Balakrishna: #NBK107లో ‘జయమ్మ’ ఫిక్స్

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న సరికొత్త చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్‌ చోటు దక్కించుకున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో..

Updated : 11 Jun 2021 12:40 IST

హైదరాబాద్‌: నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా నటించనున్న సరికొత్త చిత్రంలో ఓ ప్రముఖ హీరోయిన్‌ చోటు దక్కించుకున్నారు. గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమాలో కథానాయిక వరలక్ష్మి శరత్‌కుమార్‌ ఓ కీలకపాత్రలో కనిపించనున్నట్లు చిత్రబృందం స్పష్టం చేసింది. ఈ విషయంపై వరలక్ష్మి స్పందిస్తూ.. ‘‘క్రాక్‌’ అనంతరం నాకెంతో ఇష్టమైన దర్శకుడు గోపీచంద్‌ మలినేనితో కలిసి బాలయ్య సినిమా కోసం పనిచేయడం ఆనందంగా ఉంది. సెట్‌లోకి అడుగుపెట్టేందుకు ఎదురుచూస్తున్నాను’ అని తెలిపారు.

వాస్తవ సంఘటనలను ఆధారంగా చేసుకుని తెరకెక్కుతోన్న ఈ సినిమాలో బాలయ్య ఫుల్‌ మాస్‌‌, పవర్‌ఫుల్‌ లుక్‌లో అలరించనున్నట్లు సమాచారం. తమన్‌ స్వరాలు అందించనున్నారు. మైత్రిమూవీ మేకర్స్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తోంది. గురువారం బాలకృష్ణ పుట్టినరోజు సందర్భంగా NBK107 గురించి అధికారిక ప్రకటన విడుదల చేసిన విషయం తెలిసిందే. మరోవైపు ఈ ఏడాది విడుదలైన ‘క్రాక్‌’లో జయమ్మగా నెగెటివ్‌ షేడ్స్‌ ఉన్న పాత్రలో వరలక్ష్మి అలరించి ప్రేక్షకుల నుంచి మంచి మార్కులు కొట్టేశారు.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని