్టర్ని. ఎన్ని సినిమాలు చేసినా.. ఇంకా నేర్చుకోవాల్సింది ఉందనిపిస్తుంది. అందరినీ ఎంటర్టైన్ చేస్తూ.. ప్రతి చిత్రం నుంచీ ఏదోకటి కొత్తగా నేర్చుకుంటూనే ముందుకెళ్తుంటా’’.
టచ్ చేయను..
‘‘నా మామయ్యలు చిరంజీవి, పవన్ కల్యాణ్ల సినిమాలు చూస్తూనే పెరిగాను. వాళ్లు చేసిన చిత్రాలను మళ్లీ టచ్ చేయాలని అసలు అనుకోను. ఒకవేళ ఎవరైనా వచ్చి ఇది బాగుంటుంది, నువ్వే చెయ్యాలి అంటే ‘బద్రి’ రీమేక్ చేయాలని ఉంది. అన్నయ్య సాయి తేజ్కు నాకు మధ్య అనుబంధం ఎలా ఉంటుందో మా ప్రీరిలీజ్ ఈవెంట్ చూస్తే అర్థమవుతుంది. ఇంట్లో మేమిద్దరం అలాగే ఉంటాం. అన్నయ్య నన్నెప్పుడూ ఆటపట్టిస్తూనే ఉంటాడు’’.
* ‘‘ప్రస్తుతం నేను సితార ఎంటర్టైన్మెంట్స్లో ఓ సినిమా చేస్తున్నాను. శ్రీకాంత్ రెడ్డి అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. మాస్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుంది’’.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
పుష్ప పుష్ప పుష్పరాజ్
‘పుష్ప2’ ప్రచార హంగామా ఊపందుకోనుంది. మే 1న తొలి పాటని విడుదల చేస్తున్నట్టు బుధవారం చిత్రబృందం ప్రకటించింది. ‘పుష్ప పుష్ప పుష్పరాజ్...’ అంటూ సాగే ఆ పాట ప్రోమోని విడుదల చేశారు. -
సర్దార్ 2 సన్నాహాలు
కార్తి.. పోలీసు అధికారిగా, రా ఏజెంటుగా తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్న చిత్రం ‘సర్దార్’. పీఎస్ మిత్రన్ తెరకెక్కించారు. దీనికి కొనసాగింపుగా ‘సర్దార్ 2’ రూపొందుతున్న సంగతి తెలిసిందే. -
రామోజీ ఫిల్మ్సిటీలో తమ్ముడు
నితిన్ కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై తెరకెక్కుతున్న చిత్రం ‘తమ్ముడు’. సప్తమిగౌడ కథానాయిక. శ్రీరామ్ వేణు దర్శకత్వం వహిస్తున్నారు. దిల్ రాజు, శిరీష్ నిర్మాతలు. -
ఒక నటికి ఇంతకంటే ఏం కావాలి?
‘‘ప్రేక్షకుడికి ఒక మంచి సినిమాని ఇవ్వాలనే ఆలోచన తప్ప మిగతా ఏ రకమైన ఒత్తిడీ నాపైన ఉండదు. తెలుగు సినిమా.. నటిగా నాకు రెండో జీవితాన్నిచ్చింది. తెలుగు ప్రేక్షకులు నన్ను వాళ్ల సొంతం చేసుకున్నారు. -
గ్రామీణ ప్రేమకథ
పృథ్వీ కథానాయకుడిగా పాలిక్ శ్రీను దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. అంబిక, రూపాలి కథానాయికలు. దుర్గం రాజేశ్, రావుల రమేశ్, టి.ఎస్.రాజు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
కనులెందుకో కలిసేనులే...
సుధీర్బాబు కథానాయకుడిగా తెరకెక్కుతున్న చిత్రం ‘హరోం హర’. ది రివోల్ట్.. అనేది ఉపశీర్షిక. మాళవిక శర్మ కథానాయిక. జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. సుమంత్.జి నాయుడు నిర్మాత. -
ప్రేమిస్తే.. పూర్తిగా నమ్మేస్తా!
దాదాపు మూడేళ్ల విరామం తర్వాత ‘దో ఔర్ దో ప్యార్’తో ప్రేక్షకుల ముందుకొచ్చింది ఇలియానా. ‘దేవదాసు’లో భానుమతిగా తెలుగు ప్రేక్షకులకు ఎప్పుడో దగ్గరైన తను.. ఈ చిత్రంలో నటనకు మంచి మార్కులే కొట్టేసింది. -
యాక్షన్ రుచి చూపించే.. బేబీ జాన్
‘బేబీ జాన్’గా ప్రత్యర్థులకు తన యాక్షన్ రుచి చూపించేందుకు సిద్ధమవుతున్నాడు బాలీవుడ్ కథానాయకుడు వరుణ్ ధావన్. కాలీస్ దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న చిత్రమే ‘బేబీ జాన్’. -
ఇది నా అదృష్టం: అమితాబ్
ప్రఖ్యాత గాయని లతా మంగేష్కర్ పేరుతో ఏర్పాటు చేసిన లతా దీనానాథ్ మంగేష్కర్ పురస్కారాన్ని బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్ బుధవారం స్వీకరించారు. 2022లో మరణించిన లత జ్ఞాపకార్థం ఈ పురస్కారాన్ని ఏర్పాటు చేశారు. -
ఉత్తమ దర్శకుడు.. కరణ్ జోహార్
దర్శకనిర్మాత కరణ్జోహార్ ఈ ఏడాది మేటి దర్శకుడి పురస్కారానికి ఎంపికయ్యారు. బుధవారం దిల్లీలో.. ఆల్ ఇండియా మేనేజ్మెంట్ అసోసియేషన్ (ఏఐఎంఏ) ఆధ్వర్యంలో నిర్వహించిన తొమ్మిదో లీడర్షిప్ కాన్క్లేవ్లో భారత ఉపరాష్ట్రపతి... -
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
‘పొలిమేర’ నటి స్వతంత్ర అభ్యర్థిగా ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. -
‘నో యాడ్స్..’ ఇక కేవలం సినిమాలే!: పీవీఆర్ ఐనాక్స్ నిర్ణయం
పీవీఆర్ ఐనాక్స్ సంస్థ కీలక నిర్ణయం తీసుకుంది. ‘యాడ్ ఫ్రీ’ విధానంలో సినిమాలు ప్రదర్శించనున్నట్లు తెలిపింది. -
వెరైటీ డ్రెస్సులో అదాశర్మ పోజులు.. మెహందీతో మేఘా ఆకాశ్
సినీ తారలు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్న విశేషాలివీ..
తాజా వార్తలు (Latest News)
-
టీ20 ప్రపంచకప్నకు టీమ్ ఇండియాను మీరే ఎంపిక చేయండి!
-
సరిహద్దు దాటిన మానవత్వం.. భారతీయుడి దానంతో పాక్ యువతికి కొత్త జీవితం
-
టీ20 వరల్డ్ కప్.. ‘‘ధోనీ వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇస్తే బాగుంటుంది’’
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (25/04/24)
-
ఎన్నికల బరిలో ‘పొలిమేర’ నటి..
-
శిక్షణ నుంచి తప్పించుకున్న గుర్రాలు.. లండన్ వీధుల్లో హల్చల్!