‘వాలిమై’ ఫస్ట్‌లుక్‌ వచ్చేది అప్పుడే

అజిత్‌ కథానాయకుడుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వాలిమై’. హెచ్. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు.

Published : 15 Mar 2021 16:35 IST

ఇంటర్నెట్‌ డెస్క్‌: అజిత్‌ కథానాయకుడుగా తెరకెక్కుతోన్న చిత్రం ‘వాలిమై’. హెచ్. వినోద్‌ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రముఖ బాలీవుడ్‌ నిర్మాత బోనీ కపూర్‌ నిర్మిస్తున్నారు. అజిత్‌ ఫస్ట్‌లుక్‌ ఎప్పుడొస్తుందా? అని ఆసక్తిగా ఎదురుచూస్తోన్న అభిమానులకు తాజాగా శుభవార్త వినిపించారు బోనీ కపూర్‌. అజిత్‌ పుట్టిన రోజు సందర్భంగా  మే 1న ఫస్ట్‌లుక్‌ పాటు ప్రచారాన్నీ ప్రారంభించనున్నట్టు సామాజిక మాధ్యమాల వేదికగా తెలియజేశారు. ఈ సినిమాలో అజిత్ సరసన హ్యూమా ఖురేషీ నటిస్తోంది. యువ నటుడు కార్తికేయ ప్రతినాయకుడి పాత్ర పోషిస్తున్నారు. యువన్‌ శంకర్‌రాజా స్వరాలు సమకూరుస్తున్నారు. 

ఫస్ట్‌లుక్‌ కోసం అజిత్‌ అభిమానులు ఇటీవలే ట్విటర్‌లో వేదికగా చిత్ర బృందంపై ఒత్తిడి తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇంగ్లాండ్‌-ఇండియా మధ్య చెన్నైలో జరిగిన టెస్ట్‌ మ్యాచ్‌లో ఈ సినిమా అప్‌డేట్‌ కావాలంటూ అభిమానులు కోరడం వైరల్‌ అయింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని